Begin typing your search above and press return to search.

Exclusive: వైష్ణవ్ తేజ్ వచ్చాడయ్యో సామీ.. ఇది అసలు మ్యాటర్!

ఉప్పెన సినిమాతో హీరోగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాతోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నాడు.

By:  Tupaki Desk   |   4 Sep 2024 6:17 AM GMT
Exclusive: వైష్ణవ్ తేజ్ వచ్చాడయ్యో సామీ.. ఇది అసలు మ్యాటర్!
X

ఉప్పెన సినిమాతో హీరోగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాతోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నాడు. మళ్ళీ తరువాత ఆశించిన స్థాయిలో సక్సెస్ లు సాధించలేదు. క్రిష్ తో చేసిన కొండపొలం ఫ్లాప్ అయ్యింది. తరువాత వచ్చిన రంగరంగ వైభవంగా, గత ఏడాది రిలీజ్ అయిన ఆదికేశవ డిజాస్టర్ అయ్యాయి. కొండపొలం పర్వాలేదనే టాక్ తెచ్చుకున్న కమర్షియల్ గా సక్సెస్ కాలేదు.

దీంతో నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో వైష్ణవ్ తేజ్ చాలా గ్యాప్ తీసుకొని పర్ఫెక్ట్ స్టోరీ కోసం వెయిట్ చేస్తున్నాడు. చాలా కథలు వింటున్న కూడా ఆశించిన స్థాయిలో సంతృప్తి చెందడం లేదంట. అందుకే మంచి లైన్ కోసం వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే రీసెంట్ గా కృష్ణ చైతన్య వైష్ణవ్ తేజ్ కి ఓ ఇంటరెస్టింగ్ స్టోరీ నేరేట్ చేసాడని టాక్ వచ్చింది. ఈ కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనేలా కథనాలు వెలువడుతున్నాయి.

ఇదిలా ఉంటే ఈ మూవీకి సూపర్ స్టార్ మహేష్ బాబు హిట్ సాంగ్ పేరుని టైటిల్ గా పెడుతున్నారనే ప్రచారాలు మొదలయ్యాయి. భరత్ అనే నేను చిత్రంలో వచ్చాడయ్యో సామీ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కనుందని అంటున్నారు. త్వరలో ఈ మూవీకి సంబందించిన అఫీషియల్ అప్డేట్ రానుందనే టాక్ వినిపిస్తోందని కథనాలు వచ్చాయి.

ఇక అసలు మ్యాటర్ లోకి వెళితే.. తుపాకీ ప్రత్యేకంగా తెలుసుకున్న సమాచారం ప్రకారం టైటిల్ విషయం అనేది నిజం కాదు. దర్శకుడు సన్నిహితులు ఇది నిజం కాదని కొట్టిపారేశారు. వైష్ణవ్ తేజ్ ను కలిసిన మాట వాస్తవమే. ఒక మంచి స్టోరీ లైన్ పై కూడా చర్చలు జరిగాయి. ప్రస్తుతం దర్శకుడు పూర్తి స్థాయిలో స్క్రిప్ట్ డెవలప్ చేసే పనిలో ఉన్నారు.

ఇంతవరకు అయితే వాస్తవం అని తెలుస్తోంది.

కానీ టైటిల్ విషయంలో వచ్చిన గాసిప్స్ మాత్రం నిజం కాదని పక్కా సమాచారం అందుతోంది. ఇక కృష్ణచైతన్య మంచి టాలెంటెడ్ డైరెక్టర్. రీసెంట్ గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో మేకింగ్ పరంగా మంచి ప్రశంసలు అందుకున్నాడు. లిరిక్ రైటర్ గా కొన్నాళ్ళు వర్క్ చేసిన అతను చైతన్య రౌడీ ఫెలో సినిమాతో దర్శకుడిగా మారాడు.

తరువాత చల్ మోహన రంగా అనే సినిమా చేశాడు. ఈ మూవీ పర్వాలేదు . చాలా గ్యాప్ తీసుకొని గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాన్ని విశ్వక్ సేన్ తో చేసి ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అనుకున్న టార్గెట్ ను అయితే ఫినిష్ చేసింది. అలాగే దర్శకుడు సినిమాలో ఎమోషన్స్, కంటెంట్ ని బాగా ప్రెజెంట్ చేసాడనే మాట వినిపించింది. ఇక వైష్ణవ్ తేజ్ ప్రాజెక్టు విషయంలో ఒక క్లారిటీ రావాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.