Begin typing your search above and press return to search.

సైలెంట్‌గా ఆ పనికి రెడీ అయిన ప్రేమలు బ్యూటీ.. షాక్‌లో ఫ్యాన్స్

ఓ స్టార్ హీరో సినిమాలో మమితా బైజు స్పెషల్ సాంగ్ చేయబోతోంది అని టాక్ వినిపిస్తుంది.

By:  Tupaki Desk   |   7 July 2024 10:30 AM GMT
సైలెంట్‌గా ఆ పనికి రెడీ అయిన ప్రేమలు బ్యూటీ.. షాక్‌లో ఫ్యాన్స్
X

గత కొద్ది కాలంగా ఇండస్ట్రీ‌తో సంబంధం లేకుండా అన్ని భాషల చిత్రాలకు ఆదరణ పెరుగుతోంది. మరీ ముఖ్యంగా టాలీవుడ్‌లో మలయాళం సినిమాలకు క్రేజ్ ఎక్కువగా కనిపిస్తుంది. కంటెంట్ సాలిడ్‌గా ఉంటే ప్రేక్షకులు భాషతో సంబంధం లేకుండా సినిమాకు ఎక్కే కనెక్ట్ అయిపోతున్నారు. రీసెంట్ గా ఎన్నో మలయాళం సినిమాలు తెలుగు ప్రేక్షకులను బాగా అలరించాయి. అలా తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న చిత్రాలలో ప్రేమలు కూడా ఒకటి.

ఈ మూవీలో హీరోయిన్ గా చేసిన మమితా బైజు తన క్యూట్ లుక్స్‌తో కుర్ర కారును ఫిదా చేసింది. ఈ మూవీలో ఆమె నటనకు పడిపోయిన యువత ఇలాంటి గర్ల్ ఫ్రెండ్ మనకు కూడా ఉంటే బాగుంటుంది అని కలలు కన్నారు. ఏ మూవీ చూసిన తర్వాత ఈ బ్యూటీ వివరాలు కనుక్కోవడానికి నెటిజన్స్ ఎంతో ఆసక్తి కనబరిచారు. గూగుల్.లో ఈమెకు సంబంధించిన వివరాల కోసం సర్చింగ్ విపరీతంగా జరిగింది.

అందం.. అభినయం కలగలిపిన ఈ బ్యూటీ తన నటనతో తెలుగింటి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. షార్ట్ ఫిలిమ్స్ తో తన కెరీర్ ప్రారంభించిన మమితా బైజు.. సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. 2017లో సర్వోపరి పాలక్కారన్‌తో ఆమె సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఖో‌ఖో చిత్రంలో ఆమె నటనకు ఉత్తమ సహాయ నటి అవార్డు కూడా లభించింది. ప్రేమలు మూవీ తర్వాత ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమాల్లో ఎప్పుడూ నటిస్తుందా అని టాలీవుడ్ అభిమానులు ఎదురు చూశారు.

అందరూ ఆశించినటే అతి త్వరలో మమితా బైజు తెలుగు సినిమాలతో ప్రేక్షకులను పలకరించబోతోంది . అది కూడా మామూలు స్టార్ సినిమాతో కాదు.. బుచ్చిబాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో వస్తున్న సరికొత్త చిత్రంలో నటించబోతోంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ‌తో కూడా ఓ సినిమాలో ఈమె చేస్తున్నట్లు టాక్. అయితే ప్రస్తుతం ఈ బ్యూటీ‌కి సంబంధించి మరొక వార్త ఆమె అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. ఓ స్టార్ హీరో సినిమాలో మమితా బైజు స్పెషల్ సాంగ్ చేయబోతోంది అని టాక్ వినిపిస్తుంది. కెరీర్ ప్రారంభ దశలోని ఇంత బోల్డ్ డెసిషన్ తీసుకోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు ఆమె అభిమానులు. మరికొందరు ఇది ఫేక్ న్యూస్ అని అంటున్నారు. ఈ విషయంపై క్లారిటీ త్వరలోనే తెలుస్తుంది.