Begin typing your search above and press return to search.

చ‌ర‌ణ్‌-బ‌న్ని వాట్సాప్ సీక్రెట్ చెప్పిన మంచు ల‌క్ష్మి

ల‌క్ష్మీ మంచు ఇటీవ‌ల ప్ర‌ముఖ‌ హోస్ట్ సిద్ధార్థ్ క‌న్న‌న్ తో మాట్లాడుతూ -``టాలీవుడ్ స్టార్ హీరోల టాప్ సీక్రెట్స్ గురించి బ‌హిరంగంగా వెల్ల‌డించారు.

By:  Tupaki Desk   |   2 July 2024 4:18 AM GMT
చ‌ర‌ణ్‌-బ‌న్ని వాట్సాప్ సీక్రెట్ చెప్పిన మంచు ల‌క్ష్మి
X

ప‌రిశ్ర‌మ‌లో ఆల్ రౌండ‌ర్ నైపుణ్యంతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన మంచు ల‌క్ష్మి ప్ర‌స్తుతం ముంబై ప‌రిశ్ర‌మ‌లో త‌న కెరీర్ గురించి సీరియ‌స్ గా ప్ర‌య‌త్నాల్లో ఉన్నార‌ని క‌థ‌నాలొచ్చాయి. హిందీ వెబ్ సిరీస్ లు, సినిమాల‌పైనా ల‌క్ష్మీ ఆస‌క్తిగా ఉన్నార‌ని, త్వ‌ర‌లోనే త‌న త‌దుప‌రి ప్రాజెక్టుల గురించి ప్ర‌క‌టిస్తార‌ని కూడా ఇటీవ‌ల‌ చ‌ర్చ సాగుతోంది. డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ య‌క్షిణి త‌ర్వాత త‌దుప‌రి సిరీస్ లు సినిమాల గురించి వెల్ల‌డించే అవ‌కాశం ఉంది.

ల‌క్ష్మీ మంచు ఇటీవ‌ల ప్ర‌ముఖ‌ హోస్ట్ సిద్ధార్థ్ క‌న్న‌న్ తో మాట్లాడుతూ -``టాలీవుడ్ స్టార్ హీరోల టాప్ సీక్రెట్స్ గురించి బ‌హిరంగంగా వెల్ల‌డించారు. రామ్ చరణ్, రానా దగ్గుబాటి, అల్లు అర్జున్‌ సహా 142 మంది నటీనటులతో వాట్సాప్ గ్రూప్‌లో తాను కూడా భాగంగా ఉన్నాన‌``ని ల‌క్ష్మీ మంచు వెల్లడించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో కుటుంబ భావనను సులభతరం చేసేందుకు ఈ గ్రూప్‌ను రూపొందించామని, తద్వారా నటీనటులు తమ చిత్రాలను, తాజా ప్రాజెక్టులను ప్రమోట్ చేసుకోవడంలో ఒకరికొకరు సహాయం చేసుకోవచ్చని అన్నారు. అందులో ఉన్న‌వారంతా నటులే. కాబట్టి టీజ‌ర్ లు ట్రైల‌ర్ల స‌మ‌యంలో వాటిని ఈ గ్రూప్ లో షేర్ చేస్తుంటాం. మ‌న గురించి మ‌న‌మంతా ఇక్క‌డ‌ పోస్ట్ చేయాలి. మనమంతా అరవాలి. అందుకే `ఈ శతృత్వం చాలు`` అంటూ ఈ గ్రూప్‌ని క్రియేట్ చేశామ‌ని ల‌క్ష్మీ తెలిపారు. వాట్సాప్ స‌మూహంలో మేమంతా చాలా దగ్గరగా ఉన్నాము. రామ్ చరణ్, రానా గురించి ఏం మాట్లాడుతున్నారు? అనేది నేను తెలుసుకోగ‌ల‌ను. మేమంతా కలిసి పెరిగాం.. ఆ గుంపు ఎప్పుడూ గుంపుగానే ఉంటుంది. కానీ మేం దానిని ఇంకా మెరుగుపరిచాము.. పెద్దదిగా చేసాము.. కాబట్టి నేను దాని గురించి చాలా గ‌ర్వపడుతున్నాను.. అని కూడా అన్నారు.

అంతేకాదు.. ఇదే ఇంట‌ర్వ్యూలో రామ్ చరణ్, రానా దగ్గుబాటితో తన స్నేహం ముంబైకి వెళ్లడానికి కార‌ణ‌మైంద‌ని ల‌క్ష్మీ టాప్ సీక్రెట్ ని రివీల్ చేసారు. వారు ప్ర‌భావితం చేయ‌డం వ‌ల్ల‌నే తాను ముంబైలో అవ‌కాశాల‌ను ప‌రిశీలిస్తున్నార‌ని వెల్ల‌డించారు.``నేను నా బెస్ట్ ఫ్రెండ్ రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఉండేదానిని. నేను ముంబైకి రావాలని తను ఎప్పుడూ పట్టుబట్టేది. నేను రానా (దగ్గుబాటి)తో చాటింగ్ చేశాను. ఎప్పటికీ హైదరాబాద్‌లో ఉండలేనని అతను చెప్పాడు. అంతేకాదు ముంబైలో రామ్ చరణ్ ఇంట్లోనే ఉండిపోయానని అయితే అది ఎవరికీ చెప్పలేదని వెల్లడించింది. తాను ముంబైలోని తన ఇంట్లో ఉంటున్నానని జ‌నాలకు చెప్పవద్దని రామ్ చరణ్‌కు చెప్పిన‌ట్టు వెల్ల‌డించింది.

టాలీవుడ్ లో అడుగుపెట్ట‌క మునుపు లక్ష్మి మంచు యుఎస్‌లో కొంతకాలం పనిచేసారు. లాస్ వెగాస్, బోస్టన్ లీగల్, డెస్పరేట్ హౌస్‌వైవ్స్ వంటి టీవీ సిరీస్ లు స‌హా ది ఓడ్, డెడ్ ఎయిర్ వంటి చిత్రాలలో నటించింది. అటుపై భారతదేశానికి తిరిగి వచ్చి 2011లో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. అన‌గ‌న‌గా ఒక ధీరుడు, గుండెల్లో గోదారి, W/O రామ్ వంటి చిత్రాలలో ల‌క్ష్మీ మంచు న‌టించారు. ఇటీవలే 2022లో మోహన్‌లాల్ నటించిన మాన్‌స్టర్‌తో మలయాళ చిత్రసీమలోకి అడుగుపెట్టారు. ఈ సంవత్సరం డిస్నీ+ హాట్‌స్టార్ సిరీస్ `యక్షిణి`లో ప్రధాన పాత్ర పోషించారు.