Begin typing your search above and press return to search.

మెగా Vs అల్లు: నాగబాబు అలా.. నిహారిక ఇలా!

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నాగబాబు పోస్టుపై నిహారిక స్పందిస్తూ.. సోషల్ మీడియాలో తన తండ్రి ఎప్పుడూ ఏదో ఒక దాని గురించి పోస్ట్ పెడుతూ ఉంటారని, ట్విట్టర్‌లోనే కాదు వాట్సాప్‌లో కూడా రోజూ ఏదో ఒక సూక్తి పెడుతుంటారని చెప్పింది.

By:  Tupaki Desk   |   6 Aug 2024 12:32 PM GMT
మెగా Vs అల్లు: నాగబాబు అలా.. నిహారిక ఇలా!
X

గత కొన్ని నెలలుగా మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్‌ కు చెందిన జనసేన పార్టీకి కాకుండా, ప్రత్యర్థి వైసీపీ పార్టీకి చెందిన తన స్నేహితుడికి మద్దతు పలకడంతో రచ్చ మొదలైంది. బన్నీని టార్గెట్ చేస్తూ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు అల్లు, మెగా కుటుంబాల మధ్య అంతా బాగానే ఉందని అనుకునే విధంగా తాజాగా నాగబాబు కామెంట్స్ చేశారు.

అల్లు అర్జున్ నంద్యాల వెళ్లొచ్చిన తర్వాత మెగా బ్రదర్ నాగబాబు చేసిన ఓ పోస్ట్ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. 'మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే' అంటూ ఆయన పెట్టిన పోస్ట్ నెట్టింట పెద్ద దుమారం రేపింది. ఆ పోస్ట్ డిలీట్ చేసినప్పటికీ, అప్పటికే అది బన్నీని ట్రోల్ చేయడానికి జన సైనికులుకు మెగా అభిమానులకు అవకాశం కల్పించింది. అయితే నాగబాబు లేటెస్టుగా అల్లు అర్జున్ గురించి మాట్లాడటంతో, ఇరు కుటుంబాల మధ్య సయోధ్య కుదిరిందని నెటిజన్లు భావిస్తున్నారు.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నాగబాబు.. చాలా రోజుల తర్వాత ఇన్స్టాగ్రామ్ లో చిట్ చాట్ నిర్వహించారు. ఫాలోవర్స్ అడిగే ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు తెలిపారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ గురించి ఏమైనా చెప్పగలరా? అని అడగ్గా.. బాగా కష్టపడే తత్వం కలిగిన వ్యక్తి అంటూ బన్నీ అంకితభావాన్ని కృషిని ప్రశంసించారు. అంతేకాదు 'పుష్ప 2' సినిమా కోసం ఎదురుచూస్తున్నానని తెలిపారు. ఈ స్టేట్మెంట్ రెండు కుటుంబాల మధ్య సంబంధాలు చక్కబడటానికి మార్గం సుగమం చేసిందని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.

అదే సమయంలో 'కమిటీ కుర్రోళ్ళు' ఈవెంట్ లో మెగా డాటర్ నిహారిక కొణిదెల స్పీచ్ విన్న తర్వాత మెగా ఫ్యామిలీలో అల్లు అర్జున్‌ని కావాలనే ఇగ్నోర్ చేసిందా? అనే చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది మా కుటుంబానికి బాగా కలిసొచ్చిందని చెప్పిన నిహారిక.. మా చరణ్ అన్న సినిమా ఆస్కార్స్ కి వెళ్లింది, మా పెదనాన్నకి పద్మవిభూషణ్ వచ్చింది, మా బాబాయ్ డిప్యూటీ సీఎం అయ్యారు అంటూ చెప్పుకొచ్చింది. కానీ తెలుగు సినిమా చరిత్రలోనే తొలిసారి నేషనల్ అవార్డ్ సాధించి చరిత్ర సృష్టించిన అల్లు అర్జున్ పేరుని మాత్రం ఆమె ప్రస్తావించలేదు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నాగబాబు పోస్టుపై నిహారిక స్పందిస్తూ.. సోషల్ మీడియాలో తన తండ్రి ఎప్పుడూ ఏదో ఒక దాని గురించి పోస్ట్ పెడుతూ ఉంటారని, ట్విట్టర్‌లోనే కాదు వాట్సాప్‌లో కూడా రోజూ ఏదో ఒక సూక్తి పెడుతుంటారని చెప్పింది. ఆయన పోస్ట్ చేసిన దానికి రీజన్ తెలియదు కానీ, ఇంట్లో మాత్రం ఆ టాపిక్ గురించి చర్చ జరగలేదని చెప్పింది. ఎవరు ఏ పని చేసినా ఎవరి రీజన్స్ వాళ్లకి ఉంటాయని, అన్ని విషయాల్లో అందరూ కలిసే ఉండాలని ఏం లేదు కదా అని పేర్కొంది. రాజకీయంగా, ఆధ్యాత్మికంగా ఎవరి ఇష్టం వాళ్లది. ఎవరికి నచ్చినట్లు వాళ్లు చేయొచ్చు. తన వరకూ మాత్రం దేనికైనా ఫ్యామిలీనే ఫస్ట్ అని చెప్పుకొచ్చింది.

మెగా - అల్లు ఫ్యామిలీ విభేదాలపై ఇటీవల నిర్మాత బన్నీ వాస్ కూడా స్పందించారు. ఇవన్నీ తాత్కాలికమైన ఎమోషన్స్ అని, ఒక్క మీటింగ్ లేదా డిన్నర్ తో అన్నీ ఇట్టే సమిసిపోతాయిని అన్నారు. అలాంటి సందర్భం రావాలని, అన్ని వివాదాలు తొలగిపోయి కుటుంబ సభ్యులందరూ ఎప్పటిలాగే కలిసే ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.