Begin typing your search above and press return to search.

ఆమె త‌ర్వాతే జాన్వీనే అలా చేసిందా?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని నిత్యం లక్షలాదిమంది భ‌క్తులు ర‌క‌ర‌కాల రూపంలో మొక్కులు చెల్లిస్తుంటారు.

By:  Tupaki Desk   |   23 March 2024 6:19 AM GMT
ఆమె త‌ర్వాతే జాన్వీనే అలా  చేసిందా?
X

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని నిత్యం లక్షలాదిమంది భ‌క్తులు ర‌క‌ర‌కాల రూపంలో మొక్కులు చెల్లిస్తుంటారు. మెట్ల మార్గంలోనూ..న‌క‌డ‌దారిలోనూ ప్ర‌త్యేకంగా మొక్కులు తీర్చేవారెంతో మంది. ముఖ్యంగా మోకాళ్ల‌పై కూర్చుని ఏడుకొండ‌లు ఎక్కి మొక్కులు చెల్లించే వారు మ‌రెంతో మంది. మొత్తంగా 3550 మెట్లు..12 కిలోమీట‌ర్లు..నాలుగు గోపురాలు.. ఒక్క న‌మ్మ‌కంతో గోవిందా గోవిందా అంటూ స్వామివారి చెంత‌కు చేరుకుంటారు.

సాధార‌ణంగా ఇలాంటి దర్శ‌నాల‌కు సెల‌బ్రిటీలు కాస్త దూరంగా ఉంటారు. ప్ర‌త్యేక‌మైన మొక్కులు ఉంటే త‌ప్ప మెట్ల ద‌ర్శ‌నాన్ని ఎంచుకోరు. అయితే మొన్న‌టి రోజున అతిలోక సుంద‌రిశ్రీదేవి ముద్దుల కుమార్తె జాన్వీ క‌పూర్ మోకాళ్ల‌పై ఏడు కొండ‌లు ఎక్కి వెంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకున్న వైనం అంద‌ర్నీ ఎంతో ఆశ్చ‌ర్యానికి..సంతోషానికి గురి చేసిన సంగ‌తి తెలిసిందే. మొక్కును చెల్లిచ‌డం కోసం తాను సైతం అంటూ ఇలా ముందుకు రావ‌డం చూసి ఎంతో ముచ్చ‌టేసింది. స్వామి వారిని ఆమె ఎంత‌గా ఆరాదిస్తుంది అన్న విష‌యం మ‌రోసారి బ‌య‌ట ప‌డింది.

ఏడాదిలో నాలుగైదు సార్లు అయినా జాన్వీ క‌పూర్ సాధార‌ణ ద‌ర్శ‌నానికి కుటుంబంతో క‌లిసి వ‌స్తుంటుంది. ఎప్పుడూ వీ.వీఐపీ ద‌ర్శ‌నం చేసుకుని..తీర్ధ ప్ర‌సాదాలు తీసుకుని వెళ్లిపోతుంది. కానీ ఈసారి మాత్రం మోకాళ్ల‌పై మొక్కుని చెల్లించి స్వామి వారి మ‌న‌సుతో అంద‌రి మ‌న‌సును దోచేసింది. ఇంత‌వ‌ర‌కూ మోకాళ్ల‌పై మొక్కులు చెల్లించిన సెల‌బ్రిటీ హీరోయిన్లు ఎవ‌రైనా ఉన్నారా? జాన్వీకంటే ముందు ఒక‌రు ఉన్నారు. ఆమె నందిని రాయ్. 2022 లో నందిని రాయ్ ఇలాగే ఏడు కొండ‌లు మోకాళ్ల‌పై ఎక్కి మొక్కు తీర్చింది.

ఆ త‌ర్వాత మ‌ళ్లీ జాన్వీనే ఆ ఛాన్స్ తీసుకుంది. న‌డ‌క‌దారిలోనూ..మెట్ల మార్గంలోనూ న‌డిచి వెళ్లిన సెల‌బ్రి టీలు చాలా మంది ఉన్నారు. కానీ మోకాళ్ల‌పై మొక్కులు చెల్లించిన న‌టీమ‌ణులు మాత్రం వీరిద్ద‌ర‌నే అనాలి. ప్ర‌స్తుతం జాన్వీ క‌పూర్ కెరీర్ దేదీప్య‌మానంగా సాగిపోతున్న సంగ‌తి తెలిసిందే. `దేవ‌ర` సినిమాతో టాలీవుడ్ లో లాంచ్ అవుతోంది. అది రిలీజ్ కాకుండా రామ్ చ‌ర‌ణ్ 16వ చిత్రంలోనూ ఛాన్స్ అందుకుంది. ఇంకా జాన్వీ ఊ కొట్టాలే గానీ మిగ‌తా హీరోలంతా కూడా రెడీగా ఉన్నారు. అటు బాలీవుడ్ లోనూ అవ‌కాశా ల‌కు కొద‌వ‌లేదు. ఇలా కెరీర్ ప‌రంగా సంతోషంగా సాగిపోతుంది.