Begin typing your search above and press return to search.

కాబోయే వాడు ఎలా ఉండాలో చెప్పి షాకిచ్చింది

1-నేనొక్కడినే- ఆదిపురుష్ లాంటి భారీ చిత్రాల్లో న‌టించింది కృతి స‌నోన్. మ‌హేష్- ప్ర‌భాస్ - నాగ‌చైత‌న్య (దోచేయ్) లాంటి స్టార్ల స‌ర‌స‌న న‌టించింది

By:  Tupaki Desk   |   11 May 2024 4:38 AM GMT
కాబోయే వాడు ఎలా ఉండాలో చెప్పి షాకిచ్చింది
X

1-నేనొక్కడినే- ఆదిపురుష్ లాంటి భారీ చిత్రాల్లో న‌టించింది కృతి స‌నోన్. మ‌హేష్- ప్ర‌భాస్ - నాగ‌చైత‌న్య (దోచేయ్) లాంటి స్టార్ల స‌ర‌స‌న న‌టించింది. కానీ టాలీవుడ్ సినిమాలేవీ త‌న‌కు క‌లిసి రాలేదు. కానీ హిందీలో వ‌రుస విజ‌యాలు అందుకుని ప్ర‌స్తుతం అక్క‌డ ప్రామిస్సింగ్ న‌టిగా ఓ వెలుగు వెలుగుతోంది. మ‌రోవైపు కృతి వ్య‌క్తిగ‌త జీవితం.. ప్రేమాయణాలు హాట్ టాపిక్ గా మారాయి.

ఈ సంవత్సరం ప్రారంభంలో కృతి సనన్ లండన్‌లోని వ్యాపారవేత్త కబీర్ బహియాతో జంట‌గా షికార్ చేస్తున్న‌ ఫోటో ఒక‌టి అంత‌ర్జాలంలో వైర‌ల్ అయింది. ఈ ఫోటో లీక్ తో కృతి డేటింగ్ పై ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. ఆ ఫోటోలో ఉన్న‌ది తానేన‌ని కృతి అంగీకరించనప్పటికీ ఇటీవల ఆదర్శ భాగస్వామి ఎలా ఉండాల‌నే దానిపైనా ముచ్చ‌టించి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. తన ఆదర్శ భాగస్వామి తనను నవ్వించే వ్యక్తిగా ఉండాలని.. నిజాయితీపరుడై ఉండాల‌ని అంది.

తాజా ఇంటర్వ్యూలో కృతి తన ఆదర్శ భాగస్వామిలో ఎలాంటి ల‌క్ష‌ణాలు ఉండాలో వెల్ల‌డించింది. కాబోయేవాడి గుణ‌గ‌ణాలు ఎలా ఉండాలో వ‌ర్ణించింది. వాటన్నింటికీ అబ్బాయి సరిపోతాడా లేదా అనేది నాకు తెలియదు.. కానీ ఇలా ఉండాలి అంటూ చిట్టా విప్పింది. ఆపై కృతి చాలా స‌ర‌దాగా న‌వ్వేసింది. అయితే ఎవ‌రిపైనా ఒత్తిడి చేయ‌నని అంది. ''నాకు ఇది కావాలి.. అది కావాలి అని అడ‌గ‌ను. నిజానికి ఇలాంటి కోరిక‌ల‌తోనే మనం చాలా ఒత్తిడికి లోనవుతున్నాము. మ‌న‌కు కావలసినది.. నిజానికి భిన్నంగా ఉండవచ్చు. నాకు అలాంటి వ్యక్తి కావాలని అనిపించవచ్చు.. కానీ వాస్తవానికి నాకు అత‌డి నుంచి అవసరమైనది సింప్లిసిటీ... నిజాయితీ.. నన్ను నవ్వించగలగాలి.. నన్ను నా పనిని గౌరవించే వారితో గంటల తరబడి మాట్లాడగలను.. ఇలాంటివి గ్ర‌హించాల‌ని నేను భావిస్తున్నాను. ఎవరైనా నాతో సరిపోలాలని నేను అనుకోను.. కానీ మరింత ముఖ్యమైన విష‌యం.. అత‌డు క‌చ్ఛితంగా సురక్షితంగా చూసుకునేవాడై ఉండాలి! అని కృతి కాబోయేవాడిలో ఉండాల్సిన క్వాలిటీస్ గురించి మాట్లాడింది.

కృతి- క‌బీర్ కలిసి లండన్‌లో హోలీ జరుపుకున్న ఫోటోలు లీక‌య్యాయి. అప్ప‌టి నుంచి ఈ జోడీ డేటింగ్ చేస్తున్నారని అభిమానుల్లో ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. కబీర్ లండన్‌లోని ప్రముఖ వ్యాపారవేత్త కొడుకు అని కూడా క‌థ‌నాలొచ్చాయి. అత‌డు సాక్షి ధోనీకి స‌న్నిహిత బంధువు అని కూడా క‌థ‌నాలొచ్చాయి. అయితే ఈ ఊహాగానాలపై కృతి లేదా కబీర్ ఎప్పుడూ స్పందించ‌లేదు. ఎవరూ సమాధానం చెప్పలేదు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. కృతి సనన్ ప్రస్తుతం `క్రూ` విజ‌యాన్ని ఆస్వాధిస్తోంది. తదుపరికాజోల్‌తో కలిసి క్రైమ్ థ్రిల్లర్ `దో పట్టి`లో కనిపించనుంది. దో పట్టితో నిర్మాతగాను ఆరంగేట్రం చేస్తోంది కృతి. గత సంవత్సరం ఈ చిత్రాన్ని ప్రకటించింది.