Begin typing your search above and press return to search.

మరోసారి సలార్ పై బాంబు పేల్చిన జగపతి బాబు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్ డిజాస్టర్ అయ్యింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆదిపురుష్ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

By:  Tupaki Desk   |   16 July 2023 5:42 AM GMT
మరోసారి  సలార్ పై బాంబు పేల్చిన  జగపతి బాబు
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్ డిజాస్టర్ అయ్యింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆదిపురుష్ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో, ఫ్యాన్స్ ఆశలన్నీ సలార్ పైనే పెట్టుకున్నారు. కాగా, ఈ మూవీకి కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ విపరీతంగా ఆకట్టుకుంది.

ఈ మూవీ ఇటీవల షూటింగ్ అయిపోయినట్లు తెలుస్తోంది. కేజీఎఫ్ తో యశ్ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్, ప్రభాస్ ని ఎలా చూపిస్తాడా అని ఫ్యాన్స్ ఎంతో ఎదురు చూస్తున్నారు. అయితే, ఈ మూవీపై మరోసారి జగపతి బాబు బాంబు పేల్చాడు. గతంలో ఓసారి తాను సలార్ షూటింగ్ లో కేవలం ఐదు రోజులు మాత్రమే పాల్గొన్నాను అంటూ చెప్పడంతో ఫ్యాన్స్ కంగారుపడ్డారు. ఇలా అయితే, ఈ మూవీ షూటింగ్ ఎప్పటికి అవ్వాలా అని భయపడిపోయారు.

కానీ, టీజర్ రిలీజ్ అవ్వడంతో, మూవీ విడుదలకు రెడీ అవుతుండటంతో ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. కానీ, తాజాగా ఆయన మరోసారి ఈ మూవీ పై కామెంట్ చేశాడు. ఈ మూవీలో మొదటి నుంచి జగపతిబాబు మొయిన్ విలన్ అని అందరూ అనుకున్నారు. కానీ, తనకు , ప్రభాస్ కాంబినేషన్ లో ఒక్క సీన్ కూడా లేదు అని చెప్పాడు. దీంతో, అందరికీ అనుమానాలు మొదలయ్యాయి, హీరో, విలన్ ఒకే షాట్ లో కనిపించకపోవడం ఏంటి అనే చర్చ మొదలైంది.

అయితే, ఈ సలార్ మూవీ రెండు భాగాలుగా తీస్తున్నారనే విషయం తెలిసిందే. కాగా, రెండో భాగంలో వీరిద్దరూ ఎదురుపడే సీన్స్ ఉండి ఉండొచ్చు. కేజీఎఫ్ లో కూడా మొయిన్ విలన్ హీరోతో రెండో భాగంలోనే తలపడతాడు. ఇది ప్రశాంత్ నీల్ మార్క్ డైరెక్షన్ అయ్యి ఉండొచ్చు. కానీ, ఒక్కసారిగా జగపతి బాబు అలా చెప్పేసరికి మూవీ ఎలా వచ్చిందా అనే అనుమానాలు మాత్రం మొదలౌతున్నాయి.

ఇక ఈ చిత్రంలో శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. జగపతి బాబు తో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలు పోషిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. భువన్ గౌడ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు.