Begin typing your search above and press return to search.

వాళ్లు గుర్తు పట్టడంతో షాక్ అయ్యా..!

టాలీవుడ్‌ లో బోణీ సినిమాలో నటించడం ద్వారా తెలుగు ప్రేక్షకులకు నటిగా పరిచయం అయిన ముద్దుగుమ్మ కృతి కర్బందా.

By:  Tupaki Desk   |   15 Jun 2024 6:52 AM GMT
వాళ్లు గుర్తు పట్టడంతో షాక్ అయ్యా..!
X

టాలీవుడ్‌ లో బోణీ సినిమాలో నటించడం ద్వారా తెలుగు ప్రేక్షకులకు నటిగా పరిచయం అయిన ముద్దుగుమ్మ కృతి కర్బందా. ఈ అమ్మడు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సుదీర్ఘ కాల కెరీర్ లో ఈ అమ్మడు పలు సినిమాల్లో నటించగా అందులో కొన్ని నిరాశ పరచగా కొన్ని హిట్ గా నిలిచాయి.

తాజాగా తన సినీ కెరీర్ 15 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇన్నాళ్ల తన సినీ కెరీర్‌ చాలా సంతృప్తిగా సాగిందని చెప్పుకొచ్చింది. నా జీవితంలో నేను నటిగానే ఎక్కువ కాలం గడిపాను అన్నట్లుగా పేర్కొంది.

ఇంకా కృతి కర్బందా మాట్లాడుతూ.... కన్నడ లో నేను మొదట చేసిన గూగ్లీ సినిమాలో డాక్టర్ స్వాతిగా కనిపించాను. ఆ సినిమా విడుదల తర్వాత ఒక రోజు షాపింగ్ కు వెళ్లాను. అక్కడ కొంత మంది నన్ను గుర్తు పట్టి డాక్టర్‌... డాక్టర్ అంటూ పిలిచారు. వారు డాక్టర్ స్వాతి అంటూ నన్ను గుర్తు పట్టడంతో షాక్ అయ్యాను.

అప్పుడే హీరోయిన్స్ కి, సినిమా వారికి ఎంతటి క్రేజ్ ఉంటుంది, ఇండస్ట్రీలో ఉంటే ఎలా జనాలు చూస్తారు అనేది అర్థం అయ్యింది. నా 15 ఏళ్ల సినీ కెరీర్‌ లో భాగస్వామ్యులు అయిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు. నాకు మంచి పాత్రలు ఇచ్చిన దర్శక నిర్మాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు అంది.

టాలీవుడ్ లో ఈ అమ్మడు పవన్ కు జోడీగా తీన్మార్ సినిమాలో నటించడంతో పాటు మరి కొన్ని సినిమాల్లో కూడా నటించింది. కానీ అదృష్టం కలిసి రాకపోవడంతో ఈ అమ్మడికి ఆఫర్లు తెలుగు లో ఎక్కువ రాలేదు. అయినా కూడా కెరీర్‌ లో ఈ అమ్మడు ఆగకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తూ వచ్చింది. మరో 15 ఏళ్ల పాటు ఈ అమ్మడి కెరీర్ కొనసాగించే అవకాశాలు ఉన్నాయంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.