Begin typing your search above and press return to search.

మెరుపుల‌ గౌనులో ల‌క్ష్మీ మంచు త‌ళుకులు

ల‌క్ష్మీ మంచు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పాపుల‌ర్ ఫేస్. నటిగా, నిర్మాతగా, టెలివిజన్ వ్యాఖ్యాత‌గా ఆల్ రౌండ‌ర్ ప‌నిత‌నంతో మెప్పించారు

By:  Tupaki Desk   |   25 Jun 2024 4:18 PM GMT
మెరుపుల‌ గౌనులో ల‌క్ష్మీ మంచు త‌ళుకులు
X

ల‌క్ష్మీ మంచు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పాపుల‌ర్ ఫేస్. నటిగా, నిర్మాతగా, టెలివిజన్ వ్యాఖ్యాత‌గా ఆల్ రౌండ‌ర్ ప‌నిత‌నంతో మెప్పించారు. ల‌క్ష్మీ మంచు అరుదైన ఫ్యాష‌నిస్టా కూడా. ఇటీవ‌ల ల‌క్ష్మీ ఫోటోషూట్లు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతున్నాయి. నిరంత‌ర ఫోటోషూట్లు, వీడియో షూట్ల‌తో అభిమానులను ఆకర్షిస్తోంది. ఇటీవల ల‌క్ష్మీ మంచు పాపుల‌ర్ మీడియా అవార్డుల‌ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ తన NGO టీచ్ ఫర్ చేంజ్ కోసం అవార్డును అందుకోవ‌డంతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నారు. సోషల్ మీడియాలో లక్ష్మి మంచు అవార్డుల‌ షో నుండి వరుస ఫోటోలను పోస్ట్ చేయ‌గా అవి వైర‌ల్ గా మారాయి.

ఈ ఫోటోల్లో ల‌క్ష్మీ మంచు స్ట‌న్నింగ్ లుక్ తో ఆక‌ర్షించారు. మిరుమిట్లు గొలిపే బాడీకాన్ సిల్వర్ గౌనులో ల‌క్ష్మీ స్ట‌న్న‌ర్ గా క‌నిపించారు. లక్ష్మి మంచు ఓపెన్ హెయిర్ స్టైల్.. బోల్డ్ మేకప్ తో సంథింగ్ స్పెష‌ల్ గా క‌నిపించారు. అభిమానులు కామెంట్ల‌ విభాగంలో ఈ అందంపై తమ ప్రేమను వ్యక్తం చేయగా.. చాలామంది రెడ్ హార్ట్ ఎమోజీలను షేర్ చేసారు. మంచు క్వీన్ ఇంటర్నెట్ లో అగ్గి రాజేయ‌డం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా చాలా ఫోటోషూట్ల‌తో అభిమానులను ఉర్రూతలూగించారు.

'టీచ్ ఫర్ చేంజ్' కార్య‌క‌లాపాల‌ను గుర్తించిన నిర్వాహకులకు లక్ష్మీ మంచు ఈ సంద‌ర్భంగా కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ రాశారు. ''మా పనిని గుర్తించినందుకు మిడ్‌డే ఇండియా అవార్డులకు ధన్యవాదాలు. నిధులు, అవగాహన కోసం నాతో పాటు అవిశ్రాంతంగా పనిచేసిన నటీనటులు, వ్యక్తులందరి తిరుగులేని మద్దతు లేకుండా నేను ఈ అవార్డును పట్టుకుని ఇక్కడ నిలబడలేను''అని విన‌మ్రంగా త‌న‌ పోస్ట్‌లో పేర్కొన్నారు. గతంలో తమను ఆదరించిన ప్రతి ఒక్కరికీ ఈ అవార్డును అంకితమిచ్చారు లక్ష్మి మంచు. ఇప్ప‌టికే 643 తరగతి గదులను ప్రారంభించినట్లు ల‌క్ష్మీ మంచు పేర్కొన్నారు. మాకు మద్దతుగా నిలిచిన మీలో ప్రతి ఒక్కరికీ ఈ అవార్డు. మీ అంకితభావం నిబద్ధత కారణంగా, మేము ఈ రోజు గతంలో కంటే బలంగా అభివృద్ధి చెందుతున్నాము. మా మిషన్‌పై మీ విశ్వాసం మా విజయానికి మూలస్తంభంగా ఉంది. మేము కలిసి లెక్కలేనంత మంది పిల్లల జీవితాల్లో స్పష్టమైన మార్పును చూస్తున్నాము. మీ సహాయంతో మేము 643 తరగతి గదులను ప్రారంభించాము. ముఖ్యమైన విద్యావకాశాలను అందిస్తున్నాము. ఈ ప్రయాణంలో భాగమైనందుకు ధన్యవాదాలు. తరువాతి తరానికి స్ఫూర్తినివ్వడం, అవగాహన కల్పించడం .. శక్తివంతం చేయడం కొనసాగిద్దాం''అని ఈ పోస్ట్‌లో పేర్కొన్నారు.

గుండెల్లో గోదారి, అనగనగా ఓ ధీరుడు, చందమామ కథలు వంటి చిత్రాలతో లక్ష్మి మంచు న‌టిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చివరిసారిగా మాన్ స్ట‌ర్ అనే చిత్రంలో ల‌క్ష్మీ క‌నిపించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావ‌రేజ్ గా ఆడింది. ప్రస్తుతం లక్ష్మి టీవీ షోలు, సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉన్నారు. ఆదిపర్వం, లేచింది మహిళా లోకం, అగ్ని నక్షత్రం త‌దిత‌ర చిత్రాల‌తో అల‌రించ‌నుంది.