Begin typing your search above and press return to search.

జాన్వీ కపూర్‌ కి చెమటలు పట్టించారు..!

బాలీవుడ్ లో ఇటీవల ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన జాన్వీ కపూర్‌ వరుస షూటింగ్స్ కారణంగా ట్రావెల్‌ చేస్తూనే ఉంటుంది.

By:  Tupaki Desk   |   26 Jun 2024 12:29 PM GMT
జాన్వీ కపూర్‌ కి చెమటలు పట్టించారు..!
X

అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్‌ బాలీవుడ్‌ మరియు టాలీవుడ్‌ లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. బాలీవుడ్ లో ఇటీవల ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన జాన్వీ కపూర్‌ వరుస షూటింగ్స్ కారణంగా ట్రావెల్‌ చేస్తూనే ఉంటుంది.


ఇటీవల ముంబై ఎయిర్ పోర్ట్‌ లో జాన్వీ కపూర్ కి చేదు అనుభవం ఎదురైంది. అక్కడ తన గార్డ్స్ లేక పోవడంతో పాటు, ఎయిర్ పోర్ట్‌ సిబ్బంది కూడా లేని కారణంగా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఆమెను చుట్టుముట్టారు. సెల్ఫీ లు అంటూ ఆమెను ఇబ్బంది పెట్టడంతో పాటు ఫిజికల్‌ గా ఇబ్బంది పెట్టారట.


అందుకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. సాధారణంగా సెలబ్రిటీలకు ఇలాంటి పరిస్థితులు కామన్‌ గా జరుగుతూ ఉంటాయి. అయితే ఎయిర్ పోర్ట్‌ లో ఇలా జరగడం మాత్రం చాలా అరుదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కొన్ని నిమిషాల పాటు జాన్వీ కపూర్‌ ను చుట్టు ముట్టిన జనాలు ఆమెను అక్కడ నుంచి అడుగు కదలకుండా చేశారట. దాంతో జాన్వీ కపూర్ కి ముచ్చెమటలు పట్టి, అక్కడ నుంచి ఎలా బయట పడాలో తెలియక గుండె జారి పోయినంత పనైందట. ఈ విషయాన్ని జాన్వీ సన్నిహితుల వద్ద వెళ్లడించిందట.

ఇకపై జాన్వీ కపూర్ ఒంటరిగా ఎయిర్‌ పోర్ట్‌ కి వెళ్ల కూడదని కూ డా నిర్ణయించుకుందట. ఇక జాన్వీ సినిమాల విషయానికి వస్తే బాలీవుడ్‌ లో ప్రస్తుతం రెండు సినిమాలను చేస్తుంది. మరో వైపు టాలీవుడ్‌ లో ఈ అమ్మడు రెండు సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే.

హిందీ సినిమాల కంటే కూడా ఎక్కువగా అందరి దృష్టి టాలీవుడ్‌ సినిమాల మీద ఉంది. మొదటిది ఎన్టీఆర్‌ తో చేస్తున్న దేవర కాగా, రెండోది చరణ్‌ కు జోడీగా బుచ్చిబాబు దర్శకత్వంలో చేస్తున్న సినిమా. ఈ రెండు సినిమాలు జాన్వీ కపూర్ ను పాన్ ఇండియా స్టార్‌ హీరోయిన్‌ గా నిలపడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.