Begin typing your search above and press return to search.

ఈ బజ్ సరిపోలేదు నాని..

ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది.

By:  Tupaki Desk   |   28 July 2024 3:30 PM GMT
ఈ బజ్ సరిపోలేదు నాని..
X

నాచురల్ స్టార్ నాని గత ఏడాది దసరా, హాయ్ నాన్న సినిమాలతో రెండు సూపర్ హిట్స్ ని ఖాతాలో వేసుకున్నాడు. ఈ రెండు సినిమాలు నాని మార్కెట్ ని కూడా పెంచాయి. వరుసగా డిఫరెంట్ కథలతో మూవీస్ చేస్తూ నాని సక్సెస్ లు అందుకుంటున్నాడు. ఈ ఆగష్టు 29న సరిపోదా శనివారం సినిమాతో నాని ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అయ్యాడు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ప్రస్తుతం ఉంది. డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని చేస్తోన్న రెండో సినిమా ఇది. వీరిద్దరి కలయికలో అంటే సుందరానికి మూవీ వచ్చింది. ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. వివేక్ ఆత్రేయ మొదటి మూడు సినిమాలు కామెడీ కథలతోనే తెరకెక్కాయి. అయితే ఈ సారి జోనర్ మార్చి ఫ్యామిలీ అండ్ యాక్షన్ టచ్ చేసి కొత్త కథ చెప్పబోతున్నాడు. ఫ్యామిలీ అనేది కామన్ ఫ్యాక్టర్ అయిన ఈ సారి సరిపోదా శనివారం సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండబోతున్నాయని తెలుస్తోంది.

జేక్స్ బిజోయ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటి వరకు మూవీ నుంచి రెండు సాంగ్స్ ప్రేక్షకుల ముందుకి వచ్చాయి. అయితే ఇవి ఆశించిన స్థాయిలో ప్రేక్షకులకి కనెక్ట్ కాలేదనే కామెంట్స్ వస్తున్నాయి. ఫస్ట్ రిలీజ్ చేసిన మూవీ గ్లింప్స్ కి మంచి స్పందన వచ్చింది. ఎస్.జె. సూర్య బర్త్ డే సందర్భంగా అతని క్యారెక్టర్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. ఇది కొంత హైప్ క్రియేట్ చేసింది. అయితే మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ అందుకోవాలంటే ప్రస్తుతం ఈ సినిమాపై ఉన్న హైప్ సరిపోదనే మాట వినిపిస్తోంది.

సక్సెస్ అనేది రిలీజ్ తర్వాత పబ్లిక్ మౌత్ టాక్ మీద ఆధారపడి ఉంటుంది. అయితే మొదటి రోజు సాలిడ్ కలెక్షన్స్ రాబట్టాలంటే సినిమా కంటెంట్ జనాల్లోకి బలంగా వెళ్ళాలి. ఇది సాంగ్స్, టీజర్, ట్రైలర్ తోనే సాధ్యం అవుతుంది. అలాగే కథలో ఏదో కొత్తదనం ఉందనే విషయాన్ని పబ్లిక్ కి అర్ధమయ్యేలా చేయాలి. ఈ విషయంలో సరిపోదా శనివారం టీమ్ ఇంకా వెనుకబడి ఉందనే మాట వినిపిస్తోంది.

బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా కలెక్షన్స్ టార్గెట్ ని అందుకోవాలంటే మొదటి రోజు కలెక్షన్స్ చాలా ముఖ్యం. ఈ కలెక్షన్స్ ఎక్కువగా సాధించాలంటే పబ్లిక్ కి కనెక్ట్ అయ్యి సినిమా మీద అమాంతం ఎక్స్ పెక్టేషన్స్ పెంచే వీడియో కంటెంట్ కావాలి. చిత్ర యూనిట్ మాత్రం ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో స్లో ఫేజ్ లో ఉందనే మాట వినిపిస్తోంది. మరి ట్రైలర్ తో హైప్ పెంచుతారో లేదో చూడాలి. ఈ సినిమాలో ప్రియాంక ఆరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించింది. ఇతర కీలక పాత్రలలో అదితి బాలన్, మురళీ శర్మ, అజయ్, అజయ్ ఘోష్ మరియు శుభలేఖ సుధాకర్‌ కనిపించబోతున్నారు. వీరికి సంబందించిన పోస్టర్ చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేసింది.