Begin typing your search above and press return to search.

మనోళ్ళకి 'మోస్ట్ వైలెన్స్ మూవీ' ఎక్కుతుందా?

కిల్.. ఇండియాలోనే మోస్ట్ వైలెన్స్ మూవీ! ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్టీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   7 Sep 2024 12:47 PM GMT
మనోళ్ళకి మోస్ట్ వైలెన్స్ మూవీ ఎక్కుతుందా?
X

కిల్.. ఇండియాలోనే మోస్ట్ వైలెన్స్ మూవీ! ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్టీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. నిఖిల్ గణేష్ దర్శకత్వం వహించిన కిల్ సినిమా ఇప్పుడు రికార్డ్ వ్యూస్ దక్కించుకుని దూసుకుపోతోంది. 1995లో జరిగిన ఓ రైలు దోపిడీ ఘటన ఆధారంగా రూపొందిన కిల్ చిత్రం.. గత ఏడాది టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శితమైంది. ఆ సమయంలో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.

ఆ తర్వాత 2024 జులైలో థియేటర్లలో విడుదలైందీ చిత్రం. అప్పుడు సినిమా మిస్ అయిన వారు.. ఓటీటీ రిలీజ్ కోసం ఎదురు చూశారు. ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. అయితే కిల్ మూవీ కోసమే అంతా ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. సినిమా నాన్ స్టాప్ గ్రిప్పింగ్ థ్రిల్లర్ గా అనిపించిందని ఓటీటీ లవర్స్ చెబుతున్నారు. యాక్షన్‌ అండ్ వైలెన్స్ సినిమాలను ఇష్టపడేవారికి బెస్ట్ ఛాయిస్ అని అంటున్నారు.

సినిమాలో డైలాగ్స్, సాంగ్స్, ఎమోషన్స్ కు స్పేస్ కాస్త తక్కువ ఉన్నా.. చిన్న కథతో గ్రిప్పింగ్ గా తెరకెక్కించారని కొనియాడుతున్నారు. అయితే కిల్ ను హాలీవుడ్ లో లయన్స్ గేట్ సంస్థ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు సౌత్ లో కిల్ మూవీని రీమేక్ చేసిన ఆలోచనలో కొందరు ప్రముఖులు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. రీమేక్ హక్కుల కోసం ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో డైరెక్టర్ రమేష్ వర్మ పేరు మెయిన్ గా వినిపిస్తోంది.

కోలీవుడ్ స్టార్ కథానాయకుడు ధనుష్ హీరోగా.. తమిళ, తెలుగు భాషల్లో కిల్ ను ఆయన రీమేక్ చేయనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పుడు ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెలుగు ఆడియన్స్ అంతటి హింసను యాక్సెప్ట్ చేస్తారో లేదో అనేది డౌట్ గా ఉందని నెటిజన్లు చెబుతున్నారు. హిందీలో దొంగల పాత్రలకు మేకర్స్ సరైన క్యారెక్టరైజేషన్ చేశారని.. మరి తెలుగు మేకర్స్ ఏం చేస్తారో చూడాలని అంటున్నారు.

మూవీ స్టోరీ లైన్ ఇదే!

కమాండో అమిత్ రాఠోడ్(లక్ష్య), తూలికా(తాన్యా) ఇద్దరూ లవ్ చేసుకుంటారు. కానీ హీరోయిన్ కు వాళ్ళ నాన్న వేరే యువకుడితో ఎంగేజ్మెంట్ చేస్తారు. దీంతో హీరో హీరోయిన్లు రాంచీ నుంచి ఢిల్లీ వెళ్లి పెళ్లి చేసుకుందామని అనుకుంటారు. అందుకోసం రైలు ఎక్కుతారు. అప్పుడు అందులో ఉన్న బంది పోటు దొంగలు.. రైలులోని అందరిపై దాడి చేసి దోచుకుంటారు. మరి హీరో బందిపోట్లను ఎలా ఎదుర్కొన్నాడు? చివరకు ఏం జరిగిందనేది సినిమా. మరి ఈ మూవీ తెలుగులో రీమేక్ అవుతుందో లేదో వేచి చూడాలి.