Begin typing your search above and press return to search.

ట్రోలింగ్స్ పై మంచు లక్ష్మి ఏమన్నారంటే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో తరచుగా స్టార్స్ ట్రోలింగ్స్ కి గురవుతూనే ఉంటారు.

By:  Tupaki Desk   |   27 May 2024 7:07 AM GMT
ట్రోలింగ్స్ పై మంచు లక్ష్మి ఏమన్నారంటే..
X

టాలీవుడ్ ఇండస్ట్రీలో తరచుగా స్టార్స్ ట్రోలింగ్స్ కి గురవుతూనే ఉంటారు. కొంతమంది స్టార్స్ ఏం చేసిన సోషల్ మీడియాలో కొంతమంది పనిగట్టుకొని వారిని రకరకాలుగా ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఇక మంచు ఫ్యామిలీ వారిపై కూడా అప్పుడప్పుడు కొన్ని కామెంట్స్ వినిపిస్తూ ఉంటాయి. మంచు ఫ్యామిలీ కూడా ఈ ట్రోల్స్ ని సీరియస్ గా తీసుకోవడం మానేసింది. కొన్ని సార్లు వీటిపై రియాక్ట్ అయ్యి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేశారు. ఇక ఆ తరువాత పెద్దగా పట్టించుకోవడం లేదు.

ఇక ఈ ఫ్యామిలీలో మంచు లక్ష్మీ పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఇక ఆమె కెరియర్ ఆరంభంలో తెలుగు స్పష్టంగా మాట్లాడలేకపోయేది. అమెరికాలో చదువుకోవడం వలన నేటివ్ ఇంగ్లీష్ యాక్సెంట్ తో తెలుగు మాట్లాడుతూ ఉండేది. ఆమె ఉచ్చారణని సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేసేవారు. ఆమె ఏం మాట్లాడిన ట్రోల్ చేస్తూ, ఆమె వ్యాఖ్యలని సోషల్ మీడియాలో వైరల్ చేసేవారు. అలాగే ఆమెపై పాజిటివ్ గా రియాక్ట్ అయ్యేవారు కూడా ఉన్నారు.

ఇక మంచు లక్ష్మి కీలక పాత్రలో నటించిన యక్షిణి వెబ్ సిరీస్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా తనపై జరిగిన ట్రోలింగ్స్ పై మంచు లక్ష్మి రియాక్ట్ అయ్యింది. నేను ఎంత స్పోర్టివ్ గా ఆలోచించే వ్యక్తిని అయిన కూడా ట్రోలింగ్స్ కారణంగా కొన్ని సందర్భాలలో బాధపడ్డానని మంచు లక్ష్మి తెలిపింది. నేను ఇండస్ట్రీ అమ్మాయిని. ముక్కుసూటిగా మాట్లాడటం నా తత్త్వం. ఉన్నది ఉన్నట్లు అనేస్తాను. మొహమాటం ఉండదు. నాకు తెలుగు ఉచ్చారణ కరెక్ట్ గా ఉండేది.

నా మాటలు కొందరికి నచ్చుతాయి. మరికొందరికి నచ్చవు. కావాలని ఎవరో పనిగట్టుకొని నన్ను ట్రోల్ చేస్తున్నారని అనుకోను. కానీ వాటి కారణంగా చాలాసార్లు బాధపడ్డా. తరువాత అలవాటైపోయింది. కన్నప్ప సినిమాలో నాకు సరిపోయే పాత్ర లేకపోవడం వలన చేయడం లేదని మంచు లక్ష్మి క్లారిటీ ఇచ్చింది. మంచు మనోజ్ కూడా కన్నప్ప చిత్రంలో నటించలేదని తెలిపింది.

అందరం కలిసి నటించడానికి అది ఫ్యామిలీ చిత్రం కాదని మంచు లక్ష్మి ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చింది. ఇదిలా ఉంటే మంచు లక్ష్మి లీడ్ రోల్ లో నటించిన ఆదిపర్వం మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. అలాగే మరో యాక్షన్ థ్రిల్లర్ జోనర్ మూవీ కూడా కంప్లీట్ చేసింది. యక్షిణి వెబ్ సిరీస్ తో మంచు లక్ష్మి పవర్ ఫుల్ క్యారెక్టర్ లో కనిపించబోతోంది.