Begin typing your search above and press return to search.

కన్నప్పలో మూడో తరం.. వ్వాటే కాంబో

దర్శకుడు ముఖేశ్ కుమార్ సింగ్ ఈ భారీ ప్రాజెక్ట్ కి దర్శకత్వం వహిస్తున్నారు.

By:  Tupaki Desk   |   23 Aug 2024 3:11 PM GMT
కన్నప్పలో మూడో తరం.. వ్వాటే కాంబో
X

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న "కన్నప్ప" సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా విష్ణు కి ఎంతో ప్రత్యేకమైనది, ఎందుకంటే మొదటిసారి 100 కోట్లకు పైగా బడ్జెట్ లో నటిస్తున్నాడు. కాబట్టి తప్పనిసరిగా సక్సెస్ అందుకోవాలని హార్డ్ వర్క్ చేస్తున్నాడు. తన తండ్రి మంచు మోహన్ బాబు నిర్మాణంలోనే ఈ చిత్రం రూపొందుతుంది. దర్శకుడు ముఖేశ్ కుమార్ సింగ్ ఈ భారీ ప్రాజెక్ట్ కి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనకు కూడా అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమా.


దర్శకుడిగా ముఖేష్ మరో లెవెల్ కు వెళ్ళాలి అంటే ఈ సినిమాతో గ్రాండ్ సక్సెస్ అందుకొని తీరాలి. "కన్నప్ప" సినిమా ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో పలు భాషల స్టార్స్ కలిసి నటిస్తున్నారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ వంటి పెద్ద నటీనటులు ఇందులో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

అలాగే కమెడియన్ బ్రహ్మానందం కూడా ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ భారీ తారాగణం కారణంగా సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. చిత్ర యూనిట్ ప్రతీ సోమవారం ఓ అప్‌డేట్ ఇస్తూ సినిమా పైన ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. పోస్టర్స్, కీలక పాత్రల పరిచయం వంటివి ప్రేక్షకులను మరింత ఆకర్షిస్తున్నాయి

ఈ క్రమంలో, కృష్ణ జన్మాష్టమి సందర్భంగా మరో కీలక అప్‌డేట్ ని విడుదల చేయబోతున్నట్లు సినిమా యూనిట్ ప్రకటించింది. ఈ అప్‌డేట్ విశేషం ఏమిటంటే, విష్ణు తనయుడు అవ్రామ్ మంచు ఈ సినిమాతో సినీరంగ ప్రవేశం చేయబోతున్నాడు. "కన్నప్ప"లో అతని పాత్రకు సంబంధించిన పోస్టర్ విడుదల చేయనున్నారు. మంచు కుటుంబం నుంచి మూడు తరాలు ఒకే సినిమాలో కలిసి నటించడం సినిమాకు ప్రత్యేకతను తెచ్చిపెడుతోంది.

మోహన్ బాబు, విష్ణు మంచు, అవ్రామ్ మంచు ఒకే సినిమాలో కనిపించడం ప్రేక్షకులకు సరికొత్త అనుభవాన్ని ఇస్తుంది. ఈ అప్‌డేట్ తో "కన్నప్ప" సినిమాపై అంచనాలు మరింత పెరుగుతాయని చెప్పవచ్చు. డిసెంబర్‌లో పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కాబోతున్న ఈ సినిమా అన్ని భాషల్లో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండబోతోందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.