Begin typing your search above and press return to search.

RC 16 బిగ్ అప్డేట్.. కరుణద చక్రవర్తి ఆగమనం

ఆర్ఆర్ఆర్ తర్వాత చిన్న గ్యాప్ తీసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్.. ఇప్పుడు మళ్లీ వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు

By:  Tupaki Desk   |   12 July 2024 5:41 AM GMT
RC 16 బిగ్ అప్డేట్.. కరుణద చక్రవర్తి ఆగమనం
X

ఆర్ఆర్ఆర్ తర్వాత చిన్న గ్యాప్ తీసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్.. ఇప్పుడు మళ్లీ వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. కోలీవుడ్ దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో వస్తున్న గేమ్ ఛేంజర్ మూవీకి సంబంధించి తన షూటింగ్ పార్ట్ ను ఇటీవల పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు త్వరలోనే RC 16 సెట్స్ లో అడుగుపెట్టనున్నారు. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి.

సుకుమార్ శిష్యుడు, సూపర్ హిట్ మూవీ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్న RC 16 ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే గ్రాండ్ గా ప్రారంభం కానుంది. అందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రెండు మూడు రోజుల్లో రానుందని వినికిడి. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా.. కన్నడ ప్రముఖ నటుడు శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్న విషయం అందరికీ తెలిసిందే.

తాజాగా RC 16 మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. శివరాజ్ కుమార్ బర్త్ డే సందర్భంగా విషెస్ తెలుపుతూ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. '' కరుణద చక్రవర్తి' @శివరాజ్ కుమార్.. తన స్థాయికి తగ్గట్టు ఒక కీలక పాత్ర కోసం స్వాగతం పలుకుతున్నాం. RC 16 టీమ్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు' అంటూ పోస్ట్ చేశారు. పోస్టర్ లో శివరాజ్ కుమార్.. వేరే లెవల్ లో ఉన్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పోస్టర్ ను చూస్తుంటే.. బుచ్చిబాబు పెద్ద ప్లానే వేసినట్లు ఉన్నారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. శివరాజ్ కుమార్ ఇరగదీసేలా యాక్షన్ చేసేలా ఉన్నారని అంటున్నారు. అయితే ఇప్పటికే.. RC 16 మూవీ స్క్రిప్ట్ నెక్ట్స్ లెవెల్ లో ఉందని తెలిపారు శివరాజ్ కుమార్. హీరో క్యారెక్టర్‌ ను బుచ్చిబాబు క్రియేట్ చేసుకున్న విషయంలో ఆశ్చర్యపోయినట్లు చెప్పారు. తనకు గంటన్నర పాటు సినిమా స్క్రిప్ట్ ను నెరేట్ చేశారని తెలిపారు.

అయితే ఉప్పెనతో రూ.100 కోట్ల హిట్ ను అందుకున్న బుచ్చిబాబు.. బిగ్ కాస్ట్ అండ్ క్రూతో RC 16 సినిమాను తెరకెక్కిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన ఓ ప్రముఖ మల్లయోధుడి జీవితం ఆధారంగా మూవీ తెరకెక్కుతోందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. సినిమా టైటిల్ ను పెద్దిగా ఫిక్స్ చేశారని టాక్.