Begin typing your search above and press return to search.

వాళ్లిద్దరినీ దాటుకుని లక్కీ ఛాన్స్ అందుకుందా..?

తెరె ఇష్క్ మై అనే టైటిల్ తో సినిమా ప్రకటించిన వీరి వారికి ఉన్న కమిట్మెంట్స్ అన్ని పూర్తి చేసుకుని త్వరలో సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తున్నారు.

By:  Tupaki Desk   |   8 Aug 2024 2:30 PM GMT
వాళ్లిద్దరినీ దాటుకుని లక్కీ ఛాన్స్ అందుకుందా..?
X

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఓ పక్క తమిళ్ భాషలో తన మార్క్ సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ ని అలరిస్తూనే బాలీవుడ్ సినిమాల్లో కూడా నటిస్తూ వస్తున్నాడు. ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్షన్ లో రాంఝానా తర్వాత మరో ప్రాజెక్ట్ చేయాలని ఫిక్స్ అయిన ధనుష్ వారి కాంబోలో కొన్నాళ్ల క్రితమే ఒక సినిమా అనౌన్స్ అయ్యింది. తెరె ఇష్క్ మై అనే టైటిల్ తో సినిమా ప్రకటించిన వీరి వారికి ఉన్న కమిట్మెంట్స్ అన్ని పూర్తి చేసుకుని త్వరలో సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తున్నారు.

కోలీవుడ్ లో రీసెంట్ గా రాయన్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ధనుష్ ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో కుబేర సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే ఆనంద్ ఎల్ రాయ్ సినిమాను మొదలు పెడతారని తెలుస్తుంది. ఐతే ఈ సినిమాలో హీరోయిన్ గా ముందు ఎవరినెవరినో అనుకోగా ఫైనల్ గా కృతి సనన్ ని లాక్ చేసినట్టు తెలుస్తుంది. బాలీవుడ్ లో తన అందంతో పాటు అభినయంతో మెప్పిస్తూ వస్తున్న కృతికి ధనుష్ ఆఫర్ లక్కీ ఛాన్స్ అని చెప్పొచ్చు.

ఈ సినిమా రేసులో ముందు కియరా అద్వాని ఉంది ఆమె తర్వాత యానిమల్ సెన్సేషన్ త్రిప్తి డిమ్రిని కూడా అనుకున్నారు కానీ వాళ్లిద్దరిని దాటి కృతికి ఈ ఛాన్స్ వరించింది. కృతి సనన్ కూడా ఈ క్రేజీ కాంబో సినిమా గురించి సూపర్ ఎగ్జైటెడ్ గా ఉంది. మహేష్ తో 1 నేనొక్కడినే సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన కృతి సనన్ పడుతూ లేస్తూ కెరీర్ స్ట్రాంగ్ చేసుకుంటూ వస్తుంది. లాస్ట్ ఇయర్ ప్రభాస్ చేసిన ఆదిపురుష్ సినిమాలో సీత పాత్రలో నటించింది కృతి.

ఇక ఇప్పుడు ధనుష్ తో తెర ఇష్క్ మై సినిమాలో ఛాన్స్ పట్టేసింది. కమర్షియల్ సక్సెస్ పడితేనే ఏ పరిశ్రమలో అయినా ఛాన్సులు పలకరిస్తాయి. ఆదిపురుష్ ఫ్లాప్ అమ్మడి కెరీర్ మీద బాగానే ఇంపాక్ట్ చూపించింది. ఐతే కృతి మళ్లీ తిరిగి ఫాం లోకి వచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ధనుష్ సినిమాతో కృతి అనుకున్న సక్సెస్ అందుకుంటుందేమో చూడాలి. బాలీవుడ్ లోనే కాదు మళ్లీ టాలీవుడ్ లో కూడా మంచి ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న కృతికి ఇక మీదట అంతా లక్ కలిసి రావాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు.