Begin typing your search above and press return to search.

భార్యాభ‌ర్త‌లిద్ద‌రికీ ఆ గేమ్ అంటే అంత ఇష్ట‌మా?

కానీ ఈ బాలీవుడ్ జోడీ మాత్రం క్రికెట్ తో పాటు బ్యాడ్మింట‌న్ కూడా అమితంగా ఇష్ట‌మ‌ని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   10 July 2024 1:29 PM GMT
భార్యాభ‌ర్త‌లిద్ద‌రికీ ఆ గేమ్ అంటే అంత ఇష్ట‌మా?
X

బాలీవుడ్ సెల‌బ్రిటీల్లో క్రికెట్ ల‌వ‌ర్స్ ఎంతో మంది. ఇండియా మ్యాచ్ అయితే చాలు గ్యాల‌రీలో సెల‌బ్రి టీల హంగామా పీక్స్ లో ఉంటుంది. అందులోనూ పాకిస్తాన్ టీమ్ తో మ్యాచ్ లైతే ఏ సెల‌బ్రిటీ మిస్ కారు. ద‌గ్గ‌రుండి ఇండియాని గెలిపించేస్తారు. అంత‌టి ఆస‌క్తి బాలీవుడ్ సెల‌బ్రిటీల్లో క‌నిపిస్తుంది. అంతా కామ‌న్ గా ఇష్ట‌ప‌డే ఆట అది. కానీ ఈ బాలీవుడ్ జోడీ మాత్రం క్రికెట్ తో పాటు బ్యాడ్మింట‌న్ కూడా అమితంగా ఇష్ట‌మ‌ని తెలుస్తోంది.


ఇంత‌కీ ఎవ‌రా జోడీ అంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే. బాలీవుడ్ జంట కియారా అద్వానీ - సిద్ధార్థ్ మల్హోత్రా మంగళవారం లండన్‌లో జ‌రిగిన వింబుల్డన్ 2024లో క్వార్టర్-ఫైనల్ ని జంట‌గా వీక్షించారు. ఈ జోడీ అద్భుతమైన దుస్తుల్లో అందంగా మెరిసారు. కియారా పౌడర్ బ్లూ బ్లేజర్ మరియు ప్యాంట్‌ని ఎంపిక చేసుకుంది. మినిమలిస్టిక్ మేకప్‌తో లుక్‌లో సింపుల్ గా ఉంది.


ఇక సిద్దార్ధ్ మ‌ల్హోత్రా వైట్ షూట్...చార‌ల చొక్కా టై ధ‌రించి స్మార్ట్ లుక్ లో క‌నిపిస్తున్నాడు. భార్యాభ‌ర్త‌లిద్దరు జంట‌గా కెమెరాకి ఫోజులిచ్చారు. ప్ర‌స్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. పెళ్లైన త‌ర్వాత తొలి వింబుల్డ‌న్ ఇదే కావ‌డం విశేషం. గ‌తంలోనూ హాజ‌రై ఉంటారో విడి విడిగా. కానీ ఈసారి దంప‌తుల‌గా మ్యాచ్ని వీక్షించి నెటి జ‌నుల్ని అల‌రించారు. ప్ర‌స్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.


జంట‌ని ఉద్దేశించి అభిమానులు ఆస‌క్తిక‌ర పోస్టులు పెడుతున్నారు. ఇక కెరీర్ ప‌రంగా ఇద్ద‌రు బిజీగా ఉన్నారు. కియారా బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తోంది. త్వ‌ర‌లోనే ఆమె న‌టిస్తోన్న `గేమ్ ఛేంజ‌ర్` రిలీజ్ అవుతుంది. ఈ సినిమాపై అమ్మ‌డు చాలా ఆశ‌లు పెట్టుకుంది.