Begin typing your search above and press return to search.

జాన్వీ క‌పూర్ తిరుమ‌ల సెంటిమెంట్ ఇదా విష‌యం!

శ్రీదేవి-బోనీక‌పూర్ దంప‌తులెప్పుడు క్ర‌మం త‌ప్ప‌కుండా తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకు నేవారు.

By:  Tupaki Desk   |   1 Sep 2024 3:30 PM GMT
జాన్వీ క‌పూర్ తిరుమ‌ల సెంటిమెంట్ ఇదా విష‌యం!
X

శ్రీదేవి-బోనీక‌పూర్ దంప‌తులెప్పుడు క్ర‌మం త‌ప్ప‌కుండా తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకు నేవారు. పిల్ల‌లు జాన్వీ క‌పూర్-ఖుషీ క‌పూర్ తో క‌లిసి రావ‌డం స్వామి వారి సేవ‌ల కొలువు దీర‌డం అన్న‌ది ఎప్ప‌టిక‌ప్పుడు జ‌రిగేది. ఏడాదిలో క‌నీసం నాలుగైదు సార్లైనా వెంక‌న్న సేవ‌లో ఉండేవారు. అయితే శ్రీదేవి స్వ‌ర్గ‌స్తులైన త‌ర్వాత బోనీక‌పూర్ రావ‌డం త‌గ్గించారు. అప్పుడ‌ప్పుడు రావ‌డం త‌ప్ప మునుప‌టిలా రావడం లేదు.

అయితే కుమార్తె జాన్వీ క‌పూర్ మాత్రం త‌ల్లి అన‌వాయితీని యధావిధిగా కొన‌సాగిస్తుంది. తానే సింగిల్ గా ఎన్నోసార్లు ద‌ర్శ‌న‌నానికి వ‌చ్చింది. అప్పుప్పుడు బోనీక‌పూర్, ఖుషీ క‌పూర్ తో .. వాళ్లెవ్వ‌రూ లేక‌పోతే తాను ఒక్క‌ర్తే ద‌ర్శ‌నం చేసుకునేది. అయితే అమ్మ‌డి జీవితంలో కి ప్రియుడు శిఖర్ ప‌హారియా వ‌చ్చిన త‌ర్వాత అతనితో పాటు జంట‌గా హాజ‌ర‌వ్వ‌డం ఈ మ‌ధ్య కాలంలో జ‌రుగుతుంది. ఆ మ‌ధ్య దేశంలో దేవాలయాలన్నింటిని జాన్వీ ప్రియుడితో క‌లిసి చుట్టేసింది.

ఆ క్ర‌మంలోనే తిరుప‌తి కూడా వ‌చ్చింది. మ‌రి ఇలా త‌రుచూ తిరుప‌తి రావడం ఎలా అల‌వాటైంది? అంటే అమ్మ‌డు మామ్ పేరు చెప్పింది. `అమ్మకి వెంక‌టేశ్వ‌ర స్వామి అంటే న‌మ్మ‌కం. త‌రుచూ తిరుమ‌ల వెళ్లేది. నాకూ అమ్మ వ‌ల్లే స్వామి పై భ‌క్తి ఏర్ప‌డింది. ఇంట్లో వాళ్లంతా పుట్టిన రోజుకు తిరుమ‌ల వెళ్ల‌డం ఓ సెంటిమెంట్ గా మారింది. స‌మ‌యం దొరికితే మెట్ల మార్గం ద్వారా కాలి న‌డుక‌న వెళ్తుంటా.

అలాగే ప్రతీరోజు క్ర‌మం త‌ప్ప‌కుండా పూజ చేస్తా. కుద‌ర‌న‌ప్పుడు స్తోత్రాలు చ‌దువుకుని మ‌న‌సులో దండం పెట్టుకుంటా. కొత్త సినిమా షూటింగ్ మొద‌లైన‌ప్పుడు స్వామి ఫోటో చూసుకుని కెమెరా ముందుకెళ్తా` అని తెలిపింది. ఇక జాన్వీ క‌పూర్ దేవ‌ర సినిమాతో తెలుగులో లాంచ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ స‌ర‌స‌న న‌టిస్తోంది.