Begin typing your search above and press return to search.

కరీనా కపూర్.. మన కథపై ఫోకస్?

ఈ అమ్మడు సైఫ్ అలీఖాన్ ని పెళ్లి చేసుకొని కొంతకాలం సినిమాలకి గ్యాప్ ఇచ్చింది

By:  Tupaki Desk   |   20 Jun 2024 4:53 AM GMT
కరీనా కపూర్.. మన కథపై ఫోకస్?
X

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న బ్యూటీ కరీనా కపూర్. ఈ అమ్మడు సైఫ్ అలీఖాన్ ని పెళ్లి చేసుకొని కొంతకాలం సినిమాలకి గ్యాప్ ఇచ్చింది. మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసి లేడీ ఒరియాంటెడ్ కథలతో సత్తా చాటే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే క్రూ అనే మూవీతో కరీనా కపూర్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.

ఇప్పుడు మరో ఇంటరెస్టింగ్ కాన్సెప్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంట. హైదరాబాద్ లో జరిగిన ఓ యాధార్ధ సంఘటన ఆధారంగా చేసుకొని మేఘనా గుల్జర్ ఈ కథని సిద్ధం చేసారంట. గతంలో జరిగిన ఓ హత్యాచార ఘటన బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా కాన్సెప్ట్ ఉంటుందని తెలుస్తోంది. కంటెంట్ కరీనా కపూర్ కి నచ్చడంతో వెంటనే ఒకే చెప్పేసిందంట.

ఈ ఏడాది ఆఖరులో మూవీ షూటింగ్ ప్రారంభం అవుతుందంట. అయితే ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో చేస్తారా లేదంటే కథ బ్యాక్ డ్రాప్ ఏమైనా మారుస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఈ చిత్రంలో యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురానా కూడా కీలక పాత్రలో నటించనున్నాడంట. హైదరాబాద్ లో జరిగిన యాదార్థ సంఘటన ఆధారంగా చేసుకొని తెరకెక్కించనున్న మూవీ కావడంతో తెలుగులో కూడా రిలీజ్ చేస్తారా లేదా అనేది చూడాలి.

మరో వైపు సౌత్ లో కూడా ఈమె ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉందనే మాట వినిపిస్తోంది. ఇప్పటికే కరీనా కపూర్ భర్త, హీరో సైఫ్ అలీఖాన్ దేవర సినిమాతో టాలీవుడ్ లోకి విలన్ గా అడుగుపెడుతున్నారు. ఈ సినిమాలో అతని పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతోందనే మాట వినిపిస్తోంది.

యష్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న టాక్సిక్ సినిమా కోసం కూడా కరీనాని సంప్రదించారు. అయితే ఆమె డేట్స్ అడ్జస్ట్ చేయలేక మూవీ వదులుకుంది. దీంతో కరీనా స్థానంలో ఆ క్యారెక్టర్ కోసం నయనతారని కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. మరి సెకండ్ ఇన్నింగ్ లో లేడీ ఒరియాంటెడ్ కథలతో వరుస సినిమాలు చేస్తోన్న కరీనా కపూర్ ఏ మేరకు సక్సెస్ లు అందుకుంటుంది అనేది చూడాలి.