Begin typing your search above and press return to search.

ఆలియాను రీప్లేస్ చేసిన జాన్వీ?

కానీ అనూహ్యంగా మూడో భాగంలో జాన్వీ క‌పూర్ తో ఆలియాను రీప్లేస్ చేసార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. బ్లాక్ బ‌స్ట‌ర్ ఫ్రాంచైజీలో కొత్త 'దుల్హనియా' పాత్రలో జాన్వి న‌టించ‌నుంది.

By:  Tupaki Desk   |   6 Jan 2024 3:00 PM GMT
ఆలియాను రీప్లేస్ చేసిన జాన్వీ?
X

'బద్రీ కీ దుల్హనియా' , 'హంప్టీ శర్మ కీ దుల్హనియా' .. ఈ రెండు సినిమాలు భారీ విజయాన్ని సాధించాయి. ఇప్పుడు 'దుల్హనియా 3' సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. ధర్మ ప్రొడక్షన్స్ నాయికా ప్రధాన పాత్ర కోసం అలియా భట్‌ను ఎంపిక చేసుకుంద‌ని ఊహాగానాలు సాగాయి. కానీ అనూహ్యంగా మూడో భాగంలో జాన్వీ క‌పూర్ తో ఆలియాను రీప్లేస్ చేసార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. బ్లాక్ బ‌స్ట‌ర్ ఫ్రాంచైజీలో కొత్త 'దుల్హనియా' పాత్రలో జాన్వి న‌టించ‌నుంది. విజయవంతమైన ఫ్రాంఛైజీలో ఆలియా తన పాత్రను పునరావృతం చేయకపోవడానికి కారణం ఏమై ఉంటుందో తెలియ‌దు కానీ.. 2024లో ఆలియా క్ష‌ణం తీరిక లేని షెడ్యూళ్ల‌తో ఉండ‌డ‌మే దీనికి కార‌ణ‌మ‌న్న ఊహాగానాలు సాగుతున్నాయి. దుల్హనియా 3కి ఆలియా కాల్షీట్లు కేటాయించ‌లేక‌పోయి ఉండొచ్చ‌ని కూడా గుస‌గుస వినిపిస్తోంది.

ఇప్పుడు కరణ్ జోహార్ ఈ విషయంపై ఓపెన్ అయ్యాడు. ఈ వాదనలను తిప్పికొట్టాడు. ఈ వార్తలన్నీ కేవలం ఊహాగానాలేనని, అవాస్తవమని క‌ర‌ణ్ తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్‌లో కేజేవో ఇలా రాశాడు. ''ప్రతిరోజు ఉదయం నేను మేల్కొన్నప్పుడు ధర్మ ప్రొడక్షన్స్ అధికారిక ధృవీకరణ లేని వార్తలను ప్ర‌చురించే మీడియా సభ్యులను అభ్యర్థిస్తున్నాను.. దయచేసి ఒక ఫ్రాంచైజీ కొనసాగింపు గురించి లేదా త‌దుప‌రి సినిమా ప్రారంభోత్స‌వం గురించి ఊహించవద్దు!'' అని వ్యాఖ్యానించారు. ప్లాన్ ఆఫ్ యాక్ష‌న్ ఫలవంతం అయినప్పుడు మేము వివరాలను తెలియజేస్తాము! మా భవిష్యత్ చిత్రాల గురించి వెల్ల‌డించే విష‌యంలో మీ ఉత్సాహం చూసి మేము వినయపూర్వకంగా ఉన్నాము. అయితే గౌరవప్రదంగా ఊహాగానాలకు బదులుగా క‌చ్చితత్వంతో వ‌చ్చే వార్త‌ల‌ను ఇష్టపడతాము'' అని అన్నారు.

శశాంక్ ఖైతాన్ దర్శకత్వంలో 'దుల్హనియా 3'విభిన్న కథాంశం పాత్రలతో రూపొంద‌నుంది. మునుపటి భాగాలకు ఏ విధంగానూ కనెక్ట్ కాని క‌థాంశంతో మూడో భాగం తెర‌కెక్క‌నుంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ ఇప్పటికే ప్రారంభమైంది. మరికొన్ని నెలల్లో సెట్‌పైకి వెళ్లనుంది. ముఖ్యంగా జాన్వీకి ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ ఖాయ‌మైన‌ట్టేన‌ని కరణ్ ఇటీవల సూచ‌న ఇవ్వ‌డంతో ర‌క‌ర‌కాల ఊహాగానాలు సాగుతున్నాయి. జాన్వి ఇలాంటి చర్చలకు దూరంగా ఉన్నారు. కాఫీ విత్ కరణ్ 8 తాజా ఎపిసోడ్‌లో ఇలాంటి చాలా విష‌యాల‌కు క్లారిటీనిచ్చారు. ఈ ఎపిసోడ్ టెలీకాస్ట్ అవ్వ‌డానికి కొన్ని గంటల ముందు కరణ్ జాన్వీతో త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్ గురించి హింట్ ఇవ్వ‌డంపై అభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.