Begin typing your search above and press return to search.

త‌గ్గేదేలే..మ‌రో సంచ‌ల‌న చిత్రంతో కంగ‌న‌!

బాలీవుడ్ లో కంగ‌నా ర‌నౌత్ ఒంటరి పోరాటం సాగిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   4 Sep 2024 6:22 AM GMT
త‌గ్గేదేలే..మ‌రో సంచ‌ల‌న చిత్రంతో కంగ‌న‌!
X

బాలీవుడ్ లో కంగ‌నా ర‌నౌత్ ఒంటరి పోరాటం సాగిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే రిలీజ్ అవ్వాల్సిన `ఎమ‌ర్జెన్సీ` చిత్రం పై నీలి నీడ‌లు క‌మ్ముకున్నాయి. ఓవైపు సినిమాని బ్యాన్ చేస్తామంటూ హెచ్చ‌రిక‌లు.. మ‌రోవైపు నేరుగా సెన్సార్ బోర్డే రిలీజ్ కి షాక్ ఇచ్చింది. వివాదాస్ప‌ద స‌న్నివేశాలున్నాయంటూ సెన్సార్ క్లియ‌రెన్స్ ఇవ్వ‌క‌పోవ‌డంతో మ‌రోసారి వాయిదా వేసుకోవాల్సి వ‌చ్చింది. ఇప్పుడీ ఫేజ్ నుంచి `ఎమ‌ర్జెన్సీ` ఎలా బ‌య‌ట‌కు వ‌స్తుంది? అన్న‌ది చూడాలి.

ఇప్ప‌టికే అమ్మ‌డు సెన్సార్ తీరుపై సైతం త‌న‌దైన శైలి బాణాలు సంధించింది. ఈ నేప‌థ్యంలో తాగాజా కంగ‌న మ‌రో సినిమా ప్ర‌క‌ట‌న‌తో ప్ర‌కంప‌న‌లు రేపింది. ఏకంగా `భార‌త్ భాగ్య విధాత` అంటూ కొత్త టైటిల్ లో చిత్రాన్ని ప్ర‌క‌టించింది. కంగ‌న ప్ర‌ధాన పాత్ర‌లో మ‌నోజ్ త‌పాడియా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. సామాన్య జీవితాల్లోని హీరోయిజాన్ని ఆవిష్క‌రించే క‌థ ఇద‌ని స‌మాచారం.

ఈ క‌థ ఎన్నో భావోద్వేగాల‌తో స్పూర్తి దాయ‌కంగా సాగుతుంద‌ని మేక‌ర్స్ అంటున్నారు. `భార‌త్ భాగ్య విధాత` అన్న టైటిలే ఎంతో శ‌క్తివంత‌మైంది. నేష‌న‌ల్ ఎంథ‌మ్ జ‌న‌గ‌ణ మ‌న నుంచి ఈ గైటిల్ తీసుకున్నారు. ``జన గణ మన అధినాయక జయహే, భారత భాగ్య విధాద నుంచి టైటిల్ వ‌చ్చింది. ఇప్పుడు ఏకంగా జాతీయ గేయంపైనే సినిమా చేయ‌డంతో సంచ‌ల‌నంగా మారింది.

ఈ సినిమా ద్వారా కంగ‌న ప్ర‌జ‌ల‌కు ఎం చేప్పాల‌నుకుంటుంది? అన్న‌ది ఇప్ప‌టి నుంచే ఆస‌క్తిక‌రంగా మారింది. ఇందిరా గాంధీ విధించిన ఎమ‌ర్జెన్సీ మీద సినిమా చేస్తేనే పెద్ద ర‌చ్చ జ‌రుగుతోంది. అత్యాచారం చేస్తా? చంపేస్తామంటూ బెదిరింపులు ఎదుర్కుంటుంది. మ‌రిప్పుడు ఏకంగా నేష‌న‌ల్ ఎంథ‌మ్ నే టార్గెట్ చేసిన కంగ‌న‌పై ఎలాంటి విమ‌ర్శ‌లొస్తాయో చూడాలి.