Begin typing your search above and press return to search.

ఓటు వేసిన జాన్వీ.. క్యూలో టాప్ స్టార్లు

ప్ర‌స్తుతం దేవ‌ర- చ‌ర‌ణ్ త‌దుప‌రి చిత్రాల‌తో బిజీగా ఉన్న జాన్వీ కపూర్ కూడా తన ఓటు వేయడానికి ముంబైలోని సెయింట్ ఆన్స్ స్కూల్ ఓటింగ్ ప్రదేశానికి వెళ్ళింది. ఆమె రెయిన్ పింక్ సూట్ సెట్‌లో అద్భుతంగా కనిపించింది.

By:  Tupaki Desk   |   20 May 2024 5:20 AM GMT
ఓటు వేసిన జాన్వీ.. క్యూలో టాప్ స్టార్లు
X

లోక్‌సభ 2024 ఎన్నికలు ర‌స‌వ‌త్త‌రంగా సాగుతున్నాయి. తొలి నాలుగు ద‌శ‌ల ఎన్నిక‌లు పూర్త‌య్యాయి. ఇంత‌కుముందు టాలీవుడ్ స్టార్లు త‌మ ఓటు హ‌క్కును స‌ద్వినియోగం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఎన్నికలు ఐదవ దశలో ఉన్నాయి. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలలో 49 స్థానాల్లో ఓటింగ్ నేడు ప్రారంభమైంది. చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు ముంబైలో ఎన్నికలకు ముందు ఓటు వేయమని ప్రజలను ప్రోత్సహించారు. తద్వారా వారు తమ బాధ్యతను నిర్వర్తించారు. అక్షయ్ కుమార్, రాజ్‌కుమార్ రావు, జాన్వీ కపూర్‌లు ఓటు వేసిన మొదటి తార‌లుగా ఘ‌నుతికెక్కారు. పోలింగ్ బూత్ క్యూ నుంచి బ‌య‌టికి వ‌చ్చాక‌.. వారి ఫోటోలు ఇప్ప‌టికే వైర‌ల్ అయ్యాయి.

అక్షయ్ కుమార్ పోలింగ్ కేంద్రానికి చేరుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జాతీయ‌ మీడియా షేర్ చేసిన వీడియోలో అక్ష‌య్ ఆలివ్-గ్రీన్ షర్ట్‌లో ఎప్పటిలాగే డైన‌మిక్ గా కనిపించాడు. ప్ర‌స్తుతం దేవ‌ర- చ‌ర‌ణ్ త‌దుప‌రి చిత్రాల‌తో బిజీగా ఉన్న జాన్వీ కపూర్ కూడా తన ఓటు వేయడానికి ముంబైలోని సెయింట్ ఆన్స్ స్కూల్ ఓటింగ్ ప్రదేశానికి వెళ్ళింది. ఆమె రెయిన్ పింక్ సూట్ సెట్‌లో అద్భుతంగా కనిపించింది.

సెలబ్రిటీలు ఫర్హాన్ అక్తర్, జోయా , సన్యా మల్హోత్రా కూడా తమ ఓటు హక్కును సగర్వంగా వినియోగించుకున్న వారిలో ముందుగానే క్యూలో నిలబడి ఉన్నారు. స‌ల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, అమితాబ్ బ‌చ్చ‌న్ వంటి వారు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకునేందుకు ఉత్సాహంగా ఉన్నార‌ని మీడియాలో క‌థ‌నాలొస్తున్నాయి.