Begin typing your search above and press return to search.

కల్కి 2898AD.. మెయిన్ విలన్ లో న్యూ ట్విస్ట్!

కచ్చితంగా జూన్ 27 తర్వాత ప్రపంచం మొత్తం కల్కి సినిమా గురించి మాట్లాడుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

By:  Tupaki Desk   |   20 Jun 2024 4:13 AM GMT
కల్కి 2898AD.. మెయిన్ విలన్ లో న్యూ ట్విస్ట్!
X

టాలీవుడ్ నుంచి జూన్ 27న రిలీజ్ కాబోయే మోస్ట్ అవైటెడ్ మూవీ కల్కి 2898ఏడీ. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఇండియన్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ మూవీగా కల్కి చిత్రం థియేటర్స్ లోకి రాబోతోంది. ఈ చిత్రంతో మన ఇండియన్ సినిమాని హాలీవుడ్ స్టాండర్డ్స్ కి నాగ్ అశ్విన్ తీసుకొని వెళ్లారనే మాట ఇప్పటికే వినిపిస్తోంది. కచ్చితంగా జూన్ 27 తర్వాత ప్రపంచం మొత్తం కల్కి సినిమా గురించి మాట్లాడుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

ఇప్పటికే ప్రేక్షకుల ముందుకొచ్చిన కల్కి 2898ఏడీ ట్రైలర్ మూవీ కంటెంట్ ఎలా ఉండబోతోందనేది స్పష్టం చేసింది. ఈ చిత్రంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ భైరవ పాత్రలో కనిపిస్తున్నాడు. బాలీవుడ్ బి అమితాబ్ బచ్చన్ అశ్వద్ధామ పాత్రలో నటించారు. యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ మూవీలో ప్రతినాయకుడి పాత్ర చేశారు అని హైలెట్ చేశారు. కల్కి 2898 ఏడీలో కలిపురుషుడు విలన్ గా కనిపిస్తాడని అందరూ భావించారు.

అయితే ట్రైలర్ చూసిన తర్వాత సుప్రీం యాస్మిన్ అనే కొత్త పేరు వినిపించింది. సుప్రీం యాస్మిన్ ని సినిమాలో విలన్ గా నాగ్ అశ్విన్ టీమ్ రిప్రజెంట్ చేసింది. ఈ సృష్టికి దేవుడొక్కడే… అతడే సుప్రీం యాస్మిన్ అంటూ ఓ డైలాగ్ ఉంటుంది. దీనిని బట్టి కల్కి 2898ఏడీ చిత్రంలో సుప్రీం యాస్మిన్ క్యారెక్టర్ లో కమల్ హాసన్ కనిపించబోతున్నారని అర్ధమవుతోంది.

అయితే కలిపురుషుడు క్యారెక్టర్ లో ఎవరు కనిపించబోతున్నారు అనే ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తోంది. కలి గురించి ఇండియన్ మైథాలజీలో చదివిన వారు అతను విజిబుల్ క్యారెక్టర్ కాదని, మనుషులలో ఉండే చెడుగుణాలే కల్కిని రిప్రజెంట్ చేస్తాయని కామెంట్స్ చేస్తున్నారు. సుప్రీం యాస్మిన్ కలి పురుషుడు క్యారెక్టర్ కి ప్రతీక అని పోస్ట్స్ చేస్తున్నారు.

నాగ్ అశ్విన్ టీమ్ అయితే దీనిపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. జూన్ 27న రిలీజ్ కాబోయే సినిమాలో సోషల్ మీడియాలో వినిపించే ప్రశ్నలన్నింటికి సమాధానాలు దొరకొచ్చు. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రెస్ మీట్ తాజాగా ముంబైలో జరిగింది. ఈ ఈవెంట్ లో కల్కి సినిమా గురించి ఇంట్రస్టింగ్ విషయాలని అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే పంచుకున్నారు. త్వరలో ఏపీలో గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. దాదాపు 600 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో వైజయంతి మూవీస్ పై అశ్వినిదత్ ఈ సినిమాను నిర్మించారు. ఇక సినిమాలో విజయ్ దేవరకొండ, నాని దుల్కర్ సల్మాన్ లాంటి వారు స్పెషల్ క్యారెక్టర్స్ లో కనిపించబొతున్నట్లు సమాచారం.