Begin typing your search above and press return to search.

ఆ హీరో కోసం ఇద్ద‌రు భామ‌ల మ‌ధ్య పోటీ!

కోలీవుడ్ స్టార్ ధ‌నుష్ క‌థానాయ‌కుడిగా ఆనంద్ ఎల్ రాయ్ మ‌రో చిత్రానికి స‌న్నాహాలు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   7 Aug 2024 6:10 AM GMT
ఆ హీరో కోసం ఇద్ద‌రు భామ‌ల మ‌ధ్య పోటీ!
X

కోలీవుడ్ స్టార్ ధ‌నుష్ క‌థానాయ‌కుడిగా ఆనంద్ ఎల్ రాయ్ మ‌రో చిత్రానికి స‌న్నాహాలు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇద్ద‌రి కాంబినేష‌న్ లో ఈ ప్రాజెక్ట్ ప్ర‌క‌టించి ఏడాది అవుతున్నా? ఇంత‌వ‌ర‌కూ సెట్స్ కి వెళ్ల‌లేదు. ధ‌నుష్ వేర్వేరు సినిమాల‌తో బిజీగా ఉండ‌టంతో అది సాధ్య‌ప‌డలేదు. ఈనేప‌థ్యంలో ఏడాది అక్టోబ‌ర్ లో ప్రారంభించాల‌ని ద‌ర్శ‌కుడు సంక‌ల్పించారు. దీంతో కొన్ని నెల‌లుగా ఈ సినిమా ప‌నుల్లోనే బిజీగా ఉన్నారు.


`తేరే ఇష్క్ మే` అనేది ఈ సినిమా టైటిల్ గా ఇప్ప‌టికే ఖ‌రారు చేసారు. ఇది కూడా విషాధంతో కూడిన ప్రేమ క‌థ అని స‌మాచారం. ల‌వ్ స్టోరీలు రూపొందించ‌డంలో ఆనంద్ ఎల్ స్పెష‌లిస్ట్. త‌న‌దైన మార్క్ ఎమోష‌న్ తో ప్రేక్ష‌కుల్ని క‌ట్టిపడేస్తాడు. దీంతో మ‌రోసారి అదే పాయింట్ ని బేస్ చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. గ‌తంలో ఇదే కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన `రాంఝానా` ఎంత పెద్ద విజ‌యం సాధించిందో తెలిసిందే.



30 కోట్ల బ‌డ్జెట్ లోనే 100 కోట్ల వసూళ్ల సినిమాగా రికార్డు సృష్టించింది. దీంతో ఆనంద్ ఎల్ రాయ్ మ‌రోసారి అదే ర‌క‌మైన ఎమోష‌న్ తో మూందుకెళ్తున్నారు. అయితే ఇందులో హీరోయిన్ కోసం ప్ర‌ముఖంగా ఇద్ద‌రు భామ‌ల మ‌ధ్య పోటీ క‌నిపిస్తుంది. కొన్ని నెల‌ల క్రిత‌మే `యానిమ‌ల్` తో ఫేమ‌స్ అయిన త్రిప్తీ డిమ్రీతో చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లు ప్ర‌చారంలో ఉంది. తాజాగా ఆమెతో పాటు తాజాగా కృతిస‌న‌న్ తో కూడా సంప్ర‌దింపులు జ‌రిపిన‌ట్లు ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

హీరోయిన్ పాత్ర‌కు ఇద్ద‌రు ప‌క్కాగా యాప్ట్ అవుతున్నారుట‌. కానీ ఎవ‌ర్ని ఎంపిక చేయాలి? అన్న దానిపై ఆనంద్ ఎల్ రాయ్ ఇంకా తుది నిర్ణ‌యం తీసుకోన‌ట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్ నుంచి మొద‌లు పెట్టాల‌ని చూస్తున్నారు. ఈలోగా నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంది. మ‌రి ఆ ఛాన్స‌న్ త్రిప్తీకొస్తుందా? సీత‌మ్మ త‌న్నుకుపోతుందా? అన్న‌ది చూడాలి. అలాగే సినిమాలో ఓ కీల‌క మైన పాత్ర‌కు ఓ ప్ర‌ముఖ న‌టుడితోనూ చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారుట‌.