Begin typing your search above and press return to search.

జానీ మాస్టర్ కేసులో కొత్త ట్విస్ట్.. ఏం జరుగుతుందో?

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ప్రస్తుతం లైంగిక ఆరోపణల కేసులో అరెస్ట్ అయ్యి జైలు జీవితం గడుపుతున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   28 Sep 2024 6:21 AM GMT
జానీ మాస్టర్ కేసులో కొత్త ట్విస్ట్.. ఏం జరుగుతుందో?
X

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ప్రస్తుతం లైంగిక ఆరోపణల కేసులో అరెస్ట్ అయ్యి జైలు జీవితం గడుపుతున్న విషయం తెలిసిందే. గత మూడు రోజులుగా కస్టడీ విచారణ జరుగుతోంది. శనివారంతో జానీ మాస్టర్ కస్టడీ ముగియనుంది. దీంతో మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించి.. కోర్టులో హాజరుపర్చనున్నారు పోలీసులు. అయితే జానీని కలిసేందుకు అనుమతి అవ్వడంతో ఆయన భార్య అయేషా నిన్న ఇంటి నుంచి భోజనం తీసుకుని వెళ్లి కలిసింది.

ఆ సమయంలో కీలక వ్యాఖ్యలు చేసింది అయేషా. జానీ మాస్టర్ ఫ్యామిలీ విషయాలను మాత్రమే తనతో మాట్లాడారని తెలిపింది. పిల్లలను చాలా మిస్ అవుతున్నానని చెప్పినట్లు పేర్కొంది. ఆయన ఏ తప్పు చేయలేదని, తప్పు చేయకుండా ఎందుకు ఒప్పుకుంటారని ప్రశ్నించింది. కావాలనే కుట్ర చేస్తున్నారని ఆరోపించింది. జానీ నిజం ఒప్పుకున్నారంటూ వస్తున్న వార్తలు అబ్బదాలు అని చెప్పింది. ఆ అమ్మాయి (బాధితురాలు) కావాలని ఆరోపణలు చేసిందని, ఆమె ఏమి ఆశిస్తుందో తెలియదని వ్యాఖ్యానించింది.

అయేషా వ్యాఖ్యలు కొన్ని గంటలుగా వైరల్ అవుతుండగా.. ఇప్పుడు జానీ మాస్టర్ వ్యవహారంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. బాధితురాలిపై పలు ఆరోపణలు చేసిన అయేషా.. కొద్ది రోజుల క్రితం ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ లో ఫిర్యాదు చేసింది. కొరియోగ్రాఫర్‌ గా వర్క్ చేయడం కోసం తన భర్తను ఆమె ట్రాప్ చేసిందని ఆరోపించింది. ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది. తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

"కొన్నేళ్లుగా నాకు నరకం చూపించింది. ఒకసారి బలవన్మరణానికి పాల్పడేలా చేసింది. తనను పెళ్లి చేసుకోమని జానీ మాస్టర్ ను చాలా ఇబ్బంది పెట్టింది. నా దగ్గరికి రాకుండా అడ్డుకుంది. రోజులో కొన్ని గంటలు మాత్రమే నా దగ్గరికి పంపేది. ఒకసారి నేను ఆమె ఇంటికి వెళ్లాను. జానీ మాస్టర్ అంటే నీకు ఇష్టమైతే.. నేను ఆయన లైఫ్ లో నుంచి వెళ్ళిపోతా అని కూడా చెప్పాను. అప్పుడు ఆమె నాకు జానీ మాస్టర్ అన్నయ్య అని చెప్పింది. నేను వదిన అవుతా అనింది. అప్పుడు నా భర్త పై అనేక ఆరోపణలు చేసింది" అని తన ఫిర్యాదులో అయేషా ఆరోపించినట్లు తెలుస్తోంది.

"అయితే ఆమె చేసిన పనులు నచ్చక జానీ మాస్టర్ దూరం పెట్టారు. దీంతో కక్ష సాధింపు చర్యలకు దిగింది. కావాలనే ఆరోపణలు చేసి కేసు పెట్టింది. ఆమె తల్లి కూడా అనేక ఇబ్బందులు పెట్టింది. అందుకే ఆమెపై చర్యలు తీసుకోండి. నాకు న్యాయం చేయండి. నాతో పాటు నా పిల్లలకు ఏం జరిగినా వాళ్ళదే బాధ్యత. అందుకే నాకు దయచేసి న్యాయం జరిగేలా చూడండి" అని ఫిర్యాదులో అయేషా కోరింది. మరి దీనిపై ఫిల్మ్ ఛాంబర్ ఎలా స్పందిస్తుందో చూడాలి.