Begin typing your search above and press return to search.

కీర్తి సురేష్ కు మరో లక్కీ ఛాన్స్?

తమిళ్, మలయాళీ, హిందీ భాషల్లో ఆ చిత్రాలు చేస్తోంది. తెలుగులో ప్రస్తుతం అయితే ఎలాంటి కమిట్మెంట్స్ లేవు

By:  Tupaki Desk   |   29 May 2024 3:59 AM GMT
కీర్తి సురేష్ కు మరో లక్కీ ఛాన్స్?
X

సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. గత ఏడాది తెలుగులో దసరా మూవీతో కీర్తి సురేష్ బ్లాక్ బస్టర్ హిట్ అందుతుంది. అలాగే భోళా శంకర్ చిత్రంతో డిజాస్టర్ సొంతం చేసుకుంది. తమిళంలో జయం రవి హీరోగా తెరకెక్కిన సైరన్ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించి మెప్పించింది. ఈ మూవీ కూడా తమిళంలో హిట్ టాక్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగు సినిమాలు వరకు ఉన్నాయి.

తమిళ్, మలయాళీ, హిందీ భాషల్లో ఆ చిత్రాలు చేస్తోంది. తెలుగులో ప్రస్తుతం అయితే ఎలాంటి కమిట్మెంట్స్ లేవు. మరల నానికి జోడీగా ఓ మూవీ కోసం సంప్రదిస్తున్నారంట. దాంతో పాటు కొన్ని కథలు డిస్కషన్ స్టేజ్ లో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. కీర్తి సురేష్ బేబీ జాన్ మూవీ తో బాలీవుడ్ లోకి తెరంగేట్రం చేస్తోంది. ఈ మూవీ తమిళ్ బ్లాక్ బస్టర్ హిట్ తెరికి రీమేక్ గా తెరకెక్కుతూ ఉండటం విశేషం.

బేబీ జాన్ లో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే కీర్తి సురేష్ గతంలో మహానటి సావిత్రి బయోపిక్ లో నటించింది. మహానటి టైటిల్ తో తెరకెక్కిన ఆ సినిమాకి కీర్తి సురేష్ ఏకంగా ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు అందుకుంది. ఇప్పుడు మరో బయోపిక్ కోసం ఆమెను సంప్రదించినట్లు టాక్ వినిపిస్తోంది. లెజెండరీ క్లాసికల్ సింగర్ ఎం ఎస్ సుబ్బలక్ష్మి జీవిత కథతో తెరకెక్కనున్న మూవీలో కీర్తి నటించబోతున్నట్లు ప్రచారం నడుస్తోంది.

ఎప్పటి నుంచి ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఆమె పాత్రకి కరెక్ట్ గా సరిపోయే యాక్టర్ కోసం వేచి చూస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్స్ పేర్లు కూడా వినిపించాయి. అయితే ఫైనల్ గా కీర్తి సురేష్ దగ్గరకి ఆ ప్రాజెక్ట్ వచ్చి ఆగినట్లు తెలుస్తోంది. ఎంఎస్ సుబ్బలక్ష్మి వీణా విద్వాంసురాలు, గాయనిగా విశేషమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె భారత్ అత్యున్నత పురస్కారం అయిన భారతరత్న అందుకున్నారు.

అలాగే ప్రపంచంలో గొప్ప అవార్డులలో ఒకటైన రామన్ మెగసెసే అందుకున్నారు. మనం ప్రతిరోజు వినే వెంకటేశ్వర సుప్రభాతం ఆమె స్వరం నుంచి వచ్చిందే. ఆమె తమిళంలో సేవాసదనం, సావిత్రి, మీరా సినిమాలలో నటించింది. హిందీలో మళ్ళీ మీరాబాయి మూవీలో నటించి విశేషమైన ప్రశంసలు అందుకుంది. నటిగా కంటే గాయనిగానే ఎంఎస్ సుబ్బలక్ష్మి ప్రపంచ స్థాయి గుర్తింపు సొంతం చేసుకుంది. ఆమె పాత్రలో కీర్తి సురేష్ నటిస్తే మరోసారి నేషనల్ అవార్డు అందుకోవడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది.