Begin typing your search above and press return to search.

నేషనల్ అవార్డుతో 'కార్తికేయ 2' టీమ్

ఇక తాజాగా ఈ అవార్డుల వేడుక ఢిల్లీలో జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా నేషనల్ అవార్డులని గ్రహీతలు అందుకున్నారు.

By:  Tupaki Desk   |   9 Oct 2024 6:52 AM GMT
నేషనల్ అవార్డుతో కార్తికేయ 2 టీమ్
X

నిఖిల్ సిద్ధార్ధ్, చందూ మొండేటి కాంబినేషన్ లో వచ్చిన ‘కార్తికేయ 2’ ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాకు బెస్ట్ తెలుగు ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో నేషనల్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ అవార్డుల వేడుక ఢిల్లీలో జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా నేషనల్ అవార్డులని గ్రహీతలు అందుకున్నారు. కార్తికేయ 2 చిత్రానికి గాను నిర్మాత అభిషేక్ అగర్వాల్ ద్రౌపది ముర్ము నుంచి అవార్డు తీసుకున్నారు. ఈ అవార్డుల వేడుకకి హీరో నిఖిల్, డైరెక్టర్ చందూ మొండేటి కూడా హాజరయ్యారు.

అవార్డు అందుకున్న తర్వాత నిర్మాత, హీరో, దర్శకుడు కలిసి ఫోటోలకి ఫోజులిచ్చారు. నేషనల్ అవార్డు పత్రాలు అందుకొని వారు తమ ఆనందాన్ని పంచుకున్నారు. బెస్ట్ తెలుగు ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ‘కార్తికేయ 2’ సినిమా నేషనల్ అవార్డు అందుకోవడంపై వారందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇదిలా ఉంటే అభిషేక్ అగర్వాల్ బ్యానర్ లోనే నిఖిల్, చందూ మొండేటి ‘కార్తికేయ 3’ కి కూడా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ సారి సముద్రంలో ఉన్న ద్వారకా నేపథ్యంలో సినిమా కథని చెప్పబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ‘కార్తికేయ 2’ చిత్రాన్ని 25 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ లో సూపర్ సక్సెస్ అయ్యి 300 కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించింది. దీంతో ‘కార్తికేయ 3’ సినిమాని 100 కోట్లకి పైగా బడ్జెట్ తో విజువల్ స్పెక్టక్యులర్ గా సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించాలని అనుకుంటున్నారు.

ప్రస్తుతం చందూ మొండేటి నాగ చైతన్య హీరోగా ‘తండేల్’ మూవీ చేస్తున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గానే ఈ చిత్రం తెరకెక్కుతోంది. డిసెంబర్ లో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే 2025లో ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. మరో వైపు హీరో నిఖిల్ ‘స్వయంభు’ అనే మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా పీరియాడిక్ జోనర్ లో రాజుల కాలంనాటి కథాంశంతో ఉండబోతోంది. ఇప్పటికే ఈ సినిమా మెజారిటీ షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది.

అలాగే ‘ది ఇండియన్ హౌస్’ అనే మరో మూవీ కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా చేస్తున్నాడు. అభిషేక్ అగర్వాల్, రామ్ చరణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్ గా ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ అనే మరో మూవీని కూడా కంప్లీట్ చేశాడు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. దీపావళికి ఈ చిత్రం థియేటర్స్ లోకి రాబోతోందంట. కన్నడ భామ రుక్మిణీ వసంత్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. సుధీర్ వర్మ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది.