Begin typing your search above and press return to search.

శ్రీ‌వారి ద‌ర్శ‌నంలో జాన్వీతో పాటు ఆ భ‌క్తుడెవ‌రు?

త‌న‌ సినిమా విడుదలకు ముందు జాన్వీకపూర్ శ్రీవారిని దర్శించుకోవడం అనవాయితీ

By:  Tupaki Desk   |   14 Aug 2024 12:33 PM GMT
శ్రీ‌వారి ద‌ర్శ‌నంలో జాన్వీతో పాటు ఆ భ‌క్తుడెవ‌రు?
X

త‌న‌ సినిమా విడుదలకు ముందు జాన్వీకపూర్ శ్రీవారిని దర్శించుకోవడం అనవాయితీ. మామ్ శ్రీ‌దేవి బాట‌లోనే మొక్కులు తీర్చుకోవ‌డంలో ఎంత‌మాత్రం ఆలస్యం చేయ‌దు. అంతేకాదు.. ప్ర‌తిసారీ చెన్నైలో శ్రీ‌దేవి నివ‌శించిన‌ ఇంటిని సంద‌ర్శించుకుని, స‌మీపం(2గం.ల ప్ర‌యాణ దూరం)లోనే ఉన్న తిరుప‌తిలోను జాన్వీ అడుగుపెడుతుంది. ఆ స‌మ‌యంలో వెంక‌న్న సామిని ద‌ర్శించుకుని తిరుగు ప్ర‌యాణం అవుతుంది.

అయితే ప్ర‌తిసారీ సామి వారిని ద‌ర్శించుకునే స‌మ‌యంలో జాన్వీతో పాటుగా మ‌రొక ముఖ్య‌మైన భ‌క్తుడు కూడా వేంచేస్తుండ‌డ‌మే ఇప్పుడు ప్ర‌జ‌ల‌తో పాటు అంద‌రిలోను చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. అత‌డు ఎవ‌రో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌ని లేదు. జాన్వీ క‌పూర్ స్నేహితుడు శిఖ‌ర్ ప‌హారియా. శిఖ‌ర్ రాజ‌కీయ నేప‌థ్యం ఉన్న ప్ర‌ముఖుడు. సుశీల్ కుమార్ షిండే మ‌న‌వ‌డు. షిండే మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ హ‌యాంలో కీల‌క బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించిన నాయ‌కుడు. జాన్వీతో ప్ర‌తిసారీ తిరుమ‌ల ద‌ర్శ‌నంలో అత‌డు మీడియాలోను హైలైట్ అవుతున్నాడు.

ఈ మంగ‌ళ‌వారం జాన్వీ- శిఖ‌ర్ శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు. తిరుమ‌ల‌లో దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందుకుని..ఆలయ అధికారులతో పట్టు వస్త్రాల స‌త్కారం అందుకుని జాన్వీ-శిఖ‌ర్ జంట తిరుగు ప‌య‌నం అయింది. ఆ స‌మ‌యంలో త‌న అభిమానుతో జాన్వీ సెల్ఫీలు దిగింది.

త‌దుప‌రి జాన్వీ త‌న పాన్ ఇండియ‌న్ సినిమా దేవ‌ర విడుద‌ల స‌మ‌యంలోను మ‌రోసారి తిరుమ‌ల వెంక‌న్న సామిని ద‌ర్శించుకునే వీలుంది. సెప్టెంబ‌ర్ చివ‌రిలో దేవ‌ర విడుద‌ల‌వుతున్న సంగ‌తి తెలిసిందే. దేవ‌ర‌తో పాటు చ‌ర‌ణ్ స‌ర‌స‌న బుచ్చిబాబు సినిమాలోను న‌టిస్తోంది.