Begin typing your search above and press return to search.

వీడియో : 'మనం' క్రేజ్ మామూలుగా లేదుగా!

అక్కినేని ఫ్యామిలీ మొత్తం కనిపించిన ‘మనం’ సినిమా వచ్చి దశాబ్ద కాలం పూర్తి అయ్యింది.

By:  Tupaki Desk   |   24 May 2024 7:18 AM GMT
వీడియో : మనం క్రేజ్ మామూలుగా లేదుగా!
X

అక్కినేని ఫ్యామిలీ మొత్తం కనిపించిన ‘మనం’ సినిమా వచ్చి దశాబ్ద కాలం పూర్తి అయ్యింది. మనం పదేళ్లు పూర్తి అయిన నేపథ్యంలో రీ రిలీజ్ చేశారు. ఈ సినిమాను మూడు థియేటర్లలో రీ రిలీజ్ చేశారు. హైదరాబాద్‌ దేవి 70 ఎంఎం లో ఈ షో ను వేయడంతో భారీగా జనాలు హాజరు అయ్యారు.

నాగ చైతన్య సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు. నాగ చైతన్య వస్తున్న సంగతి చెప్పకుండానే అక్కినేని ఫ్యాన్స్‌ దేవి థియేటర్‌ లో భారీ ఎత్తున సందడి చేశారు. చైతూ రావడంతో వారి సందడి మరింత పెరిగింది. అక్కినేని నాగేశ్వరరావు చివరి సినిమా అవ్వడంతో పాటు అక్కినేని మూడు జనరేషన్‌ హీరోలు కనిపించిన మనం అప్పట్లో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

విక్రమ్‌ కే కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన మనం సినిమా లో సమంత మరియు శ్రియా హీరోయిన్స్ గా కనిపించారు. నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య లు అక్కినేని ఫ్యాన్స్ కు కన్నుల విందు చేశారు. క్లైమాక్స్‌ లో అఖిల్‌ వచ్చి ఫ్యాన్స్ ఆనందాన్ని మరింతగా పెంచాడు.

ఈ మధ్య కాలంలో అక్కినేని ఫ్యాన్స్ కి సరైన హిట్‌ దక్కలేదు. నాగార్జున, నాగ చైతన్య, అఖిల్‌ ఇలా ప్రతి ఒక్కరి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. దాంతో మనం సినిమాకు అక్కినేని ఫ్యాన్స్ నుంచి మంచి స్పందన లభించింది.

మూడు థియేటర్లు కాదు ముప్పై థియేటర్లలో మనం ను రీ రిలీజ్ చేసి ఉంటే బాగుండేది అంటూ థియేటర్‌ కు వచ్చిన ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దేవి థియేటర్ లో నాగ చైతన్య ను చూసి ఫ్యాన్స్ కేరింతలు కొట్టారు. మనం వంటి సినిమా మళ్లీ రాదు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

హైదరాబాద్‌ దేవి థియేటర్‌ లోనే కాకంఉడా విజయవాడ మరియు వైజాగ్‌ లో కూడా మనం సినిమాను రీ రిలీజ్ చేశారు. రీ రిలీజ్ అయిన ప్రతి చోట కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అక్కినేని ఫ్యాన్స్ మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా మనం సినిమా కి మళ్లీ క్యూ కట్టారు.