Begin typing your search above and press return to search.

పాన్‌ ఇండియాకి మహేష్ మైండ్‌ ప్రిపేర్‌...!

మొన్నటి వరకు మహేష్ బాబు పాన్ ఇండియా సినిమాల పట్ల ఆసక్తి చూపించేవాడు కాదు. కానీ రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్న సినిమా తో పాన్ ఇండియా రేంజ్‌ లో మహేష్ బాబు సందడి చేయబోతున్నాడు.

By:  Tupaki Desk   |   17 Jan 2024 5:12 AM GMT
పాన్‌ ఇండియాకి మహేష్ మైండ్‌ ప్రిపేర్‌...!
X

సూపర్ స్టార్‌ మహేష్ బాబు హీరోగా రూపొందిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను ఈ సినిమా దక్కించుకుంది. ఇంకా కూడా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ వసూళ్లను ఈ సినిమా నమోదు చేస్తున్నట్లు తెలుస్తోంది.

సినిమా విడుదల తర్వాత మహేష్ బాబు యూనిట్‌ సభ్యులకు పార్టీ ఇచ్చాడు. అదే సమయంలో యాంకర్ సుమ కి హీరోయిన్ శ్రీలీలతో కలిసి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సినిమాలోని విషయాలను, సినిమా వెనుక జరిగిన సంఘటనల గురించి మహేష్ బాబు చెప్పుకొచ్చాడు.

సినిమాలో మహేష్ బాబు ఎక్కువ సన్నివేశాల్లో బీడీ తాగినట్లు గా చూపించారు. ఆ విషయమై స్పందిస్తూ.. అది నిజమైన బీడీ కాదని, అది ఆయుర్వేదిక్‌ ఆకులతో తయారు చేసిందని మహేష్ బాబు అన్నాడు. అది ఆరోగ్యానికి ఎలాంటి హాని కలిగించదు అన్నట్లుగా మహేష్ బాబు పేర్కొన్నాడు.

మహేష్ బాబు తన తదుపరి పాన్ ఇండియా సినిమా ను రాజమౌళి తో చేయబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది. అందుకే గుంటూరు కారం మహేష్ బాబు యొక్క చివరి తెలుగు సినిమా అవ్వబోతుందని ఫ్యాన్స్ మొదటి నుంచి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.

మొన్నటి వరకు మహేష్ బాబు పాన్ ఇండియా సినిమాల పట్ల ఆసక్తి చూపించేవాడు కాదు. కానీ రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్న సినిమా తో పాన్ ఇండియా రేంజ్‌ లో మహేష్ బాబు సందడి చేయబోతున్నాడు. రాబోయే కొన్ని సంవత్సరాల వరకు తాను ఇలాంటి కమర్షియల్‌ తెలుగు సినిమాను చేయక పోవచ్చు అన్నట్లుగా మహేష్ బాబు చెప్పుకొచ్చాడు.

రాజమౌళి సినిమా కోసం మెల్ల మెల్లగా అలవాటు అవుతున్నట్లుగా మహేష్ బాబు వ్యాఖ్యలను చూస్తూ ఉంటే అర్థం అవుతుంది. సోషల్‌ మీడియాలో మహేష్ బాబు తాజా ఇంటర్వ్యూ వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ ఏడాది చివర్లో మహేష్‌, జక్కన్న సినిమా మొదలు అవ్వబోతుంది. 2026 వరకు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.