Begin typing your search above and press return to search.

సినిమా హిట్టవ్వాలని ఉపవాస దీక్ష చేపట్టిన ఫ్లాప్ హీరోయిన్!

ఇకపోతే టాలీవుడ్ మేకర్స్ దృష్టిని ఆకర్షించడానికి, కావ్య థాపర్ తెలుగు భాష మీద పట్టు సాధించడానికి కష్ట పడుతోంది.

By:  Tupaki Desk   |   8 Oct 2024 11:30 AM GMT
సినిమా హిట్టవ్వాలని ఉపవాస దీక్ష చేపట్టిన ఫ్లాప్ హీరోయిన్!
X

టాలీవుడ్ లో హీరోయిన్ గా నిలదొక్కుకోవడానికి గట్టిగా ట్రై చేస్తున్న అందాల భామల్లో కావ్య థాపర్ ఒకరు. 2018లో 'ఈ మాయ పేరేమిటో' అనే చిన్న సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తెలుగులో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. అందం, అభినయం రెండూ ఉన్నా సరే, అనుకున్నంత క్రేజ్ తెచ్చుకోలేకపోయింది. అవకాశాలు అందుకుంటోంది కానీ, విజయాలు సాధించలేకపోతోంది. 'ఊరి పేరు భైరవకోన' డీసెంట్ గా ఆడినా, 'డబుల్ ఇస్మార్ట్' మూవీ డిజాస్టర్ గా మారింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు 'విశ్వం' సినిమాపైనే బోలెడన్ని ఆశలు పెట్టుకుంది కావ్య.

గోపీచంద్, కావ్య థాపర్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ "విశ్వం". శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని దసరా పండగ సందర్భంగా థియేటర్లలోకి రావడానికి రెడీ అయింది. అక్టోబర్ 11న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా కచ్ఛితంగా మంచి హిట్ అవుతుందని, తనకు మంచి పేరు తెచ్చిపెడుతుందని కావ్య నమ్మకంగా ఉంది.

విశ్వం సినిమాలో కాస్ట్యూమ్ డిజైనర్ రోల్ ప్లే చేసింది కావ్య థాపర్. ఆమెది మోడ్రన్ గా ఉండే అమ్మాయి పాత్ర. ఆమె క్యారక్టర్ లో కాస్త గ్రే షేడ్ కనిపిస్తుందని టాక్. ఇప్పటి వరకూ సరైన సక్సెస్ రుచి చూడని ఈ బ్యూటీ.. ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయింది. అందుకే సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాలని కోరుకుంటూ పూజలు చేయడమే కాదు, ఉపవాస దీక్ష చేపట్టింది. తన లైఫ్ లోనే మొదటిసారిగా నవరాత్రికి సంధర్భంగా తొమ్మిది రోజుల పాటు ఫాస్టింగ్ చేస్తున్నట్లుగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. మరి ఆమె పూజలు ఫలించి విజయ దశమికి మంచి విజయం వరిస్తుందేమో చూడాలి.

నిజానికి 'విశ్వం' సినిమా కావ్య థాపర్ తో పాటుగా డైరెక్టర్ శ్రీను వైట్ల, హీరో గోపీచంద్, నిర్మాత విశ్వ ప్రసాద్ కు కూడా కీలకమనే చెప్పాలి. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న గోపీ, హిట్టు కొట్టి మళ్ళీ ట్రాక్ లోకి రావాలని చూస్తున్నారు. దాదాపు ఆరేళ్ల తర్వాత మెగా ఫోన్ పట్టిన శ్రీను వైట్ల.. బ్లాక్ బస్టర్ తో బౌన్స్ బ్యాక్ అవ్వాలని భావిస్తున్నారు. అలానే కమర్షియల్ సక్సెస్ సాధించి లాభాలు వెనసుకోవాలని ప్రొడ్యూసర్స్ చూస్తున్నారు. కాబట్టి వీరందరికీ ఈ సినిమా తప్పకుండా హిట్టవ్వాల్సిన అవసరం ఉంది.

ఇకపోతే టాలీవుడ్ మేకర్స్ దృష్టిని ఆకర్షించడానికి, కావ్య థాపర్ తెలుగు భాష మీద పట్టు సాధించడానికి కష్ట పడుతోంది. టీచర్ ను పెట్టుకొని తెలుగు నేర్చుకుంటోంది. 'విశ్వం' సినిమా రిలీజ్ అవ్వకముందే అమ్మడు మరో మూడు కొత్త ప్రాజెక్ట్స్ కు సైన్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే వీటికి సంబంధించిన వివరాలు వెల్లడి కానున్నాయని తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.