Begin typing your search above and press return to search.

చరణ్‌ కి జోడీగా జాన్వీ కపూర్‌... మరొకరు ఎవరూ లేరు!

జాన్వీ కపూర్‌ తో పాటు ఈ సినిమాలో మరో బాలీవుడ్‌ హీరోయిన్‌ ఉంటుందని, ఆమె పాత్రకు సంబంధించిన పలువురు పలు రకాలుగా ప్రచారం చేయడం జరిగింది.

By:  Tupaki Desk   |   25 Oct 2024 10:30 PM GMT
చరణ్‌ కి జోడీగా జాన్వీ కపూర్‌... మరొకరు ఎవరూ లేరు!
X

రామ్‌ చరణ్ హీరోగా ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందబోతున్న స్పోర్ట్స్ డ్రామా షూటింగ్‌ను నవంబర్‌ నుంచి ప్రారంభించబోతున్నారు. ఈ గ్యాప్‌ లో గేమ్‌ ఛేంజర్‌ను ముగించాలని రామ్ చరణ్ ప్రయత్నిస్తున్నారు. గేమ్‌ ఛేంజర్‌ తో సంబంధం లేకుండా వచ్చే నెల నుంచి బుచ్చిబాబు తన సినిమాను మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే హీరోయిన్‌ గా అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌ని ఎంపిక చేయడం జరిగింది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటించడం అనేది మంచి ఆలోచన అనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.

జాన్వీ కపూర్‌ తో పాటు ఈ సినిమాలో మరో బాలీవుడ్‌ హీరోయిన్‌ ఉంటుందని, ఆమె పాత్రకు సంబంధించిన పలువురు పలు రకాలుగా ప్రచారం చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు సెకండ్‌ హీరోయిన్‌ గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా బుచ్చిబాబు సన్నిహితులు రామ్‌ చరణ్ కి జోడీగా కేవలం జాన్వీ కపూర్ మాత్రమే నటించనుంది. మరో హీరోయిన్‌ ప్రస్తావనే లేదు. ఇప్పటి వరకు సెకండ్‌ హీరోయిన్‌ గురించిన చర్చలు జరపలేదని, అసలు కథలో ఆ అవసరం లేదు అనే అభిప్రాయంను వారు వ్యక్తం చేయడం జరిగింది. దాంతో ఈ సినిమాలో సింగిల్‌ హీరోయిన్‌ అని తేలిపోయింది.

బాలీవుడ్‌ లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అయినా ఇప్పటి వరకు జాన్వీ కపూర్ అక్కడ కమర్షియల్‌ హిట్స్ ను దక్కించుకోలేక పోయింది. అయినా సోషల్‌ మీడియాలో మాత్రం వరుసగా అందమైన ఫోటో షూట్స్ ను షేర్‌ చేయడం ద్వారా పాపులారిటీని సొంతం చేసుకుంది. ఆకట్టుకునే అందంతో పాటు ఈమె షేర్‌ చేసే ఫోటోలు వైరల్‌ అవ్వడంతో వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో జాన్వీ కపూర్‌ దేవర సినిమాతో మొదటి సక్సెస్ ను అందుకుంది. ఎన్టీఆర్‌ తో జాన్వీ కపూర్‌ జోడీ అదిరింది అంటూ చాలామంది కామెంట్స్ చేశారు.

తెలుగు లో మొదటి హిట్‌ ను సొంతం చేసుకున్న జాన్వీ కపూర్ ముందు ముందు టాలీవుడ్‌ లో మరిన్ని హిట్స్ ను సొంతం చేసుకుంటుంది అనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో జాన్వీ కపూర్ కి టాలీవుడ్‌ నుంచి మరిన్ని ఆఫర్లు వచ్చాయట. కానీ చరణ్ తో బుచ్చిబాబు చేస్తున్న సినిమా పూర్తి అయిన తర్వాత మాత్రమే కొత్త సినిమా షూటింగ్‌ ను చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అందుకే చరణ్‌ సినిమాలో నటించేందుకు జాన్వీ కపూర్‌ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. జాన్వీ కపూర్‌ దేవర సినిమాలో పల్లెటూరు అమ్మాయి పాత్రలో కనిపించింది. అలాగే చరణ్‌, బుచ్చిబాబు సినిమాలోనూ పల్లెటూరు అమ్మాయి పాత్రలో కనిపించబోతుంది.