మహేశ్ కోసం రూ.4కోట్ల భారీ సెట్..
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గుంటూరు కారం.
By: Tupaki Desk | 14 Aug 2023 3:15 AM GMTసూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గుంటూరు కారం. భారీ బడ్జెట్తో కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రాబోతుంది. అయితే ఈ సినిమా మొదటి నుంచి కష్టాలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సినిమాలోని నటీనటులు, టెక్నిషియన్స్.. బిగ్బాస్ హౌస్ కెంటెస్టెంట్ తరహాలో ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. దీంతో మూవీ షూటింగ్ బ్రేక్ పడుతూ వస్తోంది.
అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ ఎట్టకేలకు ప్రారంభం కానుందని తెలిసింది. ఫ్యామిలీతో కలిసి రెండు వారాల క్రితం ఫారెన్ టూర్లో మహేశ్ బాబు తిరిగి వచ్చేస్తున్నారట. దీంతో ఆగస్ట్ 16నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభించేందుకు మూవీటీమ్ సన్నాహాలు చేస్తున్నారని సమాచారం అందింది. మహేశ్ రాగానే సెట్స్లో జాయిన్ అవ్వనున్నారు.
అలాగే ఇటీవలే సినిమాటోగ్రాఫర్ పీఎస్ వినోద్ తప్పుకున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో కొత్త సినిమాటోగ్రాఫర్గా బాధ్యతలు ఎవరు తీసుకుంటారా అని ఆసక్తి మొదలైంది. తాజాగా దీనిపై కూడా ఓ క్లారిటీ వచ్చింది. పీఎస్ వినోద్ స్థానంలో మనోజ్ పరమహంస కొత్త సినిమాటోగ్రాఫర్గా వ్యవహరించనున్నారని సమాచారం. ఆగస్ట్ 16న ఈయనతో షూటింగ్ చేయబోతున్నారట.
మరో ఆసక్తికర విషయమేమిటంటే.. సాధరణంగా త్రివిక్రమ్ సినిమా అంటే సెట్స్ ఎంత క్లాస్ అండ్ కాస్ట్లీగా ఉంటాయో తెలిసిన విషయమే. ఇప్పుడు ఈ కొత్త షెడ్యూల్ కోసం ఓ స్పెషల్ సెట్ వేయబోతున్నారట. ఓ ప్రైవేట్ స్టూడియోను అద్దెకు తీసుకుని అందులో దాదాపు రూ.4కోట్లు ఖర్చు పెట్టి మరీ భారీ సెట్ నిర్మించబోతున్నట్లు తెలిసింది. ఎంతో ప్రత్యేకంగా ఈ సెట్ను తీర్చిదిద్దుతున్నారట. ఇందులోనే కొత్త షెడ్యూల్ చిత్రకరించనున్నారని సమాచారం అందింది.
ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్లుగా శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఈ ఇద్దరితో పాటు సినిమాలోని ఇతర కీలక పాత్రలపై ఈ కొత్త షెడ్యూల్లో చిత్రీకరణ జరపనున్నారట. తమన్ సినిమకు స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే రీసెంట్గా మహేశ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన రెండు కొత్త మాస్ పోస్టర్లు మహేశ్ అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై నిర్మిస్తున్నారు.