Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ మ‌న‌సులు గెలుచుకుంటోంది

ఒక్కో సినిమాలో న‌టించేందుకు నేటిత‌రం క‌థానాయిక‌లు కోట్ల‌లో పారితోషికాలు అందుకుంటున్న సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   15 July 2024 3:57 AM GMT
ఎన్టీఆర్ ఫ్యాన్స్ మ‌న‌సులు గెలుచుకుంటోంది
X

ఒక్కో సినిమాలో న‌టించేందుకు నేటిత‌రం క‌థానాయిక‌లు కోట్ల‌లో పారితోషికాలు అందుకుంటున్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ హిందీ చిత్రాల్లో న‌టించేందుకు 5 కోట్ల వ‌ర‌కూ పారితోషికం అందుకుంటోంద‌ని ఇంత‌కుముందు క‌థ‌నాలొచ్చాయి. ఇప్పుడు టాలీవుడ్ డెబ్యూ మూవీ దేవ‌ర కోసం భారీ మొత్తంలో పారితోషికం అందుకుంటోంది.

అయితే పారితోషికం అందుకుని, కేవ‌లం న‌ట‌న‌లో త‌న పార్ట్ పూర్తి చేసి వెళ్లిపోవ‌డ‌మేనా? అంటే కానే కాద‌ని జాన్వీ క‌పూర్ నిరూపిస్తోంది. ఈ భామ తాను న‌టించే సినిమాల ప్ర‌మోష‌న్స్ ని ఎంతో బాధ్య‌త‌గా త‌న భుజాన వేసుకుని న‌డిపిస్తుంది. ఇంత‌కుముందు మిస్ట‌ర్ అండ్ మిసెస్ మాహి- రూహీ- మిలీ వంటి చిత్రాల ప్ర‌చారానికి జాన్వీ ఏం చేసిందో చూసారు నెటిజ‌నులు. క్రికెట్ నేప‌థ్యంలో రూపొందించిన మిస్ట్ అండ్ మిసెస్ మాహి చిత్రం ప్ర‌మోష‌న్ కోసం జాన్వీ త‌పించిన తీరు అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. సోష‌ల్ మీడియాలు స‌హా వీలున్న అన్ని వేదిక‌లపైనా జాన్వీ త‌న చిత్రాన్ని ప్ర‌మోట్ చేసుకుంది. క్రికెట్ స్టేడియంకి వెళ్లి ధోని పేరుతో బోలెడంత ప్ర‌చారం చేసుకుని అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

ఇప్పుడు త‌న టాలీవుడ్ డెబ్యూ మూవీ దేవ‌ర కోసం ఇదే స్ట్రాట‌జీని అనుస‌రిస్తోంది జాన్వీ. ప్ర‌చారంలో త‌న‌దైన ఒర‌వ‌డిని చూపిస్తూ బాధ్య‌త‌తో న‌డుచుకుంటున్న ఈ బ్యూటీ తార‌క్ అభిమానుల‌ను విప‌రీతంగా ఆక‌ర్షిస్తోంది. దేవ‌ర ప్ర‌చారం కోసం అవ‌కాశం ఉన్న ఏ వేదిక‌ను జాన్వీ విడిచిపెట్ట‌డం లేదు. జాన్వీ తన ఇటీవలి సోషల్ మీడియా పోస్ట్‌ల్లో అంబానీ పెళ్లి నుంచి ఫోటోల‌ను షేర్ చేస్తూనే మ‌ధ్య‌లో #తంగం అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించి దేవ‌ర‌కు ప్ర‌చారం చేసుకుంది. త‌న‌ పాత్ర తంగంను `నమ్మశక్యం కాని వినోదాత్మక పాత్ర‌` అని అభివర్ణించింది. దేవ‌ర‌ చిత్రంలో భాగమైనందుకు తన కృతజ్ఞతలు తెలియజేసింది.

దాదాపు 300కోట్ల బ‌డ్జెట్ తో రూపొందించిన దేవ‌ర చిత్రానికి కొర‌టాల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సంగ‌తి తెలిసిందే. దేవర: పార్ట్ 1 ఈ ఏడాది సెప్టెంబర్ 27న విడుదల కానుంది. ద‌స‌రా సెల‌వులే టార్గెట్ గా వ‌స్తోంది. ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ ముఖ్యమైన పాత్రలో నటించగా.. తార‌క్ - సైఫ్ మ‌ధ్య స‌న్నివేశాలు మ‌రో లెవ‌ల్లో అల‌రిస్తాయ‌ని చెబుతున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం దేవ‌ర‌కు ప్ర‌ధాన అస్సెట్ కానుంది. చిత్ర‌బృందం ఇంకా ప్ర‌చారంలో కొంత నెమ్మ‌దిగా ఉన్నా కానీ.. జాన్వీ ప్ర‌చారం ఫ్యాన్స్ లో ఉత్సాహం పెంచుతోంది. జాన్వీ ప్ర‌య‌త్నం ఎన్టీఆర్ అభిమానుల మ‌న‌సుల‌ను గెలుచుకుంటోంది.