Begin typing your search above and press return to search.

డ్రీమ్‌గ‌ర్ల్ హేమ‌మాలిని అత‌డికి దూరమ‌వ్వ‌డానికి కార‌ణం?

సీనియ‌ర్ న‌టి షబానా అజ్మీతో ముద్దు సన్నివేశం కారణంగా ధర్మేంద్ర ప్రస్తుతం మీడియా హెడ్ లైన్స్ లోకొచ్చారు

By:  Tupaki Desk   |   1 Aug 2023 4:15 AM GMT
డ్రీమ్‌గ‌ర్ల్ హేమ‌మాలిని అత‌డికి దూరమ‌వ్వ‌డానికి కార‌ణం?
X

సీనియ‌ర్ న‌టి షబానా అజ్మీతో ముద్దు సన్నివేశం కారణంగా ధర్మేంద్ర ప్రస్తుతం మీడియా హెడ్ లైన్స్ లోకొచ్చారు. ప్ర‌జ‌లు అభిమానుల్లో దీనిపై ర‌క‌ర‌కాలుగా చ‌ర్చ సాగుతోంది. అయితే ఇదే సంద‌ర్భంలో అత‌డి నుంచి భార్య‌ హేమ‌మాలిని ఎందుకు దూరంగా ఉంటోంది? అంటూ నెటిజ‌నుల్లో మ‌రో ఆస‌క్తిక‌ర‌ డిబేట్ మొద‌లైంది. నిజానికి హేమ‌మాలిని అతడికి రెండవ భార్య. కొద్ది రోజుల క్రితం అతడితో తన సంబంధం గురించి హేమ‌మాలిని మీడియాతో ముచ్చ‌టించారు. త‌మ‌కు వివాహం అయినప్పటికీ ఎందుకు క‌లిసి ఉండ‌డం లేదు? అనేదానిపై 74 ఏళ్ల‌ సీనియ‌ర్ న‌టి మాట్లాడుతూ.. త‌న త‌ల్లిదండ్రులు రెండో పెళ్లి చేసుకున్న అత‌డితో సంబంధాన్ని అంగీక‌రించ‌లేద‌ని తెలిపారు.

ఇది జరగాలని ఎవరూ కోరుకోరు. కానీ అది జరుగుతుందని అంగీకరించి ముందుకు సాగాలి. కాకపోతే ఒకరు తమ జీవితాన్ని ఎలా గడపాలని కోరుకుంటున్నారో అర్థం చేసుకోవడం అసాధ్యం. ప్రతి స్త్రీ ఒక సాధారణ కుటుంబం వలె భర్త పిల్లలను కోరుకుంటుంది. కానీ అప్పుడప్పుడు అనుకున్న‌వి అనుకున్నట్లుగా జరగవు.. అని హేమ‌మాలిని అన్నారు. ''నా గురించి నాకు భయం లేదు. నా వ‌ర‌కూ నేను గొప్ప‌గా ఉన్నాను. నా ఇద్దరు పిల్లలను నేను చక్కగా పెంచాను. వారు ఇప్పుడు పెద్దవాళ్లు అయ్యారు. ధర్మేంద్ర అన్ని సమయాల్లో మాతో ఉన్నారు. ఆయ‌న‌కు దూరంగా వేరే ఇంట్లో నివసించడం త‌ప్ప‌దు. నేను దానికి బాధ‌ప‌డ‌టం లేదు'' అని త‌న మ‌నోధైర్యం ఎలాంటిదో ప్ర‌ద‌ర్శించారు.

వాస్త‌వానికి ధ‌ర్మేంద్ర‌ గతంలో ప్రకాష్ కౌర్‌ను వివాహం చేసుకున్నాడు. 43 ఏళ్ల వైవాహిక జీవితంలో ప్రకాష్ కౌర్‌తో విడాకులు తీసుకోకుండానే డ్రీమ్ గర్ల్‌ను మళ్లీ పెళ్లి చేసుకున్న ధర్మేంద్రపై హేమమాలినికి ఎలాంటి ఫిర్యాదులు లేవు. ప్రస్తుతం ధర్మేంద్ర తన మాజీ భార్య ఆమె కుటుంబంతో నివసిస్తున్నారు.

హేమ మాలిని- జితేంద్ర పెళ్లి:

హేమ తల్లి జయ చక్రవర్తి తన కూతురిని హీరో జితేంద్రతో పెళ్లికి ఒప్పించార‌నే విషయం కొద్ది మందికి మాత్రమే తెలుసు. హేమ మాలిని తన జీవిత చరిత్రలో 'హేమ మాలిని: బియాండ్ ది డ్రీమ్ గర్ల్'లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. హేమ - జితేంద్ర రహస్య వివాహం కోసం చెన్నైకి వెళ్లినప్పటికీ సమాచారం లీక్ అయి ఒక‌ వార్తాపత్రికలో వెల్లడైంది. జితేంద్ర అప్పటి ప్రియురాలు, ఇప్పటి పెళ్లయిన శోభతో కలిసి ధర్మేంద్ర చెన్నై చేరుకున్నారు. ఈ జంట వ్యక్తిగతంగా వారి కుటుంబాల‌ను కలుసుకున్నారు. దీంతో హేమ‌మాలిని- జితేంద్ర‌ వివాహం రద్దు అయింది.

2 మే 1980న ఇరుకుటుంబాలు వ్య‌తిరేకించినా కానీ.. హేమ మాలిని- ధర్మేంద్ర అంద‌రినీ ఎదురించి వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ జంటకు ఇషా డియోల్ - అహానా డియోల్ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 87 సంవత్సరాల వయస్సులో ఉన్న ధర్మేంద్ర మొదటి భార్య ప్ర‌కాష్ కౌర్ కి సన్నీ డియోల్, బాబీ డియోల్, విజేత డియోల్, అజీతా డియోల్ అనే న‌లుగురు సంతానం ఉన్నారు.