Begin typing your search above and press return to search.

పెళ్లి అయినా పర్వాలేదు ఆమె కావాలి...!

ఎంఎస్ ధోనీ సినిమాతో బాలీవుడ్ లో మంచి గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ కియారా అద్వానీ

By:  Tupaki Desk   |   22 March 2024 7:55 AM GMT
పెళ్లి అయినా పర్వాలేదు ఆమె కావాలి...!
X

ఎంఎస్ ధోనీ సినిమాతో బాలీవుడ్ లో మంచి గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ కియారా అద్వానీ. తెలుగు లో ఈ అమ్మడు భరత్ అనే నేను మరియు వినయ విధేయ రామ సినిమాలను చేసింది. అందులో ఒకటి హిట్ మరోటి ఫ్లాప్. ప్రస్తుతం రామ్‌ చరణ్ కి జోడీగా గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే.

బాలీవుడ్ లో ఈ అమ్మడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. అక్కడ ఇక్కడ సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు తాజాగా మరో సినిమా కమిట్ అయ్యిందట. కన్నడ రాకింగ్ స్టార్‌ యశ్‌ కి జోడీగా నటించేందుకు ఎంపిక అయ్యిందనే వార్తలు వస్తున్నాయి.

యశ్‌ కొత్త సినిమా 'టాక్సిక్‌' లో హీరోయిన్ గా బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కరీనా కపూర్ ఖాన్ నటించబోతుందనే వార్తలు వచ్చాయి. అవి పుకార్లే అని, తాజాగా కియారా అద్వానీతో టాక్సిక్ సినిమా యూనిట్‌ సభ్యులు చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది.

పెళ్లి తర్వాత కూడా కియారా అద్వానీ కి వరుసగా ఆఫర్లు రావడం, అది కూడా సౌత్ లో అవ్వడం విశేషం అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సిద్దార్థ్‌ మల్హోత్ర ను వివాహం చేసుకున్న కియారా అద్వానీ పెళ్లి తర్వాత కూడా ఏమాత్రం తగ్గకుండా అందాల ఆరబోత చేస్తుంది. అందుకే వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.

పెళ్లి అయినా పర్వాలేదు.. ఆమెతోనే తాము సినిమాలు చేయాలి అనుకుంటున్నాం అన్నట్లుగా హీరోలు ఆమెతో కమిట్‌ అవుతున్నారు. ముందు ముందు మరిన్ని సౌత్‌ మరియు హిందీ సినిమాల్లో ఈ అమ్మడు నటించే అవకాశాలు ఉన్నాయి.