Begin typing your search above and press return to search.

వాట్సాప్ లో కల్కి సెలబ్రేషన్స్.. కల్కి 2 షూటింగ్ అప్డేట్..!

ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వచ్చిన కల్కి 2898 AD సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   30 Aug 2024 6:02 AM GMT
వాట్సాప్ లో కల్కి సెలబ్రేషన్స్.. కల్కి 2 షూటింగ్ అప్డేట్..!
X

ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వచ్చిన కల్కి 2898 AD సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. వైజయంతి మూవీస్ బ్యానర్ లో 500 కోట్ల పైన బడ్జెట్ తో తెరకెక్కిన కల్కి మొదటి భాగం ఆడియన్స్ కు విజువల్ ఫీస్ట్ అందించింది. హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తగ్గని విధంగా వి.ఎఫ్.ఎక్స్ ఎఫెక్ట్స్ తో కల్కి అదరగొట్టేసింది. 1100 కోట్ల పైన కలెక్షన్స్ తో బాక్సాఫీస్ పై ప్రభాస్ స్టామినా ఏంటన్నది చూపించిన కల్కి సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొనె కూడా తమ పాత్రలతో ఫ్యాన్స్ ని మెప్పించారు.

ఐతే కల్కి సినిమా రెండో భాగం ఎప్పుడు మొదలవుతుంది. అందులో ఏం ఉండబోతుంది అన్నది ఆడియన్స్ కి చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. ఈ డౌట్స్ కి క్లారిటీ ఇచ్చారు కల్కి నిర్మాతలు స్వప్న దత్, ప్రియాంక దత్. రష్యాలో మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ వీక్ లో పాల్గొన్న వీరు కల్కి సినిమాకు వరల్డ్ సినీ లవర్స్ నుంచి వచ్చిన ప్రేమ తమని చాలా సంతోషపెట్టిందని అన్నారు. సినిమా రిలీజైన టైం లో వరల్డ్ వైడ్ గా చాలామంది నుంచి చాలా ప్రశంసలు వచ్చాయని అన్నారు.

కల్కి సక్సెస్ సెలబ్రేషన్స్ మేము జరపలేదని.. ప్రస్తుతం కల్కి సక్సెస్ సెలబ్రేషన్స్ అన్ని వాట్సాప్ లోనే జరుగుతున్నాయని అన్నారు. ఐతే కల్కి 2 జనవరి, ఫిబ్రవరి లో మొదలవుతుందని చెప్పారు నిర్మాతలు. ఐతే అంతకుముందు కల్కి గురించి వైజయంతి బ్యానర్ అధినేత అశ్వనిదత్ కూడా కల్కి సినిమాలో కమల్ హాసన్ సర్ రావడం తో సినిమా రెండో భాగం అవసరమని డైరెక్టర్ ఫిక్స్ అయ్యారని. ఒక సినిమాగా చేద్దామనుకున్న టైం లో ఈ పాత్రలన్నీ చూసి సినిమా రెండు భాగాలుగా చేయాలని నిర్ణయించుకున్నామని అన్నారు. అంతేకాదు కల్కి రెండో భాగానికి సంబంధించిన కొంత పార్ట్ షూటింగ్ కూడా పూర్తైందని చెప్పారు.

కల్కి 2898 AD సినిమాతోనే నాగ్ అశ్విన్ ఒక అద్భుతాన్ని సృష్టించగా ఇక సెకండ్ పార్ట్ లో కథ ఎలా ఉండబోతుంది. ఇతిహాసాలకు ముడి పెట్టి కల్కిని తీసిన నాగ్ అశ్విన్ ఇందులో ఎవరిని హీరోగా చూపించబోతున్నారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ రెండో భాగం లో ఎవరు ఎవరితో ఫైట్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.