Begin typing your search above and press return to search.

సూప‌ర్ హిట్ ప్రాంచైజీ నుంచి థ‌ర్డ్ పార్ట్!

బాలీవుడ్ లో లేడీ ఓరియేంటెడ్ చిత్రాలంటే ఠ‌క్కున గుర్తొచ్చే సీనియ‌ర్ భామ రాణీ ముఖ‌ర్జీ.

By:  Tupaki Desk   |   23 Aug 2024 5:30 PM GMT
సూప‌ర్ హిట్ ప్రాంచైజీ నుంచి థ‌ర్డ్ పార్ట్!
X

బాలీవుడ్ లో లేడీ ఓరియేంటెడ్ చిత్రాలంటే ఠ‌క్కున గుర్తొచ్చే సీనియ‌ర్ భామ రాణీ ముఖ‌ర్జీ. ఉమెన్ సెంట్రిక్ చిత్రాల్లో తానో బ్రాండ్ అని ప్రూవ్ చేసింది. ఆమెని చూసే విద్యాబాల‌న్, క‌రీనా క‌పూర్ ఖాన్, దీపికా ప‌దుకొణే, అలియాభ‌ట్ లాంటి భామ‌లు సైతం లేడీ ఓరియేంటెడ్ చిత్రాల్లో స‌త్తా చాట‌డం మొద‌లు పెట్టారు. ముఖ్యంగా రాణీముఖ‌ర్జీ ప్ర‌ధాన పాత్ర పోషించిన మ‌ర్దానీ ప్రాంచైజీ ఎంత పెద్ద స‌క్సెస్ అయిందో చెప్పాల్సిన ప‌నిలేదు.

మ‌హిళ‌ల అక్ర‌మ ర‌వాణా, కిడ్నాప్ లాంటి అంశాల‌తో రూపొందిన `మ‌ర్దానీ`, `మ‌ర్దానీ-2` చిత్రాలు మంచి విజ‌యం సాధించాయి. శివానీ శివాజీ రాయ్ పాత్ర‌లో రాణీ న‌ట‌న ఆద్యంతం ఆక‌ట్టుకుంటుంది. య‌శ్ రాజ్ ఫిలింపై ఈ రెండు భాగాల్ని కూడా గోపీ పుత్రన్ తెర‌కెక్కించారు. తాజాగా ఈప్రాంచైజీ నుంచి మూడో భాగాన్ని ప్ర‌క‌టించారు. దానికి సంబంధించి ఓ ప్ర‌త్యేక‌మైన వీడియో ని రిలీజ్ చేసారు.

`ఎంతో మంది ప్రేక్ష‌కుల్ని అల‌రించిన మ‌ర్దానీ తొలి భాగం విడుద‌లై ప‌దేళ్లు పూర్త‌వుతుంది. దీని త‌దుప‌రి ఆధ్యాయం మీకోసం వేచి ఉందంటూ రివీల్ చేసారు. మర్దానీ 3 ఎలా ఉంటుందో చూడాల‌ని నేను కూడా ఉత్సాహంగా ఉన్నాను . అందులో న‌టించ‌డానికి సిద్దంగా ఉన్నాను. మ‌రిం వైవిథ్యంగా మూడవ భాగం ఉంటుంది` అని తెలిపింది.

దీంతో ఈ చిత్రాన్ని ఇదే ఏడాది ప‌ట్టాలెక్కించే అవ‌కాశం క‌నిపిస్తుంది. రాణీముఖ‌ర్జీ నుంచి సినిమా రిలీజ్ అయి ఏడాది దాటింది. గ‌త ఏడాది `మిస్ట‌ర్ ఛ‌ట‌ర్జీ వ‌ర్సెస్ నార్వే` చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఇది గ‌త ఏడాది మార్చిలో రిలీజ్ అయింది. అప్పటి నుంచి ఇంత‌వ‌ర‌కూ కొత్త సినిమా ప్ర‌క‌టించ‌లేదు. తాజాగా `మ‌ర్దానీ -3` అంటూ ప్ర‌క‌ట‌న రావ‌డంతో త్వ‌ర‌లో లాంచ్ అయ్యే సినిమా ఇదేన‌ని తెలుస్తోంది.