Begin typing your search above and press return to search.

కల్కి.. క్యామియోలన్నీ నిజమయ్యాయ్!

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీ థియేటర్లలోకి వచ్చేసిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   27 Jun 2024 5:26 AM GMT
కల్కి.. క్యామియోలన్నీ నిజమయ్యాయ్!
X

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీ థియేటర్లలోకి వచ్చేసిన విషయం తెలిసిందే. టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మించారు. రిలీజ్ కు ముందు భారీ అంచనాలు నెలకొల్పిన కల్కి.. వాటి తగ్గట్లే దూసుకుపోతోంది. మూవీ అదిరిపోయిందని నెటిజన్లు రివ్యూస్ ఇస్తున్నారు. నాగికి ప్రభాస్ ఫ్యాన్స్ థ్యాంక్స్ చెబుతున్నారు.

ఈ సినిమాలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ, మాళవిక నాయర్, అన్నా బెన్, శోభన, పశుపతి, రాజేంద్రప్రసాద్ సహా ఎందరో నటీనటులు యాక్ట్ చేశారు. మూవీ రిలీజ్ కు ముందు వారి లుక్స్ ను కూడా విడుదల చేశారు మేకర్స్. అయితే వారితో పాటు ఇంకెందరో సినిమాలో భాగమైనట్లు ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తోంది. వారందరినీ మేకర్స్.. సర్ప్రైజింగ్ గా స్క్రీన్ పై చూపించనున్నారని వార్తలు వచ్చాయి.

ఇప్పుడు ఆ వార్తలే నిజమయ్యాయి. దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ సినిమాలో ఉన్నట్లు నాగ్ అశ్విన్ నిన్ననే చెప్పినా.. మూవీ రిలీజ్ అయ్యాక అంతా షాక్ అయ్యారు. వారిద్దరి పాత్రలు అదిరిపోయాయి. అయితే విజయ్, దుల్కర్ తో పాటు డైరెకర్లు రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, అనుదీప్ సినిమాలో కనిపించారు. హీరోయిన్లు మృణాల్ ఠాకూర్, ఫరియా అబ్దుల్లా కూడా సందడి చేశారు. వీరందరి పాత్రలకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

మొత్తానికి నాగ్ అశ్విన్.. అనుకున్నట్లు అనేక మందిని రంగంలోకి దించేశారని నెటిజన్లు చెబుతున్నారు. బాలీవుడ్ టు మాలీవుడ్.. అన్ని ఇండస్ట్రీలను టచ్ చేశారని అంటున్నారు. అందరినీ క్యామియో రోల్స్ లో నాగి బాగా చూపించారని కొనియాడుతున్నారు. ఏదేమైనా నాగ్ అశ్విన్ టాలెంటే వేరని ప్రశంసలు కురిపిస్తున్నారు. అద్భుతంగా కాశీ, కాంప్లెక్స్, శంభాలా ప్రపంచాలను తీర్చిద్దిదారని చెబుతున్నారు సినీ ప్రియులు.

పురాణాల నుంచి తీసుకున్న కాన్సెప్ట్ కు సైన్స్ ను యాడ్ చేసి కల్కి సినిమా తెరకెక్కించినట్లు ఇప్పటికే తెలిపారు నాగ్ అశ్విన్. మూవీ కోసం ఐదేళ్లు స్పెండ్ చేసినట్లు కూడా చెప్పారు. మూవీ రిలీజ్ అయ్యాక ఎంతో కష్ట పడినట్లు ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు తన కష్టానికి తగ్గ ప్రతిఫలం అందుకున్నారు. మహానటి తర్వాత అందరి దృష్టిని ఆకర్షించిన నాగి.. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సంపాదించుకున్నారు.