Begin typing your search above and press return to search.

స్టార్‌ సిస్టర్స్‌ రాకతో ఆ షో సూపర్‌ హిట్‌

కరిష్మా, కరీనాల యొక్క ప్రజెన్స్‌ తో కపిల్‌ శర్మ షో స్థాయి పెరిగిందనే అభిప్రాయం చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు.

By:  Tupaki Desk   |   14 Oct 2024 11:30 PM GMT
స్టార్‌ సిస్టర్స్‌ రాకతో ఆ షో సూపర్‌ హిట్‌
X

హిందీ ప్రేక్షకులను సుదీర్ఘ కాలంగా ఎంటర్‌టైన్‌ చేస్తున్న కపిల్‌ శర్మ ప్రస్తుతం ది గ్రేట్‌ ఇండియన్‌ కపిల్‌ షో తో దూసుకు పోతున్నాడు. కొన్ని రోజుల క్రితం ఎన్టీఆర్‌ తన దేవర సినిమా ప్రమోషన్స్‌ కోసం ఈ కామెడీ షోలో పాల్గొన్న విషయం తెల్సిందే. కపిల్‌ శర్మ షో లో ఎన్టీఆర్‌ చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఆ సమయంలో సౌత్‌లోనూ ఈ షో గురించి ప్రముఖంగా వార్తలు వచ్చాయి. హిందీ సినిమాల ప్రమోషన్‌ కి కేరాఫ్‌ అడ్రస్‌గా కపిల్‌ శర్మ టాక్‌ షో ఉంటుంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాల ప్రమోషన్స్‌ మాత్రమే కాకుండా స్టార్‌ సెలబ్రిటీ కపుల్‌ ను తీసుకు రావడం, స్టార్‌ సిబ్లింగ్స్ ను తీసుకు రావడం కపిల్‌ శర్మ షో స్పెషాలిటీ అనే విషయం తెల్సిందే.

ఇప్పటి వరకు ఎంతో మంది బాలీవుడ్‌ స్టార్‌లతో పాటు, పలువురు సౌత్ స్టార్స్ సైతం కపిల్‌ శర్మ కామెడీ షో లో పాల్గొన్నారు. ప్రతి ఎపిసోడ్‌ ప్రేక్షకులను అలరించడం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఈసారి ఎపిసోడ్‌ అన్ని ఎపిసోడ్స్‌లోనూ చాలా ప్రత్యేకం అంటూ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాజా ఎపిసోడ్‌లో బాలీవుడ్‌ స్టార్‌ సిస్టర్స్ కరిష్మా కపూర్‌, కరీనా కపూర్‌ ఖాన్‌లు పాల్గొన్నారు. వారిద్దరితో కపిల్‌ శర్మ చేసిన సందడి తాలూకు వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ హడావిడి చేస్తున్నాయి. ఈ ఎపిసోడ్‌ గురించి తెగ ప్రచారం జరుగుతోంది.

ఈ మధ్య కాలంలో కపిల్ శర్మ కామెడీ షో ల్లో ఇదే ది బెస్ట్‌ అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటే మరి కొందరు ఇలాంటి కామెడీ షో లకు ఎప్పటికీ ఆదరణ ఉంటుంది, ఇలాంటి ఎపిసోడ్స్ అప్పుడప్పుడు అయినా పడాలి అనే అభిప్రాయంను వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి స్టార్‌ సిస్టర్స్ చేసిన సందడి కారణంగా ఉత్తరాదిన కపిల్ శర్మ షో మరోసారి వార్తల్లో నిలిచింది. ఇద్దరు ముద్దుగుమ్మలతో పాటు తన షో లో ఎప్పుడూ ఉండే శ్వేతా తివారీ సైతం తాజా ఎపిసోడ్‌ లో మెప్పించింది. అందుకే అన్ని ఎపిసోడ్స్ ల్లోకి ఈ ఎపిసోడ్‌ ది బెస్ట్‌ అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

కరిష్మా, కరీనాల యొక్క ప్రజెన్స్‌ తో కపిల్‌ శర్మ షో స్థాయి పెరిగిందనే అభిప్రాయం చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. సినిమాల్లో వీరిద్దరూ బిజీ బిజీగా ఉన్నారు. గతంలో వీరు వేరు వేరుగా సినిమాల ప్రమోషన్స్‌ కోసం పలు సార్లు కపిల్‌ శర్మ షోలో పాల్గొన్నారు. ఇప్పుడు ఇద్దరు కలిసి హాజరు అవ్వడం వల్ల అందరి దృష్టిని ఆకర్షించారు. కరీనా కపూర్‌ ఖాన్ ఇద్దరు పిల్లల తర్వాత సైతం బాలీవుడ్‌లో టాప్‌ స్టార్‌ హీరోయిన్‌ గా దూసుకు పోతున్న విషయం తెల్సిందే. ఇక కరీనా కపూర్‌ ఖాన్‌ సైతం సెకండ్స్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి వరుస సినిమాలు చేయాలని ఫ్యాన్స్ చాలా రోజులుగా కోరుకుంటున్నారు.