Begin typing your search above and press return to search.

బీచ్‌లో నాగార్జున హీరోయిన్ యోగాభ్యాసం

మ‌నీషాకొయిరాలా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. అర‌వింద స్వామి స‌ర‌స‌న బొంబాయి చిత్రంలో, యాక్ష‌న్ కింగ్ అర్జున్ స‌ర‌స‌న ఒకే ఒక్క‌డు లో న‌టించింది

By:  Tupaki Desk   |   23 Oct 2024 3:33 AM GMT
బీచ్‌లో నాగార్జున హీరోయిన్ యోగాభ్యాసం
X

మ‌నీషాకొయిరాలా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. అర‌వింద స్వామి స‌ర‌స‌న బొంబాయి చిత్రంలో, యాక్ష‌న్ కింగ్ అర్జున్ స‌ర‌స‌న ఒకే ఒక్క‌డు లో న‌టించింది. అక్కినేని నాగార్జున స‌ర‌స‌న చాలా సంవ‌త్స‌రాల క్రిత‌మే క్రిమిన‌ల్ అనే సినిమాలోను న‌టించింది. ఈ మూవీలో నాగ్ - మ‌నీషా కొయిలారా రొమాన్స్ అద్భుతం అంటూ ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఇదిలా ఉంటే మ‌నీషాకొయిలారా జీవితంలో ఊహించ‌ని కుదుపులు, అనంత‌రం కంబ్యాక్ కోసం పోరాటం గురించి తెలిసిన‌దే. మ‌నీషాకు క్యాన్స‌ర్ రావ‌డంతో దానికి చికిత్స చేయించుకుని కోలుకుంది.

ఇటీవ‌ల సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించింది. మొన్న‌టికి మొన్న సంజ‌య్ లీలా భ‌న్సాలీ తెర‌కెక్కించిన క్లాసిక్ వెబ్ సిరీస్ హీరామండిలో మ‌నీషా కొయిలారా న‌టిగా మెప్పు పొందింది. భార‌త‌దేశంలో ఉన్న ఫైనెస్ట్ హీరోయిన్ల‌లో మ‌నీషా ఒక‌రు అన్న ప్ర‌శంస‌లు కురిసాయి.

ఇక మ‌నీషా కొయిరాలా డైలీ వ‌ర్క‌వుట్స్ గురించి చెప్పుకుని తీరాలి. ఈ భామ త‌న వ్యాయామ సాధ‌న‌కు సంబంధించిన చాలా విష‌యాల‌ను వెల్ల‌డించారు. మ‌నీషా మాట్లాడుతూ..``యోగా, జిమ్, ఏరోబిక్స్ లేదా డ్యాన్స్ ఏ రూపంలోనైనా కదులుతూ ఉండండి. ముంబైలో ఉన్నప్పుడు, బీచ్‌లో యోగా సాధన చేయడం నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా తెల్లవారుజామున నగరం నిశ్శబ్దంగా ఉన్నప్పుడు సముద్రపు గాలి ఆత్మకు శక్తినిస్తుంది. బీచ్‌లో మనకు మన చుట్టూ ఉన్న ప్రపంచంతో లోతైన సంబంధం ఉంది. మీరు మీ శరీరం , మనస్సును కదలికలో నిమగ్నం చేసినప్పుడు ప్రతిదీ పెద్దదిగా, ప్రకాశవంతంగా మరింత ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఇది శాంతి భావనను తెస్తుంది`` అని అన్నారు. #YogaOnTheBeach #MumbaiMornings #StayActive అనే హ్యాష్ ట్యాగుల‌ను వైర‌ల్ చేస్తున్నారు.