Begin typing your search above and press return to search.

రాజ్ తరుణ్ కోసం ఎంత దూరమైనా వెళ్తా: లావణ్య

రాజ్ తరుణ్ కి మాల్వీ మల్హోత్రాతో అఫైర్ ఉందని లావణ్య చేసిన ఆరోపణలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.

By:  Tupaki Desk   |   10 July 2024 4:48 PM GMT
రాజ్ తరుణ్ కోసం ఎంత దూరమైనా వెళ్తా: లావణ్య
X

హీరో రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారం రోజురోజుకు మరింత సంచలనంగా మారుతోంది. రాజ్ తరుణ్ తనని పెళ్లి చేసుకుంటానని సహజీవనం చేసి మోసం చేసాడని లావణ్య మీడియా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంలో లావణ్య మీడియా ముందుకొచ్చి రాజ్ తరుణ్ పైన చాలా ఆరోపణలు చేసింది. అలాగే హీరోయిన్ మాల్వీ మల్హోత్రాపైన కామెంట్స్ చేసింది. రాజ్ తరుణ్ కి మాల్వీ మల్హోత్రాతో అఫైర్ ఉందని లావణ్య చేసిన ఆరోపణలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.

లావణ్య ఆరోపణలపై రాజ్ తరుణ్ మీడియా ముందుకొచ్చి స్పందించారు. ఆమెకి డ్రగ్స్ అలవాటుందని, అలాగే మస్తాన్ అనేవాడితో ఎఫైర్ ఉందని ఆరోపించాడు. కేవలం నా ప్రాపర్టీ మీద లావణ్య కన్నేసిందని, దానికోసమే ఇప్పుడు పోలీసులకి ఫిర్యాదు చేసిందని అన్నాడు. ఒకప్పుడు సహజీవనంలో ఉన్న మాట వాస్తవమే అని, అయితే గత ఏడేళ్ల నుంచి మా మధ్య ఎలాంటి రిలేషన్ లేదని రాజ్ తరుణ్ చెప్పుకొచ్చాడు.

ఇక ఇప్పుడు లేటెస్ట్ గా లావణ్య చేసిన మరికొన్ని కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. రాజ్ తరుణ్ కోసం నేను ఎంత దూరం అయినా వెళ్తాను, అతన్ని దక్కించుకుంటాను. అతను నాకన్నా ముందే చబిపోతే వింతంతువుని అవుతా. నేను ముందు చనిపోతే అతను తల కొరివి పెడతాడేమో. హీరో కాక ముందు నుంచే రాజ్ తరుణ్ జీవితంలో నేను ఉన్నాను. అతనితోనే కలిసి ఉండాలని అనుకుంటున్నాను.. అని లావణ్య తెలియజేసింది.

ఇక మరోవైపు ఇదివరకే మాల్వీ మల్హోత్రా కూడా మీడియా ముందుకొచ్చి లావణ్య మీద విమర్శలు చేసింది. నా వ్యక్తిత్వాన్ని నాశనం చేసే ప్రయత్నం లావణ్య చేస్తోందని పేర్కొంది. రాజ్ తరుణ్ తో కేవలం సినిమాలో నటించాను తప్ప మా ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ షిప్ లేదని మాల్వీ తెలిపింది. మరోసారి మాల్వీ లావణ్య పైన ఫిర్యాదు చేసింది. ఆమె తమని బెదిరిస్తుందని మాల్వీ పోలీసులకి తెలియజేసింది.

ఇదిలా ఉంటే ఈ వ్యవహారంలో పోలీసులు ఫస్ట్ కేస్ ఫైల్ చేశారు. రాజ్ తరుణ్ తనని పెళ్లి చేసుకుంటానని చెప్పాడని, 11 ఏళ్ళ ఏళ్ళు సహజీవనం చేసి ఇప్పుడు మోసం చేసాడని లావణ్య పేర్కొంది. రాజ్ తరుణ్ తో తాను అన్విక పేరుతో కలిసున్నానని, అదే పేరుతో విదేశాలకి కూడా వెళ్లామని లావణ్య ఫిర్యాదులో పేర్కొంది. అలాగే కొన్నేళ్ల క్రితం రాజ్ తరుణ్ తనకి అబార్షన్ చేయించాడని మెడికల్ రిపోర్ట్స్ ని కూడా లావణ్య పోలీసులకి అందించింది.

అలాగే తమ మధ్య రిలేషన్ ఉందని చెప్పడానికి కావాల్సిన 170 ఫోటోలని ఆమె పోలీసులకి సబ్మిట్ చేసింది. ఈ ఆధారాలు బేస్ చేసుకొని రాజ్ తరుణ్ పైన నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. మాల్వీ ఎఫైర్ పెట్టుకొని రాజ్ తరుణ్ తనని దూరం పెట్టాడని లావణ్య ఫిర్యాదులో తెలియజేసింది. అలాగే వారిద్దరూ రిలేషన్ లో ఉన్నారని చెప్పడానికి బలమైన సాక్ష్యాలని లావణ్య పోలీసులకి సమర్పించింది.