Begin typing your search above and press return to search.

జాన్వీకి రాఖీ కానుక‌.. అభిమాని వెంట‌ప‌డి మ‌రీ..!

నలుపు రంగులో ఉన్న కార్గో ప్యాంట్ తెల్లటి క్రాప్ టాప్‌లో క‌నిపించిన జాన్వీ అక్క‌డ ఉన్న ఒక అభిమానికి రాఖీ కట్టారు. ఈ దృశ్యం క్ష‌ణాల్లో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

By:  Tupaki Desk   |   19 Aug 2024 5:04 PM GMT
జాన్వీకి రాఖీ కానుక‌.. అభిమాని వెంట‌ప‌డి మ‌రీ..!
X

జాన్వీ కపూర్ తన తరంలోని అత్యంత అద్భుతమైన నటీమణులలో ఒకరు. చ‌క్క‌ని నటన‌, అభినయంతో పాటు మైమ‌రిపించే ఫ్యాషన్ సెన్స్‌తో ల‌క్ష‌లాది మంది హృదయాలను గెలుచుకుంది. జాన్వీ ఎంతో స్నేహ‌శీలి. స‌హ‌చ‌రుల‌తో గొప్ప అనుబంధాన్ని కొన‌సాగిస్తుంది. సోష‌ల్ మీడియా అభిమానుల‌తో స‌న్నిహితంగా ఉంటుంది. అలాగే అభిమానుల‌తోను సరదాగా పరిహాసమాడుతుంది.

నేడు రాఖీ సంద‌ర్భంగా త‌న అభిమానికి జాన్వీ కపూర్ రాఖీ కట్టింది. 19 ఆగస్ట్ 2024న జాన్వీ కపూర్ ఒక మూవీ సెట్ వెలుపల కనిపించింది. అక్కడ ఫోటోగ్రాఫ‌ర్లు త‌న‌కు రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. నలుపు రంగులో ఉన్న కార్గో ప్యాంట్ తెల్లటి క్రాప్ టాప్‌లో క‌నిపించిన జాన్వీ అక్క‌డ ఉన్న ఒక అభిమానికి రాఖీ కట్టారు. ఈ దృశ్యం క్ష‌ణాల్లో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

అయితే జాన్వీ క‌పూర్ అత‌డికి రాఖీ క‌ట్ట‌గానే, సాంప్ర‌దాయం ప్ర‌కారం.. త‌న సోద‌రికి కానుక ఇచ్చేందుకు అత‌డు త‌న త‌న ఫ్యాంట్ జేబులో త‌డిమాడు. అత‌డు ధ‌నికుడు కాదు.. బ్యాంక్ బ్యాలెన్స్ ఉందో లేదో సందేహ‌మే. కానీ అత‌డు అన్నాచెల్లెళ్ల సాంప్ర‌దాయాన్ని నిల‌బెట్టాల‌ని ఆశ‌ప‌డ్డాడు. జాన్వీకి గిఫ్ట్ ఇచ్చి తీరాల‌న్న ప్ర‌య‌త్నం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. జాన్వీ అత‌డిని వారిస్తూ అక్కడి నుండి వెళ్లిపోవాల‌నుకుంది. అయితే తన సోదరికి షాగున్ కే పైసాను బహుమతిగా ఇవ్వడానికి తన వెంటే పరుగెత్తాడు. ఆ దృశ్యం నిజంగా హృదయాన్ని ఆక‌ట్టుకుంది. జాన్వీ అతడి నుండి డబ్బు తీసుకోవడానికి నిరాకరించినా కానీ.. ఆ కుర్రాడు త‌న‌కు ఏదైనా బహుమతి ఇవ్వడానికి తన శాయశక్తులా ప్రయత్నించాడు. ఆ తర్వాత జాన్వీ అసిస్టెంట్ తనకు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పాడు.

జాన్వీ కపూర్ వ్యక్తిగత జీవితం:

జాన్వీ కపూర్- శిఖర్ పహారియాతో అనుబంధంలో ఉంది. జాన్వీ మొదట దానిని ప్రైవేట్‌గా ఉంచింది. కానీ తరువాత ప్రేమను ధృవీకరించింది. ఈ జంట రెగ్యుల‌ర్‌గా రిలేష‌న్ షిప్ గోల్స్ ని నిర్దేశించుకుంటారు. శిఖర్ జాన్వీని చూసుకునే విధానం వారి బలమైన బంధానికి నిదర్శనం. జాన్వీ కుటుంబంతోను అత‌డు ఎంతో సన్నిహిత బంధాన్ని క‌లిగి ఉన్నాడు. శిఖ‌ర్ త‌మ వెంటే ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుంద‌ని బోనీ క‌పూర్ ఇంత‌కుముందు అన్నారు. శిఖర్ - జాన్వి కాలేజ్ డేస్ నుంచి స్నేహితులు. జాన్వీ సినీ అరంగేట్రానికి ముందు కూడా వారు కలిసి ఉన్నారు. అయితే కొంతకాలం విడిపోయినా ఆ ఇద్ద‌రూ ఒకరికోసం ఒకరు తిరిగి క‌లిసారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వస్తే జాన్వీ క‌పూర్ ప్ర‌స్తుతం బ్యాక్ టు బ్యాక్ తెలుగు సినిమాల్లో న‌టిస్తోంది. ఎన్టీఆర్ తో దేవ‌ర చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. వ‌చ్చే నెలాఖ‌రున రిలీజ‌వుతోంది. ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ తో బుచ్చిబాబు చిత్రంలో న‌టిస్తోంది.