Begin typing your search above and press return to search.

కరాటే కళ్యాణి ఎంటరయ్యింది !

గత కొన్నాళ్ళుగా హీరో రాజ్ తరుణ్, లావణ్యల వ్యవహారం ఎపిసోడ్ల మాదిరిగా రోజుకో మలుపు తిరుగుతున్నది.

By:  Tupaki Desk   |   12 July 2024 9:33 AM GMT
కరాటే కళ్యాణి ఎంటరయ్యింది !
X

గత కొన్నాళ్ళుగా హీరో రాజ్ తరుణ్, లావణ్యల వ్యవహారం ఎపిసోడ్ల మాదిరిగా రోజుకో మలుపు తిరుగుతున్నది. ఇటీవల నార్సింగి స్టేషన్ లో లావణ్య ఫిర్యాదుతో రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా, మయాంక్ మల్హోత్రాలపై కేసు నమోదయింది. అయితే తరచూ వివాదాస్పద అంశాలపై స్పందించే నటి కరాటే కళ్యాణి తాజాగా రాజ్ తరుణ్, లావణ్యల ప్రేమాయణంలో ఎంటరయ్యింది.

చట్టంలోని లొసుగులను అడ్డం పెట్టుకుని కొందరు తప్పించుకుంటున్నారు. నేరానికి పాల్పడ్డ ప్రతి ఒక్కరూ శిక్ష అనుభవించాలి. నేరం చేసిన వారికి భయం కలిగేలా చట్టాలలో మార్పు రావాలి అని కరాటే కళ్యాణి అభిప్రాయపడింది. నేరం చేస్తే కఠినశిక్ష తప్పదన్న విషయం ప్రజల్లోకి వెళ్లాలి అని తెలిపింది.

లావణ్య - రాజ్ తరుణ్ వ్యవహారం వారిద్దరి వ్యక్తిగతం అంటూనే లావణ్య రాజ్ తరుణ్ ను కోరుకుంటుందని, ఫిర్యాదు వెనక్కి తీసుకునేందుకు డబ్బులు అడుగుతుందని వాదనలో నిజం ఉండకపోవచ్చని, తినడానికి రూ.20 వేలు అడుగుతుంది అంటే లావణ్య పరిస్థితిని అర్దం చేసుకోవచ్చని కరాటే కళ్యాణి అన్నారు.

వ్యవహారం పోలీసుల వద్దకు వెళ్లినా రాజ్ తరుణ్ తల్లిదండ్రులు స్పందించకపోవడాన్ని ఆమె తప్పుపట్టారు. లావణ్య వాదనలో నిజం ఉన్నందునే వారు నోరు మెదపడం లేదని అన్నారు. గతంలో హేమ డ్రగ్స్ కేసులో దొరికినప్పుడూ కరాటే కళ్యాణి స్పందించడం గమనార్హం.