Begin typing your search above and press return to search.

ఆ రెండు హిట్ మూవీస్‌ మిస్ చేసుకున్న సూపర్‌ స్టార్‌!

కొన్ని కథలు మొదట ఒక హీరో వద్దకు వెళ్లినా ఏదో కారణం వల్ల మరో హీరో వద్దకు వెళ్లడం మనం చూస్తూనే ఉంటాం.

By:  Tupaki Desk   |   18 Oct 2024 7:30 AM GMT
ఆ రెండు హిట్ మూవీస్‌ మిస్ చేసుకున్న సూపర్‌ స్టార్‌!
X

కొన్ని కథలు మొదట ఒక హీరో వద్దకు వెళ్లినా ఏదో కారణం వల్ల మరో హీరో వద్దకు వెళ్లడం మనం చూస్తూనే ఉంటాం. చేతులు మారిన కథలు కొన్ని సూపర్‌ హిట్‌గా నిలువగా, కొన్ని ఫ్లాప్‌లుగా మిగలడం మనం చూస్తూ ఉంటాం. తమిళ యువ సంచలన దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో వచ్చిన సూపర్‌ హిట్‌ మూవీస్ మహాన్‌, జిగర్తాండ డబుల్‌ ఎక్స్ సినిమాల కథలు మొదట సూపర్‌ స్టార్ రజనీకాంత్‌ వద్దకు వెళ్లాయట. ఆ సమయంలో రజనీకాంత్ నుంచి సరైన స్పందన రాకపోవడంతో కార్తీక్ సుబ్బరాజ్ మరో హీరోతో సినిమాను చేయడం జరిగింది. సూపర్‌ హిట్‌ నేపథ్యంలో రజనీకాంత్‌ సినిమాను మిస్‌ అయ్యానని ఫీల్ అయ్యారట.

తాజాగా దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మహాన్‌ సినిమా కథను మొదట రజనీకాంత్‌ సర్ వద్దకు తీసుకు వెళ్లాను. ఆ సమయంలో కథ పూర్తిగా రెడీ చేసుకోలేదు. స్టోరీ లైన్ ను మాత్రమే సర్‌ కి చెప్పాను. ఆయన పూర్తి కథతో రావాల్సిందిగా సూచించారు. కానీ కొన్ని కారణాల వల్ల తాను మహాన్ సినిమాను విక్రమ్‌, ధృవ్‌లతో తీయడం కరెక్ట్‌ అనుకున్నాను. రియల్‌ లైఫ్ తండ్రి కొడుకులు అయిన వారిద్దరు మహాన్ లోని కీ రోల్స్‌ కి న్యాయం చేస్తారని భావించాను. ఆ తర్వాత జిగర్తాండ డబుల్‌ ఎక్స్‌ కాన్సెప్ట్‌ ను సైతం రజనీకాంత్‌ సర్‌ కి చెప్పాను. అది కూడా ఆయనతో తీయడం కుదరలేదు అని చెప్పుకొచ్చాడు.

రెండు సినిమాలు బేసిక్‌ లెవల్ లో ఉన్నప్పుడే రజనీకాంత్‌ కి చెప్పడం వల్ల ఆయన సరిగ్గా జడ్జ్ చేయలేక పోయారు. అందుకే ఆ రెండు సినిమాలను మిస్ అయ్యారు. అంతకు ముందు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్‌ పేట సినిమాను చేయడం జరిగింది.ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కనుక మరోసారి వీరి కాంబో మూవీ కోసం ప్రేక్షకులు వెయిట్‌ చేస్తున్నారు. విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరున్న కార్తీక్‌ సుబ్బరాజ్ ప్రస్తుతం సూర్యతో ఒక సినిమాను చేస్తున్నారు. కొన్ని కారణాల వల్ల ఆయన ఈ ఏడాది ఒక్క సినిమాను సైతం విడుదల చేయలేక పోయాడు. వచ్చే ఏడాది సూర్య సినిమాతో కార్తిక్ సుబ్బరాజ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

రజనీకాంత్‌ సినిమాల విషయానికి వస్తే ఇటీవల జై భీమ్‌ దర్శకుడు టీ జే జ్ఞానవేల్‌ రాజా దర్శకత్వంలో చేసిన వేట్టయాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తమిళనాట భారీ వసూళ్లు సాధిస్తున్న వేట్టయాన్‌ సినిమా తర్వాత రజనీకాంత్ కూలీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న కూలీ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంటుందనే నమ్మకం ను ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు. రజనీకాంత్‌ తో మరో సినిమా ఉంటుందా అనే ప్రశ్నకు తప్పకుండా ఆయనతో మళ్లీ సినిమా చేయాలని కోరుకుంటున్నట్లుగా కార్తీక్ సుబ్బరాజ్ చెప్పుకొచ్చారు.