Begin typing your search above and press return to search.

అంబానీ పెళ్లిలో ర‌బ్బ‌రు బొమ్మ‌లు

కిమ్ కర్దాషియాన్ ఇటీవల తన సోదరి ఖోలే కర్దాషియాన్‌తో కలిసి అనంత్ అంబానీ - రాధిక మర్చంట్‌ల గ్రాండ్ వెడ్డింగ్ కోసం భారతదేశంలో అడుగుపెట్టిన సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   15 July 2024 3:48 AM GMT
అంబానీ పెళ్లిలో ర‌బ్బ‌రు బొమ్మ‌లు
X

కిమ్ కర్దాషియాన్ ఇటీవల తన సోదరి ఖోలే కర్దాషియాన్‌తో కలిసి అనంత్ అంబానీ - రాధిక మర్చంట్‌ల గ్రాండ్ వెడ్డింగ్ కోసం భారతదేశంలో అడుగుపెట్టిన సంగ‌తి తెలిసిందే. అమెరిక‌న్ రియాలిటీ టీవీ స్టార్ల‌ హాజరు ఇంటర్నెట్ లో చర్చనీయాంశంగా మారింది. సాంప్రదాయ భారతీయ వస్త్రధారణతో అద్భుతమైన దేశీ అవతారాలతో కోట్లాది మంది హృదయాలను దోచుకున్నారు. కర్దాషియాన్ సోదరీమణులు తమ ఫ్యాషన్ సెన్స్ తో పెళ్లిలో హెడ్ ట‌ర్న‌ర్స్ గా మారారు. ఐశ్వర్య రాయ్ బచ్చన్‌ సహా బాలీవుడ్ ప్ర‌ముఖుల‌తో సెల్ఫీలు షేర్ చేయ‌డం ద్వారా అభిమానుల హృద‌యాల‌ను కూడా గెలుచుకున్నారు. కిమ్ -ఖోలే భారతదేశంలోని సాంప్ర‌దాయ వివాహం తాలూకా శక్తివంతమైన, సాంస్కృతిక అనుభవాన్ని ప్రతి క్షణాన్ని ఆస్వాధించారు. అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ విలాసవంతమైన వివాహానికి హాజరైన తర్వాత కిమ్ కర్దాషియాన్ తన సొగసైన దేశీ రూపాన్ని ప్రదర్శించే అద్భుతమైన సెల్ఫీలు, ఫోటోల‌ను షేర్ చేయ‌డంతో అవి అభిమానులను ఆనందపరిచాయి.

ఇటీవల కిమ్ కర్దాషియాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో మంత్రముగ్దులను చేసే సెల్ఫీల‌ను షేర్ చేసి ఆకర్షించింది. కిమ్ త‌న‌దైన‌ సిగ్నేచర్ పౌట్ .. యూనిక్ మేకప్‌తో ఎరుపు రంగు బ్రాలెట్ టాప్, కాంబినేష‌న్ లెహంగా ధరించి ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించింది. త‌న‌ నుదుటిపై ఉన్న వ‌జ్రాభ‌ర‌ణాల జూకా ఎంతో అందంగా మెరిసింది. కిమ్ తో పాటు ఖోలే క‌ర్ధాషియ‌న్ అంద‌మైన వైట్ అండ్ వైట్ డిజైన‌ర్ లెహంగాలో ముగ్ధ మ‌నోహ‌రంగా క‌నిపించింది. సిస్ట‌ర్స్ ఇద్ద‌రూ పాపిడి బొట్లు పెట్టుకుని మేక‌ప్ సెన్స్ ప‌రంగా భార‌తీయ‌త సొబ‌గును అద్దారు. ప్ర‌స్తుతం ఈ యూనిక్ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది. క‌ర్ధాషియ‌న్ సిస్ట‌ర్స్ భార‌తీయ సంస్కృతి సాంప్ర‌దాయాల‌కు ఎంత‌గా విలువ ఇచ్చారో ఈ అవ‌తారాలు చెబుతున్నాయ‌ని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి అవ‌కాశం సిస్ట‌ర్స్ కి మ‌రోసారి వ‌స్తుందో లేదో అని కూడా కొంద‌రు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఫోటోల‌ను వీక్షించాక‌.. క‌ర్ధాషియ‌న్ సిస్ట‌ర్స్ ర‌బ్బ‌రు బొమ్మ‌ల్ని త‌ల‌పించారంటూ కొంద‌రు స‌ర‌దాగా కామెంట్ చేస్తున్నారు.

జూలై 12 -జూలై 13న అనంత్ - రాధికల గ్రాండ్ వెడ్డింగ్ మరియు శుభ్ ఆశీర్వాద్ వేడుకల్లో కిమ్ - ఖోలే కర్దాషియాన్ సంద‌డి చేసారు. ఈ సందర్భంగా మాజీ ప్ర‌పంచ సుంద‌రి ఐశ్వర్య రాయ్ బచ్చన్‌తో సంతోషకరమైన క్షణానికి సంబంధించిన ఫోటోల‌ను కిమ్ తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఇద్దరు దిగ్గజాలు కెమెరాకు ఫోజులిస్తూ ఆనందంతో మెరిసిపోతున్న ఫోటో అంద‌రినీ ఆక‌ట్టుకుంది. కిమ్ ఈ కార్యక్రమంలో నటుడు రణవీర్ సింగ్‌తో పోజులివ్వడం కనిపించింది. ఈ ఫోటోగ్రాఫ్ ర‌ణ్ వీర్ అభిమానులలో సంచలనాన్ని సృష్టించింది. కిమ్ - ఖోలే ఇద్దరు బాలీవుడ్ తారలతో క‌లిసి ఉన్న ఫోటోలు వెబ్ లో వైర‌ల్ గా దూసుకెళ్లాయి.

కిమ్ - ఖోలే గ‌త శుక్రవారం నాడు భారతదేశానికి తమ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఇక్క‌డికి రాగానే సరదాగా ఆటో రైడ్‌తో ముంబై మాన్‌సూన్‌లో షికార్ చేసారు. జాన్ సెనా, మైక్ టైసన్, మాజీ బ్రిట‌న్‌ ప్రధానమంత్రులు బోరిస్ జాన్సన్, టోనీ బ్లెయిర్, చెరీ బ్లెయిర్, అలాగే ప్రఖ్యాత స్టైలిస్ట్ లా రోచ్ వంటి ప్ర‌ముఖులు ఈ పెళ్లికి విచ్చేసారు. చాలా మంది బాలీవుడ్ ఎ-లిస్టర్‌లు ..గౌరవనీయమైన రాజకీయ ప్రముఖులు, క్రీడాకారుల‌ సమక్షంలో ఈ ఈవెంట్ వైభ‌వంగా జ‌రిగింది. ఈ సందర్భానికి గ్లామర్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌ను తెచ్చింది.