Begin typing your search above and press return to search.

తన పిల్లలకు తల్లి ఎవరో చెప్పలేని స్థితిలో అగ్ర నిర్మాత!

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తాము ఎవరి కడుపున పుట్టామని అడుగుతున్నారని తెలిపారు.

By:  Tupaki Desk   |   9 July 2024 11:39 AM GMT
తన పిల్లలకు తల్లి ఎవరో చెప్పలేని స్థితిలో అగ్ర నిర్మాత!
X

బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ పెళ్ళి చేసుకోకుండానే తండ్రి అయిన సంగతి తెలిసిందే. 2017లో సరోగసీ విధానం (అద్దె గర్భం) ద్వారా ఆయన ఇద్దరు కవల పిల్లలకు తండ్రి అయ్యారు. వాళ్లిద్దరూ పెరిగి పెద్దవారయ్యే క్రమంలో, తమ తల్లి గురించి అడగడం ప్రారంభించారని కరణ్ చెప్పారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తాము ఎవరి కడుపున పుట్టామని అడుగుతున్నారని తెలిపారు.

చిన్న వయసులో పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్న కరణ్ జోహార్.. 44 ఏళ్ల వయస్సులో సరోగసీ ద్వారా యష్, రూహి అనే ట్విన్స్ ను స్వాగతించడం ద్వారా తండ్రి అనిపించుకోవాలనే తన చిరకాల వాంఛను నెరవేర్చుకున్నాడు. ఈ విధంగా తండ్రి అయిన ఫస్ట్ ఇండియన్ సెలబ్రెటీగా నిలిచారు. 81 ఏళ్ల కరణ్ తల్లి, హిరూ జోహార్‌ ఇద్దరు పిల్లల ఆలనా పాలనా చూసుకుంటోంది. కొడుకుతోపాటు మనవడు, మనవరాలికి కూడా తల్లిగా మారింది. ఇదే విషయాన్ని కరణ్ తన ఇంటర్వూలో ప్రస్తావిస్తూ, సింగిల్ పేరెంట్‌గా ఉండటం వల్ల కలిగే నష్టాల గురించి వివరించారు.

"ఇది మోడ్రన్ ఫ్యామిలీ. అసాధారణమైన పరిస్థితుల్లో 'మేము ఎవరి కడుపులో పుట్టాము?' వంటి ప్రశ్నలను కూడా నేను ఎదుర్కొంటున్నాను. మా అమ్మ నిజంగా అమ్మ కాదు.. ఆమె మా నాన్నమ్మ అని అంటున్నారు. నేను స్కూల్ కి వెళ్లి ఇలాంటి పరిస్థితిని ఎలా డీల్ చేయాలనే దానిపై కౌన్సిలింగ్ తీసుకుంటున్నాను. తల్లిదండ్రులుగా ఉండటం అంత సులభం కాదు." అని కరణ్ జోహార్ అన్నారు.

కరణ్ జోహార్ తన ఆత్మకథ 'యాన్ అన్‌సూటబుల్ బాయ్'లోనూ సరోగసి బిడ్డను దత్తత తీసుకోవాలనే కోరికను వ్యక్తం చేశాడు. పిల్లలు అపారమైన ప్రేమను అందించడానికి తల్లిదండ్రులుగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. అయితే సరోగసి ద్వారా తండ్రి అయిన తర్వాత కరణ్ ను దారుణంగా ట్రోల్ చేశారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో తన పిల్లలకు ఎంతో ప్రేమ, మద్దతు లభిస్తుందని అంటున్నాడు. యష్, రూహి గురించి ఏదైనా పోస్ట్ పెడితే అస్సలు నెగిటివ్ కామెంట్స్ కనిపించడం లేదని, కేవలం ఆప్యాయత మాత్రమే ఉందని కరుణ్ పేర్కొన్నారు.

తన కొడుకు బరువు పెరుగుతుండడం వల్లే తాను ఆందోళన చెందుతున్నానని కరణ్ జోహార్ చెప్పారు. షుగర్ ఎక్కువగా తిన్నప్పుడల్లా యశ్ బరువు పెరగడం గమనించాను. కానీ ఇప్పుడున్న వయసులో తను ఇష్టం వచ్చినట్లు బ్రతకాలని కోరుకుంటున్నాను కాబట్టి నేనేం చెప్పలేను. నా పిల్లలు వారి జీవితాలను వారు కోరుకున్న విధంగా జీవించాలని నేను భావిస్తున్నాను అని కరణ్ తెలిపారు.

ఇకపోతే కొన్ని నెలల క్రితం, కరణ్ జోహార్ తన కుమారుడు యష్, కూతురు రూహీల పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. "నా జీవితంలో ప్రకాశవంతమైన సూర్యకాంతులకు (x2) పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ ఇద్దరి రాకతో నా జీవితం మారిపోయింది" అంటూ కరణ్ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు. యష్ & రూహికి మాతృమూర్తిగా ఉన్నందుకు తన తల్లికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా తమ ఫ్యామిలీ ఫోటోని పంచుకున్నారు