Begin typing your search above and press return to search.

జాన్వీ కపూర్ కొత్త యాంగిల్‌ కి సెల్యూట్‌...!

అయితే జాన్వీ కపూర్ మాత్రం వారికి విభిన్నం అంటూ తనకు తానే నిరూపించుకుంది.

By:  Tupaki Desk   |   25 May 2024 5:30 AM GMT
జాన్వీ కపూర్ కొత్త యాంగిల్‌ కి సెల్యూట్‌...!
X

సాధారణంగా హీరోయిన్స్ కు జనరల్ నాలెడ్జ్ తక్కువ ఉంటుందని, వారికి కరెంట్ అఫైర్స్ గురించి ఎక్కువగా తెలియదు అనే అభిప్రాయం ఉంది. చాలా మంది హీరోయిన్స్ ఇంటర్వ్యూలు మరియు ఇతర చిట్‌ చాట్ లు చూస్తే అది నిజమే అనిపిస్తుంది. అయితే జాన్వీ కపూర్ మాత్రం వారికి విభిన్నం అంటూ తనకు తానే నిరూపించుకుంది.

తాజాగా జాన్వీ కపూర్‌ నటించిన మిస్టర్ అండ్‌ మిస్ మహీ సినిమా విడుదల కి సిద్ధం అయ్యింది. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా జాన్వీ కపూర్ రెగ్యులర్‌ గా మీడియాలో కనిపిస్తుంది. జాన్వీ కపూర్‌ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఆమెను సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యేలా చేశాయి.

తాజా ఇంటర్వ్యూలో మహాత్మ గాంధీ మరియు బీఆర్‌ అంబేద్కర్‌ గురించిన వ్యాఖ్యలు చేసింది. వారి యొక్క గొప్పతనం తో పాటు, సమాజం కోసం వారు చేసిన సేవ ను, వారి వల్ల సమాజానికి జరిగిన మేలును వివరిస్తూ మాట్లాడింది. జాన్వీ కపూర్‌ మాటలకు యాంకర్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

ఇలాంటి విషయాల పట్ల మీకు ఉన్న నాలెడ్జ్ కి నాకు చాలా సంతోషంగా ఉంది, అంతే కాకుండా ఆశ్చర్యంగా ఉందని యాంకర్ అన్నాడు. సమాజంలో ఉన్న కుల వివక్ష మరియు దళితుల సంక్లిష్టతలను గురించి జాన్వీ కపూర్‌ చాలా వివరంగా మాట్లాడింది.

ప్రస్తుత సమాజంలో రావలసిన మార్పు గురించి ఆమె మాట్లాడటం అందరి దృష్టిని ఆకర్షించింది. మొత్తానికి ఇన్ని రోజులు గ్లామర్‌ షో తో లేదా సినిమాలతో మాత్రమే వార్తల్లో నిలిచిన జాన్వీ కపూర్‌ ఇప్పుడు లోతైన వ్యాఖ్యలు చేయడం గ్రేట్‌ అనిపించుకుంది. ప్రస్తుతం జాన్వీ కపూర్‌ కి నెటిజన్స్ సెల్యూట్‌ చేస్తున్నారు.

ఇక జాన్వీ సినిమాల విషయానికి వస్తే తెలుగు లో ఎన్టీఆర్‌ కి జోడీగా కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాను చేస్తుంది. మరో వైపు బుచ్చి బాబు దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ హీరోగా రూపొందుతున్న సినిమాలో కూడా జాన్వీ ఎంపిక అయ్యింది. ఈ రెండు సినిమాలతో టాలీవుడ్‌ లో జాన్వీ జెండా పాతడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.