Begin typing your search above and press return to search.

అక్కా-చెల్లి బోయ్ ప్రెండ్స ని వెంటేసుకుని మ‌రీ!

అనంత్ అంబానీ-రాధికా మ‌ర్చంట్ సంగీత్ కార్య‌క్ర‌మం ఎంత గ్రాండ్ గా సెల‌బ్రేట్ చేసారో తెలిసిందే.

By:  Tupaki Desk   |   8 July 2024 2:45 AM GMT
అక్కా-చెల్లి  బోయ్ ప్రెండ్స ని వెంటేసుకుని మ‌రీ!
X

అనంత్ అంబానీ-రాధికా మ‌ర్చంట్ సంగీత్ కార్య‌క్ర‌మం ఎంత గ్రాండ్ గా సెల‌బ్రేట్ చేసారో తెలిసిందే. పాప్ సింగ‌ర్ బీబ‌ర్ ఎంట్రీతో వేడుక ఎంతో వైభ‌వంగా హైలైట్ అయింది. వ‌చ్చిన అతిధులంద‌ర్నీ త‌న మ్యూజిక్ ప్ర‌పంచంలోకి తీసుకెళ్లిపోయాడు. ఓవైపు ధూంధాం సంబ‌రాలు..మ‌రోవైపు బీబ‌ర్ సంచ‌ల‌నంలో వేడుక నెవెర్ బిఫోర ఎవ్వెర్ ఆప్ట‌ర్ అన్న‌ట్లే సాగింది. ఈ వేడుక‌లో చాలా మంది బాలీవుడ్ సెల‌బ్రిటీలు పాల్గొన్నారు.


తాజాగా ఇదే ఈవెంట్ కి సిస్ట‌ర్స్ జాన్వీక‌పూర్, ఖుషీ క‌పూర్ కూడా ప్రియుల‌తో హాజ‌రైన‌ట్లు ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. భామ‌లిద్ద‌రు ప్రియుళ్ల‌ను వెంటేసుకుని వేడుక‌కు విచ్చేసారు. ఆ ఫోటోలు నెట్టింట లీక్ అయ్యాయి. జాన్వీ క‌పూర్ -శిఖ‌ర్ ప‌హారియా ఒక జంట‌గా, ఖుషీ క‌పూర్- వేదాంగ్ రైనా మ‌రో జంట‌గా వేడుక‌కి సంథింగ్ స్పెష‌ల్ గా నిలిచారు. ఇలాంటి పెళ్లికాని జోడీలెన్నో అంబానీ ఈవెంట్ లో ఉన్నాయి.

కానీ ఫేమ‌స్ అయిన జోడీ మాత్రం వీళ్ల‌దే. జాన్వీ క‌పూర్ వంగ‌పువ్వు రంగు ఔట్ ఫిట్ లో త‌ళుక్కున మ‌రిసింది. ఆ ప‌క్క‌నే ప‌హారియా కూడా ఉన్నాడు. అలాగే ఖుషీ క‌పూర్ పింక్ రంగు సారీలో మిరుమిట్లు గొలుపుతుంది. ఆ ప‌క్క‌నే వేదాంగ్ రైనా ఉన్నాడు. న‌లుగురు ఒకే ప్రేమ్ లో ఫోటోల‌కు ఫోజులిచ్చారు. అక్కా చెల్లి ఇద్ద‌రు ఇలా ఒకేసారి ప్రియల‌తో మీడియాకి చిక్క‌డం ఇదే తొలిసారి.

గ‌తంలో వేర్వేరు సంద‌ర్భాల్లో క‌లిసారు. కానీ న‌లుగురు ఒకేచోట మాత్రం క‌నిపించింది లేదు. దీంతో ఈ పిక్ పై ఆసక్తి సంత‌రించుకుంది. జాన్వీ ..శిఖ‌ర్ ప‌హారియాకి ఎంత ప్ర‌ధాన్య‌త ఇస్తుంద‌న్న‌ది క‌ర‌ణ్ టాక్ షోలో రివీల్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఖుషీ క‌పూర్ మాత్రం వేదాంగ్ గురించి పెద్ద‌గా హైలైట్ చేసింది లేదు. హీరోయిన్ గా డెబ్యూ పూర్త‌యితే అమ్మ‌డి యాక్టివిటీ కూడా స్పీడ‌ప్ చేస్తుంది.