Begin typing your search above and press return to search.

మహేశ్​ కోసం రూ.4కోట్ల భారీ సెట్​..

సూపర్ స్టార్ మహేశ్​ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గుంటూరు కారం.

By:  Tupaki Desk   |   14 Aug 2023 3:15 AM GMT
మహేశ్​ కోసం రూ.4కోట్ల భారీ సెట్​..
X

సూపర్ స్టార్ మహేశ్​ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గుంటూరు కారం. భారీ బడ్జెట్​తో కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్​గా ఈ సినిమా రాబోతుంది. అయితే ఈ సినిమా మొదటి నుంచి కష్టాలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సినిమాలోని నటీనటులు, టెక్నిషియన్స్​.. బిగ్​బాస్ హౌస్ కెంటెస్టెంట్​ తరహాలో ఒక్కొక్కరుగా ఎలిమినేట్​ అవుతూ వస్తున్నారు. దీంతో మూవీ షూటింగ్ బ్రేక్ పడుతూ వస్తోంది.

అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్​ ఎట్టకేలకు ప్రారంభం కానుందని తెలిసింది. ఫ్యామిలీతో కలిసి రెండు వారాల క్రితం ఫారెన్​ టూర్​లో మహేశ్ బాబు​ తిరిగి వచ్చేస్తున్నారట. దీంతో ఆగస్ట్ 16నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభించేందుకు మూవీటీమ్​ సన్నాహాలు చేస్తున్నారని సమాచారం అందింది. మహేశ్ రాగానే సెట్స్​లో జాయిన్ అవ్వనున్నారు.

అలాగే ఇటీవలే సినిమాటోగ్రాఫర్​ పీఎస్ వినోద్​ తప్పుకున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో కొత్త సినిమాటోగ్రాఫర్​గా బాధ్యతలు ఎవరు తీసుకుంటారా అని ఆసక్తి మొదలైంది. తాజాగా దీనిపై కూడా ఓ క్లారిటీ వచ్చింది. పీఎస్ వినోద్ స్థానంలో మనోజ్ పరమహంస కొత్త సినిమాటోగ్రాఫర్​గా వ్యవహరించనున్నారని సమాచారం. ఆగస్ట్​ 16న ఈయనతో షూటింగ్​ చేయబోతున్నారట.

మరో ఆసక్తికర విషయమేమిటంటే.. సాధరణంగా త్రివిక్రమ్ సినిమా అంటే సెట్స్​ ఎంత క్లాస్ అండ్​ కాస్ట్లీగా ఉంటాయో తెలిసిన విషయమే. ఇప్పుడు ఈ కొత్త షెడ్యూల్​ కోసం ఓ స్పెషల్​ సెట్​ వేయబోతున్నారట. ఓ ప్రైవేట్ స్టూడియోను అద్దెకు తీసుకుని అందులో దాదాపు రూ.4కోట్లు ఖర్చు పెట్టి మరీ భారీ సెట్​ నిర్మించబోతున్నట్లు తెలిసింది. ఎంతో ప్రత్యేకంగా ఈ సెట్​ను తీర్చిదిద్దుతున్నారట. ఇందులోనే కొత్త షెడ్యూల్​ చిత్రకరించనున్నారని సమాచారం అందింది.

ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్లుగా శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఈ ఇద్దరితో పాటు సినిమాలోని ఇతర కీలక పాత్రలపై ఈ కొత్త షెడ్యూల్​లో చిత్రీకరణ జరపనున్నారట. తమన్ సినిమకు స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే రీసెంట్​గా మహేశ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన రెండు కొత్త మాస్​ పోస్టర్లు మహేశ్ అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్​ బ్యానర్​పై నిర్మిస్తున్నారు.