Begin typing your search above and press return to search.

రాజమౌళి అప్డేట్ వచ్చేసింది.. ఊహించని బయోపిక్

దీంతో ఓ వర్గం ఫాన్స్ అయితే మహేష్ బాబు సినిమాకు సంబంధించిన అప్డేట్ ఏమైనా ఇస్తారా అని అనేక రకాలుగా చర్చించుకున్నారు

By:  Tupaki Desk   |   19 Sep 2023 5:20 AM GMT
రాజమౌళి అప్డేట్ వచ్చేసింది.. ఊహించని బయోపిక్
X

దర్శక ధీరుడు రాజమౌళి RRR సినిమా తర్వాత మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా క్లారిటీ అయితే వచ్చేసింది కానీ ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ అయితే రాలేదు. ఈ సినిమాపై జక్కన్న ఎప్పుడెప్పుడు అప్డేట్ ఇస్తాడా అని ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే నిన్నటి నుంచి రాజమౌళి ఒక అప్డేట్ ఇవ్వబోతున్నాడు అన్నట్లుగా సోషల్ మీడియాలో ఒక ప్రత్యేకమైన బజ్ కనిపించింది.

దీంతో ఓ వర్గం ఫాన్స్ అయితే మహేష్ బాబు సినిమాకు సంబంధించిన అప్డేట్ ఏమైనా ఇస్తారా అని అనేక రకాలుగా చర్చించుకున్నారు. కానీ అది కాదు అని చాలా తొందరగానే ఒక క్లారిటీ అయితే వచ్చేసిందే. నిర్మాతగా ఈసారి రాజమౌళి ఒక సరికొత్త సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు.

ఆయన తనయుడు కార్తికేయ ఈ సినిమా నిర్మాణ పనులు అన్నిటినీ కూడా చూసుకోబోతున్నాడు. మేడిన్ ఇండియా అనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఒక స్పెషల్ వీడియోను కూడా విడుదల చేశారు. ఇప్పటివరకు వెండి తెరపై ఎన్నో బయోపిక్స్ వచ్చాయి. అయితే ఈసారి ఇండియన్ సినిమాకు సంబంధించిన బయోపిక్ రాబోతోంది అని క్లారిటీ ఇచ్చారు.

అంటే ఇండియన్ సినిమాకుసంబంధించిన పుట్టుకను ఎదుగుదలను ఈ సినిమాలో చూపించబోతున్నట్లు ఒక హింట్ అయితే ఇచ్చేశారు. మేడిన్ ఇండియా అనే ఈ ప్రాజెక్టుకు బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నితిన్ కక్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. అతను ఇంతకుముందే ఫిల్మిస్తాన్ అనే సినిమా బ్యాక్ గ్రౌండ్ సినిమా అయితే చేశాడు. దానికి అనేక రకాల ప్రశంసలు అయితే వచ్చాయి.

అలాగే పలు కమర్షియల్ డ్రామా సినిమాలను కూడా తెరపైకి తీసుకువచ్చిన నితిన్ ఈసారి విభిన్నమైన తరహాలో సినిమా ప్రపంచం ఎలా మొదలైంది అనే కంటెంట్ ను తెరపైకి తీసుకురాబోతున్నాడు. మరి ఈ బయోపిక్ ఎలా ఉంటుందో చూడాలి. దర్శకుడు రాజమౌళి కథ చెప్పగానే ఎంతగానో ఇంప్రెస్ కొడుకు చేత ఈ సినిమాను భాగస్వామిగా తీసుకువస్తున్నారు.

ఇక రాజమౌళి తన తదుపరి ప్రాజెక్టు విషయంలో ఇప్పట్లో అయితే అప్డేట్ ఇచ్చే అవకాశం అయితే లేదు. మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్నాడు. అలాగే రాజమౌళి కూడా తన స్క్రిప్ట్ పనులు ఫినిష్ చేయాల్సి ఉంది. ఇక వీరి కలయికలో రాబోయే ప్రాజెక్టును వచ్చే ఏడాది సెట్స్ పైకి తీసుకువచ్చే అవకాశం ఉంది.